Tamil Nadu: ప్రియురాలు పదే పదే ఆ ప్రస్తావన తేవడంతో ప్రియుడు ఏం చేశాడంటే..!
- తమిళనాడులో ఘోరం
- ప్రియురాలిని చంపిన ప్రియుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడులో ఘోరం జరిగింది. ప్రియురాలు పదే పదే పెళ్లి ప్రస్తావన తీసుకురావడంతో ప్రియుడు ఘాతుకానికి తెగబడ్డాడు. పొలంలోకి పిలిచి అత్యంత దారుణంగా హతమార్చాడు. ఈ దారుణం ఈరోడ్ జిల్లాలోని ఓ ప్రైవేటు అరటి తోటలో జరిగింది.
సోనియా అప్పకుడల్ పట్టణానికి చెందిన బ్యూటీషియన్. భర్త చనిపోవడంతో ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి దగ్గర ఉంటుంది. రెండేళ్ల క్రితం గోబిచెట్టిపాళయం సమీపంలోని ఒక వస్త్ర దుకాణంలో పనిచేస్తున్నప్పుడు బీకాం గ్రాడ్యుయేట్ మోహన్ కుమార్(27)తో పరిచయం ఏర్పడి సహజీవనానికి దారి తీసింది. మోహన్కుమార్కు అరటి తోట కూడా ఉంది. అయితే నవంబర్ 2 నుంచి సోనియా ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలో పొలాల్లో స్థానికులు పుట్టగొడుగులు సేకరిస్తున్నారు. ఈ క్రమంలో రక్తపు మరకలు ఉన్న కత్తి, మట్టిలో మహిళ వెంట్రుకలు బయటకు కనిపించాయి. దాదాపు మూడు అడుగుల గుంతలో మహిళ మృతదేహం కనిపించింది. దీంతో పోలీసులకు సమాచారం అందించడంతో హత్య వెలుగులోకి వచ్చింది.
Also Read
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Mamata Banerjee: మమతా దీదీకి మరో షాక్.. ముస్లిం ఎమ్మెల్యేల తిరుగుబాటు..
- Mohan Bhagwat: ప్రపంచం మన మాట వినాలంటే శక్తి కూడా అవసరం.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- DMK: లోక్సభలో కాంగ్రెస్తో కలిసి కూర్చోం.. డీఎంకే నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్..!
ఇది కూడా చదవండి: India-Afghanistan: బలపడుతున్న భారత్-ఆప్ఘని బంధం.. ఢిల్లీలో తాలిబన్ దౌత్యవేత్త నియామకానికి ఏర్పాట్లు
ఇక పోలీసులు సంఘటనాస్థలికి వచ్చి పొలంలో మృతదేహం వెలికితీస్తున్న క్రమంలో మోహన్ కుమార్ కూడా అక్కడే ఉన్నాడు. ఏమీ ఎరగనట్టుగా నటిస్తూ కనిపించాడు. దీంతో ఫోన్ కాల్స్ తనిఖీ చేయగా మోహన్కుమార్తో సంబంధం ఉన్నట్లుగా తేలింది. దీంతో అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించాడు. పదే పదే పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో చంపేసినట్లుగా ఒప్పుకున్నాడు.
ఇది కూడా చదవండి: Hail Lashes : వామ్మో.. క్రికెట్ బాల్ సైజులో వడగళ్ల వాన.. ఎక్కడో తెలుసా..
సోనియా-మోహన్ కుమార్ రెండేళ్ల నుంచి ప్రేమలో ఉన్నారని.. పెళ్లి చేసుకోవాలని విసిగించడంతోనే చంపేశాడని పోలీసులు తెలిపారు. ఎక్కువ సార్లు వ్యవసాయ భూమిలోనే ఇద్దరూ కలుసుకునేవారిని చెప్పారు. నేరం జరిగిన రోజు మోహన్ కుమార్ రాత్రి 8గంటల ప్రాంతంలో ఒక గొయ్యి తవ్వాడని.. అనంతరం సోనియాను పిలిచి ఆమెతో గడిపిన తర్వాత రాయితో దాడి చేసి కత్తితో పొడిచి చంపేసినట్లు తెలిపారు. అటు తర్వాత మృతదేహాన్ని గోతిలో పాతిపెట్టేసి.. ఫోన్, దుస్తులు భవానీ కాలువ దగ్గర పడేసి వెళ్లిపోయాడని వివరించారు.
సిరువలూరు పోలీస్ స్టేషన్ అధికారులు, రెవెన్యూ అధికారులు, పెరుండురై ప్రభుత్వ వైద్య కళాశాల వైద్య బృందం సంఘటనా స్థలంలోనే పోస్ట్మార్టం నిర్వహించారు. మోహన్ కుమార్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కేసు దర్యా్ప్తు జరుగుతోందని వెల్లడించారు.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!