Rahul Gandhi: రాహుల్ గాంధీ ‘‘పార్టీల’’ లీడర్.. బెర్లిన్ టూర్పై బీజేపీ విమర్శలు..
- రాహుల్ గాంధీ బెర్లిన్ టూర్పై బీజేపీ విమర్శలు..
- పార్టీల లీడర్ అంటూ కాషాయ పార్టీ ఫైర్..
- ప్రధాని మోడీ విదేశీ పర్యటనల్ని లేవనెత్తిన కాంగ్రెస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: కాంగ్రెస్ నాయకుడు, లోక్సభలో ప్రతిపక్ష నేత అయిన రాహుల్ గాంధీపై బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్న సమయంలో రాహుల్ జర్మనీ పర్యటనకు వెళ్తున్నారు. దీంతో, బీజేపీ ఆయన లక్ష్యంగా కీలక వ్యాఖ్యలు చేసింది. రాహుల్ గాంధీ ‘‘పర్యాటన నాయకుడు’’అని అభివర్ణించింది. దీంతో కాంగ్రెస్ కూడా ప్రధాని మోడీ విదేశీ పర్యటల్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేసింది. డిసెంబర్ 15 నుండి 20 వరకు ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ కార్యక్రమంలో పాల్గొనడానికి ఆయన బెర్లిన్ వెళ్తున్నారు. మరోవైపు, శీతాకాల సమావేశాలు డిసెంబర్ 19న ముగియనున్నాయి.
Read Also: Dimple hayathi : వేడి వేడి అందాలతో చలికి సెగలు తెప్పిస్తున్న డింపుల్ హయతి
Also Read
- Air India Plane Crash Anniversary: 260 మంది ప్రాణాలు గాల్లో కలిసిన వేళ.. ఏడాది గడిచినా వీడని సస్పెన్స్?
- Rajnath Singh: హైదరాబాద్కు రక్షణ మంత్రి రాక.. నేడు, రేపు మేధావులతో భేటీలు, శాస్త్రవేత్తలతో ప్రత్యేక సమావేశం
- AIR INDIA Crash: ఆ మూడు సెకన్లలో అసలేం జరిగింది? విమానం కూలి ఏడాది గడుస్తున్నా ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నలు!
- New IRCTC Website: శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి.. జులై 15 నాటికి అందుబాటులోకి కొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్..
రాహుల్ గాంధీ పర్యటనపై బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా మాట్లాడుతూ.. ఆయన లోక్సభలో ప్రతిపక్ష నేత కన్నా ‘‘పర్యాటన నాయకుడు’’, ‘‘పార్టీల నాయకుడు’’ అని నిరూపించారని అన్నారు. రాహుల్ గాందీ సీరియస్ రాజకీయ నాయకుడు కాదని విమర్శించారు. ప్రజలు పని మూడ్లో ఉంటారు, కానీ ఆయన శాశ్వత సెలవు మోడ్లో ఉన్నారని ఎద్దేవా చేశారు. ఇటీవల బీహార్ ఎన్నికల సమయంలో అతను జంగిల్ సఫారీలో ఉన్నాడని గుర్తు చేశారు. అతను జర్మనీ వెళ్లి మరోసారి భారత్పై విషం కక్కుతాడని పునావాలా అన్నారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు రాహుల్ విదేశాల్లో సమయం గడుపుతారని, ఆ తర్వాత మాట్లాడే అవకాశం ఇవ్వలేదని అంటారని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ఆయన పార్ట్ టైమ్, నాన్ సీరియస్ రాజకీయ నాయకుడని అన్నారు.
బీజేపీ విమర్శలపై కాంగ్రెస్ కూడా అంతే ఘాటుగా స్పందించింది. ప్రియాంకా గాంధీ మాట్లాడుతూ.. ప్రధాని మోడీ తన పని సమయంలో సగం కాలం విదేశాల్లోనే ఉంటారని విమర్శించారు. ప్రతిపక్ష నేత ప్రయాణాలపై బీజేపీ ఎందుకు ప్రశ్నల్ని లేవనెత్తుతోందని అడిగారు. లోక్సభలో ప్రతిపక్ష ఉప నాయకుడు గౌరవ్ గొగోయ్ మాట్లాడుతూ.. ఎన్నికల అక్రమాలపై రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నలకు బీజేపీ, ప్రధాని మోడీ వద్ద సమాధానాలు లేవని, ఆయను అవమానించడమే బీజేపీ లక్ష్యంగా పెట్టుకుందని మండిప్డడారు.
తాజావార్తలు
-
Ben Stokes-ECB: పూర్తిస్థాయి నిషేధంపై ఆలోచిస్తున్నాం.. బాంబ్ పేల్చిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు!
-
The Odyssey : ‘ది ఒడిస్సీ’కి భయపడి ప్రీ పోన్ చేసుకుంటోన్న బాలీవుడ్ ఫిల్మ్స్
-
2027 ODI World Cup: హార్దిక్ పాండ్యా ఎందుకు.. ఆ తెలుగోడే ‘సరైనోడు’!
-
Prabhas : షాకింగ్.. ఫౌజీ vs స్పిరిట్?
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
ట్రెండింగ్
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?