9 రాజ్యసభ స్థానాలకు బీజేపీ తన అభ్యర్థుల్ని ప్రకటించింది. బీజేపీ జాతీయపార్టీ అధ్యక్షుడు నితిన్ నబీన్ను పెద్దల సభకు పంపాలని బీజేపీ నిర్ణయించింది. ఆయనను బీహార్ నుంచి నామినేట్ చేయనుంది. పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ వివిధ రాష్ట్రాల అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.బీహార్లో ఖాళీగా ఉన్న స్థానాలకు నితిన్ నబీన్తో పాటు దళిత నాయకుడు శివేశ్ కుమార్ రామ్ పేరును కూడా బీజేపీ ఖరారు చేసింది. అస్సాం నుంచి జోగెన్ మోహన్, తేరాష్ గోవాలా, హర్యానా నుంచి సంజయ్ భాటియా వంటి వారిని రాజ్యసభకు పంపనున్నారు. ఛత్తీస్గఢ్లో లక్ష్మీ వర్మను అభ్యర్థిగా ప్రకటించింది. ఒడిశాలో బీజేపీ రాష్ట్ర చీఫ్ మన్మోమన్ సమల్తో పాటు సుజీత్ కుమార్ను నామినేట్ చేసింది. పశ్చిమ బెంగాల్ నుంచి రాహుల్ సిన్హాను బరిలో దింపింది. రాజ్యసభ ఎన్నికలకు మార్చి 16న జరగనున్నాయి.
Rajyasabha Elections: రాజ్యసభకు బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్..

Nitin Nabin