Bilkis Bano Case: బిల్కిస్ బానో అత్యాచారం కేసులో 11 మంది నిందితుల విడుదల..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bilkis Bano Case- Release of 11 accused: 2002 గుజరాత్ అల్లర్లలో బిల్కిస్ బానోపై అత్యాచార ఘటన దేశాన్ని కుదిపేసింది. ఈ నేరానికి పాల్పడిన 11 మందికి కోర్టు జీవిత ఖైదు విధించింది. అయితే తాజాగా గుజరాత్ ప్రభుత్వం వీరిని విడుదల చేసింది. 75 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సత్ప్రవర్తన కలిగిన ఖైదీనలు విడుదల చేయాల్సిందిగా కేంద్రం మార్గదర్శకాలను విడుదల చేసింది. అయితే ఈ మార్గదర్శకాల కింది బిల్కిస్ బానో కేసులో శిక్ష పడిన 11 మందిని గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసింది. తాజాగా మంగళవారం వీరంతా గోద్రా జైలు నుంచి విడుదలయ్యారు. వీరు విడుదలైన తర్వాత కొంతమంది మిఠాయిలను పంచుకున్నారు.
Read Also: A.R. Rehman: ఆస్కార్ అవార్డు విన్నర్ 50 ఏళ్ల క్రితం ఎలా ఉన్నాడో చూడండి
Also Read
- NEET UG 2026 Paper Leak: నీట్ పేపర్ ఇలా లీక్ అయ్యిందన్నమాట! కోర్టులో సంచలన రహస్యాలు వెల్లడించిన సీబీఐ..
- Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే ఛాన్స్?
- NEET Scam: నీట్ పేపర్ లీక్ కేసులో రెండో సూత్రధారి పూణే ప్రొఫెసర్.. సీబీఐ అరెస్ట్ చేసిన మనీషా గురునాథ్ మంధారే ఎవరు?
- Droupadi Murmu: కేసుల గుట్టలకు చెక్.. సుప్రీంకోర్టు జడ్జీల పెంపునకు రాష్ట్రపతి ఆమోదం..
అయితే గుజరాత్ ప్రభుత్వ నిర్ణయం పట్ల కాంగ్రెస్ పార్టీతో పాటు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ విరుచుకుపడ్డారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురుస్కరించుకుని ఎర్రకోట నుంచి ప్రధాని మోదీ మహిళల గౌరవం గురించి మాట్లాడారని.. అయితే అదే రోజు ఓ మహిళపై అత్యాచారం చేసిన వారిని మాత్రం విడిచిపెట్టారని అన్నారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. గుజరాత్ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టింది. ‘‘ఖైదీలకు శిక్షాకాలం 14 ఏళ్లు గడిచిందని.. వారి ప్రవర్తన బాగుందని విడిచిపెట్టారని.. నేర స్వభావం, అత్యాచారం అనేది క్షమించరాని శిక్ష అని.. అయితే అలాంటి వారిని విడుదల చేయడం, సత్కరించడం, సన్మానం చేయడం మనం చూస్తున్నామని.. ఇదేనా అమృత్ మహోత్సవా..?’’ అని ప్రశ్నించింది కాంగ్రెస్ పార్టీ. అయితే ఈ 11 మంది విడుదలపై బిల్కిస్ బానో భర్త యకూబ్ రసూల్ స్పందించారు. ఎలా.. ఎందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందో అని.. వారిని విడుదల చేయడంపై ఆశ్చర్యపోయానని అన్నారు.
2002 గుజరాత్ అల్లర్లు జరుగుతున్న సమయంలో మార్చి 3,2022న 21 ఏళ్లు ఉన్న 5 నెలల గర్భిణి బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె మూడేళ్ల కుమార్తెతో పాటు మరో ఆరుగురు కుటుంబ సభ్యులను అత్యంత దారుణంగా హత్య చేశారు. గోద్రాలో సబర్మతి రైల్ కోచ్ దహనం తరువాత.. కరసేవకులు చనిపోయిన తర్వాత గుజరాత్ అల్లర్లు చోటు చేసుకున్నాయి. బిల్కిస్ బానోపై అత్యాచారం, హత్యలకు పాల్పడిన 11 మందికి ముంబై స్పెషల్ కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. ఆ తరువాత బాంబే హైకోర్టు ఈ శిక్షను సమర్థించింది. తాజాగా వీరంతా విడుదలయ్యారు.
తాజావార్తలు
-
Virgin Girl Consent: కన్య మౌనం అంగీకారమే.. ఆఫ్ఘనిస్తాన్లో బాల్య వివాహాలకు తాలిబన్ ఆమోదం
-
Sugar Free Lassi Recipe: చక్కెర లేకుండానే తియ్యటి లస్సీ.. ఈ చిట్కాతో క్రీమీ టేస్ట్ గ్యారంటీ!
-
Redmi Turbo 5: రెడ్మీ టర్బో 5 స్మార్ట్ఫోన్ రిలీజ్ కు రెడీ.. 7560mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే
-
Keerthy Suresh: అందుకే మీడియాకు ధూరంగా ఉన్న.. కీర్తి సురేష్ ఎమోషనల్ కామెంట్స్!
-
Drumstick Curry Recipe: మధ్యాహ్న భోజనానికి స్పెషల్.. శనగపిండి – పెరుగు పులుసుతో టేస్టీ మునగకాయ కూర..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..