Rahul Gandhi: రాహుల్ గాంధీ ‘‘పార్టీల’’ లీడర్.. బెర్లిన్ టూర్పై బీజేపీ విమర్శలు..
- రాహుల్ గాంధీ బెర్లిన్ టూర్పై బీజేపీ విమర్శలు..
- పార్టీల లీడర్ అంటూ కాషాయ పార్టీ ఫైర్..
- ప్రధాని మోడీ విదేశీ పర్యటనల్ని లేవనెత్తిన కాంగ్రెస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: కాంగ్రెస్ నాయకుడు, లోక్సభలో ప్రతిపక్ష నేత అయిన రాహుల్ గాంధీపై బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్న సమయంలో రాహుల్ జర్మనీ పర్యటనకు వెళ్తున్నారు. దీంతో, బీజేపీ ఆయన లక్ష్యంగా కీలక వ్యాఖ్యలు చేసింది. రాహుల్ గాంధీ ‘‘పర్యాటన నాయకుడు’’అని అభివర్ణించింది. దీంతో కాంగ్రెస్ కూడా ప్రధాని మోడీ విదేశీ పర్యటల్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేసింది. డిసెంబర్ 15 నుండి 20 వరకు ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ కార్యక్రమంలో పాల్గొనడానికి ఆయన బెర్లిన్ వెళ్తున్నారు. మరోవైపు, శీతాకాల సమావేశాలు డిసెంబర్ 19న ముగియనున్నాయి.
Read Also: Dimple hayathi : వేడి వేడి అందాలతో చలికి సెగలు తెప్పిస్తున్న డింపుల్ హయతి
Also Read
- Petrol, Diesel Prices Hiked: మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. పదిరోజుల్లో మూడోసారి
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
రాహుల్ గాంధీ పర్యటనపై బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా మాట్లాడుతూ.. ఆయన లోక్సభలో ప్రతిపక్ష నేత కన్నా ‘‘పర్యాటన నాయకుడు’’, ‘‘పార్టీల నాయకుడు’’ అని నిరూపించారని అన్నారు. రాహుల్ గాందీ సీరియస్ రాజకీయ నాయకుడు కాదని విమర్శించారు. ప్రజలు పని మూడ్లో ఉంటారు, కానీ ఆయన శాశ్వత సెలవు మోడ్లో ఉన్నారని ఎద్దేవా చేశారు. ఇటీవల బీహార్ ఎన్నికల సమయంలో అతను జంగిల్ సఫారీలో ఉన్నాడని గుర్తు చేశారు. అతను జర్మనీ వెళ్లి మరోసారి భారత్పై విషం కక్కుతాడని పునావాలా అన్నారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు రాహుల్ విదేశాల్లో సమయం గడుపుతారని, ఆ తర్వాత మాట్లాడే అవకాశం ఇవ్వలేదని అంటారని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ఆయన పార్ట్ టైమ్, నాన్ సీరియస్ రాజకీయ నాయకుడని అన్నారు.
బీజేపీ విమర్శలపై కాంగ్రెస్ కూడా అంతే ఘాటుగా స్పందించింది. ప్రియాంకా గాంధీ మాట్లాడుతూ.. ప్రధాని మోడీ తన పని సమయంలో సగం కాలం విదేశాల్లోనే ఉంటారని విమర్శించారు. ప్రతిపక్ష నేత ప్రయాణాలపై బీజేపీ ఎందుకు ప్రశ్నల్ని లేవనెత్తుతోందని అడిగారు. లోక్సభలో ప్రతిపక్ష ఉప నాయకుడు గౌరవ్ గొగోయ్ మాట్లాడుతూ.. ఎన్నికల అక్రమాలపై రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నలకు బీజేపీ, ప్రధాని మోడీ వద్ద సమాధానాలు లేవని, ఆయను అవమానించడమే బీజేపీ లక్ష్యంగా పెట్టుకుందని మండిప్డడారు.
తాజావార్తలు
-
Pat Cummins: “అభిషేక్, ఇషాన్, క్లాసెన్ కాదు.. వాళ్ల వల్లే మ్యాచ్ గెలిచాం”.. SRH కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
TulsiGabbard: అమెరికా ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ పదవికి తులసి గబ్బార్డ్ రాజీనామా.. కారణం ఏంటంటే?
-
Mega158: ‘మెగా158’ టైటిల్పై హింట్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి?
-
Rowdy Janardhana: ‘రౌడీ జనార్దన’కి డబుల్ మ్యూజిక్ ట్రీట్..
-
Patriot: 18 ఏళ్ల తర్వాత మమ్ముట్టి – మోహన్ లాల్ కలయిక.. ‘పేట్రియాట్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్!
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!