Rahul Gandhi: రాహుల్ గాంధీ ‘‘పార్టీల’’ లీడర్.. బెర్లిన్ టూర్పై బీజేపీ విమర్శలు..
- రాహుల్ గాంధీ బెర్లిన్ టూర్పై బీజేపీ విమర్శలు..
- పార్టీల లీడర్ అంటూ కాషాయ పార్టీ ఫైర్..
- ప్రధాని మోడీ విదేశీ పర్యటనల్ని లేవనెత్తిన కాంగ్రెస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: కాంగ్రెస్ నాయకుడు, లోక్సభలో ప్రతిపక్ష నేత అయిన రాహుల్ గాంధీపై బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్న సమయంలో రాహుల్ జర్మనీ పర్యటనకు వెళ్తున్నారు. దీంతో, బీజేపీ ఆయన లక్ష్యంగా కీలక వ్యాఖ్యలు చేసింది. రాహుల్ గాంధీ ‘‘పర్యాటన నాయకుడు’’అని అభివర్ణించింది. దీంతో కాంగ్రెస్ కూడా ప్రధాని మోడీ విదేశీ పర్యటల్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేసింది. డిసెంబర్ 15 నుండి 20 వరకు ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ కార్యక్రమంలో పాల్గొనడానికి ఆయన బెర్లిన్ వెళ్తున్నారు. మరోవైపు, శీతాకాల సమావేశాలు డిసెంబర్ 19న ముగియనున్నాయి.
Read Also: Dimple hayathi : వేడి వేడి అందాలతో చలికి సెగలు తెప్పిస్తున్న డింపుల్ హయతి
Also Read
- Supreme Court: సుప్రీం కోర్టుకు హనీమూన్ మర్డర్ కేసు.. ఏం జరిగిందంటే..!
- Murder Case: 'నీలాంటి భర్తలు వెయ్యి మంది దొరుకుతారు'.. ఆ ఒక్క మాటతో జరిగిన ఘోరం, హైకోర్టు కీలక తీర్పు
- Maharashtra Politics: కాంగ్రెస్లో శరద్ పవార్ పార్టీ విలీనం ? మహారాష్ట్ర రాజకీయాల్లో తెరవెనుక నడుస్తున్న హైడ్రామా ఇదే!
- Ayodhya Ram Mandir: అయోధ్య రామ్ మందిర్ కొలువుల్లో 'కమిషన్ల' భాగోతం.. ట్రస్ట్ కీలక సభ్యుల రాజీనామా వెనుక అసలు రహస్యం ఇదేనా?
రాహుల్ గాంధీ పర్యటనపై బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా మాట్లాడుతూ.. ఆయన లోక్సభలో ప్రతిపక్ష నేత కన్నా ‘‘పర్యాటన నాయకుడు’’, ‘‘పార్టీల నాయకుడు’’ అని నిరూపించారని అన్నారు. రాహుల్ గాందీ సీరియస్ రాజకీయ నాయకుడు కాదని విమర్శించారు. ప్రజలు పని మూడ్లో ఉంటారు, కానీ ఆయన శాశ్వత సెలవు మోడ్లో ఉన్నారని ఎద్దేవా చేశారు. ఇటీవల బీహార్ ఎన్నికల సమయంలో అతను జంగిల్ సఫారీలో ఉన్నాడని గుర్తు చేశారు. అతను జర్మనీ వెళ్లి మరోసారి భారత్పై విషం కక్కుతాడని పునావాలా అన్నారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు రాహుల్ విదేశాల్లో సమయం గడుపుతారని, ఆ తర్వాత మాట్లాడే అవకాశం ఇవ్వలేదని అంటారని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ఆయన పార్ట్ టైమ్, నాన్ సీరియస్ రాజకీయ నాయకుడని అన్నారు.
బీజేపీ విమర్శలపై కాంగ్రెస్ కూడా అంతే ఘాటుగా స్పందించింది. ప్రియాంకా గాంధీ మాట్లాడుతూ.. ప్రధాని మోడీ తన పని సమయంలో సగం కాలం విదేశాల్లోనే ఉంటారని విమర్శించారు. ప్రతిపక్ష నేత ప్రయాణాలపై బీజేపీ ఎందుకు ప్రశ్నల్ని లేవనెత్తుతోందని అడిగారు. లోక్సభలో ప్రతిపక్ష ఉప నాయకుడు గౌరవ్ గొగోయ్ మాట్లాడుతూ.. ఎన్నికల అక్రమాలపై రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నలకు బీజేపీ, ప్రధాని మోడీ వద్ద సమాధానాలు లేవని, ఆయను అవమానించడమే బీజేపీ లక్ష్యంగా పెట్టుకుందని మండిప్డడారు.
తాజావార్తలు
-
Supreme Court: సుప్రీం కోర్టుకు హనీమూన్ మర్డర్ కేసు.. ఏం జరిగిందంటే..!
-
Anirudh: బక్కోడు మాములోడు కాదుగా!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Rahul Samit: రాహుల్ సమిత్ మెరుపులు.. ద్రవిడ్ శైలి.. 360 డిగ్రీ బ్యాటింగ్!
-
Murder Case: ‘నీలాంటి భర్తలు వెయ్యి మంది దొరుకుతారు’.. ఆ ఒక్క మాటతో జరిగిన ఘోరం, హైకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?