Modi-Jinping: అరుదైన ఖనిజాలు, వాణిజ్య లోటు.. మోడీ-జిన్పింగ్ భేటీలో కీలకాంశాలు..
- ఏడేళ్ల తర్వాత భారత్కు వచ్చిన షీ జిన్పింగ్.. మోదీతో కీలక భేటీ.
- అరుదైన భూ ఖనిజాల సరఫరాపై చైనాతో భారత్ చర్చించే అవకాశం.
- ఎలక్ట్రానిక్స్, ఈవీలు, బ్యాటరీలు, రక్షణ రంగాలకు రేర్ ఎర్త్ మినరల్స్ కీలకం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Modi-Jinping: బ్రిక్స్ సమావేశాల కోసం చైనా అధ్యక్షుడు షి జిన్పింగ్ న్యూఢిల్లీ వచ్చారు. శనివారం సాయంత్రం భారత మండపంలో ఇరువురు నేతలు భేటీ కానున్నారు. భారత్-చైనా ద్వైపాక్షిక చర్చలకు చాలా ప్రాధాన్యత ఏర్పడింది. వాణిజ్య లోటు, రేర్ ఎర్త్ మినరల్స్, ఎరువు సరఫరా, వాణిజ్య ఒప్పందాల వంటి పలు కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. మోడీ-జిన్పింగ్ భేటీపై ప్రపంచ దృష్టి నెలకొంది.
అరుదైన ఖనిజాలపై చర్చ:
ప్రపంచ టెక్నాలజీకి ఇప్పుడు రేర్ ఎర్త్ మెటల్స్, రేర్ ఎర్త్ మాగ్నెట్స్ కీలకంగా మారాయి. ఈ రంగంలో చైనా 90 శాతం వాటాను నియంత్రిస్తోంది. భారతదేశం ఈ రంగంలో స్వయం సమృద్ధి సాధించడానికి ప్రయత్నిస్తోంది. సెమీకండక్టర్ రంగంలో భారత్ స్వయం సమృద్ధి సాధించడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో, భారత ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, ఈవీ, బ్యాటరీ, రక్షణ, హైటెక్ తయారీ రంగాలకు ఈ అరుదైన రేర్ ఎర్త్ మెటల్స్ చాలా కీలకం. రేర్ ఎర్త్ మెటల్స్ గురించి భారత్, చైనా మధ్య చర్చలు జరిగే అవకాశం ఉంది.
Also Read
- Saudi Arabia Oil: హోర్ముజ్ తర్వాత మరో షాక్.. మూతపడ్డ సౌదీ చమురు పైప్లైన్.. భారత్కు పెరిగిన కష్టాలు!
- Prajwal Revanna: జైల్లో ప్రజ్వల్ రేవణ్ణతో మొబైల్, పెన్డ్రైవ్.. ఆ ఫోన్లలోనూ అశ్లీల వీడియోలు..!
- Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
- Xi Jinping: భారత్లో అడుగు పెట్టిన చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్.. మోడీతో భేటీపై అందరి చూపు..
వాణిజ్య లోటు:
భారత దేశానికి సంబంధించి ఆందోళన కలిగించే అంశం చైనాతో ఉన్న వాణిజ్యలోటు. చైనా నుంచి భారత్ భారీ స్థాయిలో దిగుమతులు చేసుకుంటోంది. ఇదే సమయంలో చైనాకు భారత ఎగుమతులు చాలా తక్కువగా ఉన్నాయి. 2025లో, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం సుమారుగా $155.6 బిలియన్లకు చేరుకోగా, చైనాతో భారతదేశ వాణిజ్య లోటు సుమారుగా $115 బిలియన్లుగా ఉంది. భారత్ చైనా నుంచి ప్రధానంగా ఎలక్ట్రానిక్స్, యంత్రాలు, రసాయనాలు, సౌర పరికరాలు, ఇతర వస్తువుల్ని కొనుగోలు చేస్తోంది. ఈ చర్చల్లో భారత వస్తువులకు చైనా తన మార్కెట్ తెరిచేలా ప్రోత్సహించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది.
మోడీ-జిన్పింగ్ భేటీపై ప్రపంచం దృష్టి:
2020లో గాల్వాన్ సంఘర్షణ తర్వాత భారత్-చైనా సంబంధాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఇరు దేశాలు ప్రస్తుతం చర్చలు, వాణిజ్య సంబంధాలను పెంపొందించుకోవడం వల్ల ఉద్రిక్తతలు క్రమంగా తగ్గుతున్నాయి. ఏడేళ్ల తర్వాత తొలిసారి జిన్పింగ్ భారత్ వస్తుండటం, మోడీతో భేటీ అవుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. జనాభా పరంగా, ఆర్థిక పరంగా అతిపెద్ద దేశాలుగా ఉన్న చైనా, భారత్ కలిసి పనిచేస్తే అది ప్రపంచానికి సహాయంగా ఉంటుంది. దీంతో ఈ భేటీపై ప్రపంచ దృష్టి నెలకొంది.
తాజావార్తలు
-
Modi-Jinping: అరుదైన ఖనిజాలు, వాణిజ్య లోటు.. మోడీ-జిన్పింగ్ భేటీలో కీలకాంశాలు..
-
Soori : అద్దం ముందు షర్ట్ విప్పేసి.. నా ఒంటిపై ఉన్న గాయాలకు నేనే ముద్దులు పెట్టుకున్నా.
-
Ganesh Utsav: ఇంటికే పరిమితమైన గణపతి గల్లీలోకి ఎలా వచ్చాడో తెలుసా? 1905 నాటి ఆ చరిత్ర ఇదిగో!
-
Notification Cancelled: నిరుద్యోగులకు అలర్ట్.. TGPSC నుంచి విడుదలైన ఆ నోటిఫికేషన్ రద్దు..
-
Irumudi Effect : అయ్యప్ప దీక్షలో గణపయ్య.. తలపై స్వయంగా ‘ఇరుముడి’ పెడుతున్న శివుడు!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!