BRICS Summit: బ్రిక్స్ తర్వాత ప్రపంచ నాయకులకు అస్వస్థత అంటూ తప్పుడు ప్రచారం.. తీవ్రంగా ఖండించిన భారత్
- బ్రిక్స్ తర్వాత ప్రపంచ నాయకులకు అస్వస్థత అంటూ తప్పుడు ప్రచారం
- సౌతాఫ్రికా అధ్యక్షుడికి అనారోగ్యమంటూ ప్రచారం
- తీవ్రంగా ఖండించిన భారత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత వారం దేశ రాజధాని ఢిల్లీ వేదికగా అంతర్జాతీయ బ్రిక్స్ సదస్సు జరిగింది. ఈ సమావేశానికి రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్, సౌతాఫ్రికా అధ్యక్షుడు రామఫోసా తదితర దేశాధినేతలంతా హాజరయ్యారు. అయితే తాజాగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్కు, సౌతాఫ్రికా అధ్యక్షుడు రామఫోసాకు అనారోగ్యానికి గురైనట్లుగా అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. బ్రిక్స్ నుంచి వచ్చాక అధ్యక్షుడు రామఫోసా విశ్రాంతి తీసుకుంటున్నారని సౌతాఫ్రికా అధ్యక్ష భవనం ఇప్పటికే తెలిపింది.

Also Read
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
- Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
- MP Kanimozhi Changes Name: పేరు మార్చుకున్న ఎంపీ కనిమొళి.. కొత్త పేరు ఏంటంటే?
అయితే ఈ ప్రకటనను ఆసరాగా చేసుకుని చాలా మంది సోషల్ మీడియాలో బ్రిక్స్ తర్వాత ప్రపంచ నాయకులు అస్వస్థతకు గురైనట్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర విదేశాంగ అప్రమత్తమైంది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టింది. ఈ వార్తలన్నీ నకిలీ వార్తలుగా కొట్టిపారేసింది. ఇలాంటి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయవద్దని హెచ్చరించింది. ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాలని సూచించింది.
ఈ వార్తలు కేవలం దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రామఫోసా సదస్సు ముగిసిన తర్వాత బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉండటంతో తెరపైకి వచ్చాయి. అయితే రామఫోసా అనారోగ్యంతో వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకుంటున్నట్లు దక్షిణాఫ్రికా అధ్యక్ష కార్యాలయం అధికారికంగా వెల్లడించింది. 73 ఏళ్ల రామఫోసా సెప్టెంబర్ 14న న్యూఢిల్లీ నుంచి దక్షిణాఫ్రికాకు తిరిగి వెళ్లారు. ఆ తర్వాత ఆయన ఆరోగ్యం దెబ్బతినడంతో వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు దక్షిణాఫ్రికా ప్రెసిడెన్సీ సెప్టెంబర్ 16న తెలిపింది. బహిరంగ కార్యక్రమాలకు హాజరు కాలేని పరిస్థితిలో, సాధ్యమైన చోట్ల ఆయా కార్యక్రమాలకు సంబంధిత మంత్రులు తన తరఫున హాజరుకావాలని రామఫోసా కోరినట్లు అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది. అయితే రామఫోసా అనారోగ్యానికి BRICS సదస్సుతో సంబంధం ఉందని అధికారికంగా ఎలాంటి ఆధారాలు వెల్లడికాలేదు. దీనికి విరుద్ధంగా పలువురు ప్రపంచ నేతలు అనారోగ్యానికి గురయ్యారంటూ వస్తున్న వార్తలను భారత విదేశాంగ శాఖ ఫేక్గా పేర్కొంది.
దక్షిణాఫ్రికా డిప్యూటీ ప్రెసిడెంట్ పాల్ మషటిలే కూడా ఇటీవల ఓ చిన్న వైద్య ప్రక్రియ చేయించుకున్నారు. వైద్యుల సూచన మేరకు తాను విశ్రాంతి తీసుకుంటున్నట్లు సెప్టెంబర్ 15న ఆయన తెలిపారు. అయితే తన కార్యాలయంలోని బృందం, ప్రభుత్వంలోని ఇతర అధికారులు పనులను కొనసాగిస్తున్నారని వెల్లడించారు. దీంతో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు ఇద్దరూ ఒకేసారి బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉండటంతో ఈ అంశంపై సోషల్ మీడియాలో పలు ఊహాగానాలు మొదలయ్యాయి.
రామఫోసా సెప్టెంబర్ 11న న్యూఢిల్లీకి చేరుకుని 12, 13 తేదీల్లో జరిగిన 18వ BRICS సదస్సులో పాల్గొన్నారు. BRICS సమావేశాల్లో ఆయన ఐక్యరాజ్యసమితి సంస్కరణలు, బహుపాక్షిక సహకారం, వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత తదితర అంశాలపై ప్రసంగించారు. సదస్సులో పాల్గొన్న సందర్భంగా రామఫోసా భారత్ ఆతిథ్యానికి ధన్యవాదాలు తెలిపారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు అంతర్జాతీయ నిర్ణయ ప్రక్రియలో మరింత ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు.
తప్పుడు ప్రచారంపై కేంద్రం హెచ్చరిక
BRICS సదస్సు తర్వాత పలువురు ప్రపంచ నాయకులు అనారోగ్యానికి గురయ్యారంటూ వస్తున్న వార్తలను MEA ఖండించడంతో ఈ అంశంపై కొనసాగుతున్న ఊహాగానాలకు తెరపడినట్లైంది. ఒక దేశాధ్యక్షుడు అనారోగ్యంతో విశ్రాంతి తీసుకుంటున్నారనే అధికారిక సమాచారాన్ని ఆధారంగా చేసుకుని, పలువురు నేతల ఆరోగ్యంపై నిర్ధారణ లేని కథనాలు ప్రచారం చేయడం సరికాదని కేంద్రం స్పష్టం చేసింది.

- Tags
- Brics summit
- Delhi
- fake news
తాజావార్తలు
-
BRICS Summit: బ్రిక్స్ తర్వాత ప్రపంచ నాయకులకు అస్వస్థత అంటూ తప్పుడు ప్రచారం.. తీవ్రంగా ఖండించిన భారత్
-
Sarah Shahi: బెడ్రూమ్ సీన్లలో హీరోల స్పర్శ తగలకుండా ఆ బాల్తోనే.. బోల్డ్ సీన్స్ అసలు గుట్టు విప్పిన హీరోయిన్!
-
Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
-
Sanju Samson: ఇక ఫెయిల్ అవ్వడు.. హాఫ్ సెంచరీలే.. సంజు శాంసన్పై సన్నీ కీలక వ్యాఖ్యలు!
-
Tollywood: లాస్ట్ మినిట్ టెన్షన్స్.. చిన్న సినిమాల మేకర్స్ కి ఏమైంది?
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!