Bihar Deputy CM Tejashwi Yadav: కొత్త కార్లు కొనొద్దు, పెద్దవాళ్లను గౌరవించాలి.. మంత్రులకు తేజస్వీ సూచన
Bihar Deputy CM Tejashwi Yadav Requests for RJD Ministers: బీహార్ లో జేడీయూతో కలిసి రాష్ట్రీయ జనతాదళ్ ( ఆర్జేడీ) మహాఘటబంధన్ కూటమిని ఏర్పాటు చేసి బీహార్ లో అధికారం చేపట్టింది. నితీష్ కుమార్ ఎనిమిదో సారి సీఎంగా బాధ్యతలు చేపట్టగా.. ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు తేజస్వి యాదవ్ డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. అయితే ఇన్నాళ్లు జేడీయూతో పొత్తులో ఉన్న బీజేపీ ప్రతిపక్షానికి పరిమితం కావాల్సి వచ్చింది.
ఇదిలా ఉంటే ఆర్జేడీపై ఉన్న జంగిల్ రాజ్ ముద్రను డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ మార్చాలని అనుకుంటున్నారు. తాజాగా తన ఆర్జేడీ మంత్రులకు 6 ముఖ్య సూచనలు చేశారు. రాష్ట్రమంత్రి వర్గంలో మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన నేతలకు కొన్ని మార్గదర్శకాలు తెలియజేశారు. ఆర్జేడీ మంత్రులెవరూ కూడా కొత్త వాహనం కొనుగోలు చేయవద్దని.. తమ కంటే పెద్దవారు తమ పాదాలను తాకవద్దని తేజస్వీ యాదవ్ శనివారం తెలిపారు. ప్రతి ఒక్కరితోనూ మర్యాదగా నడుచుకోవాలని.. పేద ప్రజలను వారి కులం,మతంతో సంబంధం లేకుండా సహాయం చేయాలని మంత్రులకు సూచించారు. ఫేస్ బుక్ పోస్టు ద్వారా డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ తన మంత్రులకు వీటిని సూచించారు.
Also Read
- Barrier Free Tolling: భారత్లో కొత్త రకం టోల్ విధానం.. వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా...
- Mamata Banerjee: తలకిందులుగా వేలాడదీయడం ఏంటి.? అమిత్ షాపై దీదీ ఆగ్రహం..
- AAP Crisis: ‘‘పంజాబ్ ద్రోహి’’ అంటూ హర్భజన్ సింగ్ ఇంటిపై ఆప్ దాడి...
- LPG Crisis: గ్యాస్ టెన్షన్కు గుడ్బై.. 15 దేశాల నుంచి ఎల్పీజీ దిగుమతి!
Read Also: Tragedy: ఆ వీసా జీవితకాలం లేటు.. ఆత్మహత్య తర్వాత రోజే వచ్చిన వీసా
దీంతో పాటు ఆర్జేడీ మంత్రులు కార్యకర్తలు, శ్రేయోభిలాషులు , మద్దతుదారులు లేదా తమ కంటే పెద్దవారు మంత్రుల పాదాలు తాకడాన్ని అనుమతించరని ఆయన అన్నారు. మర్యాదగా నడుచుకుంటూ ప్రతీ ఒక్కరికి నమస్కారం, అదాబ్ అంటూ పలకరించారని సూచించారు. మంత్రులు ఫ్లవర్ బుకేల బదులు పెన్నులు, పుస్తకాలను తీసుకోవాలని ప్రోత్సహించారు. ముఖ్యమంత్రి నితీస్ కుమార్ నాయకత్వంలో అన్ని శాఖల మంత్రులు నిజాయితీ, పారదర్శకతతో పనిచేయాలని ఆర్జేడీ మంత్రులకు సూచించారు. చివరగా ముఖ్యమంత్రి, ప్రభుత్వం, వారి శాఖలు చేసే అన్ని అభివృద్ధి పనులను సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయాలని ఆయన ఆర్జేడీ మంత్రులకు సూచించారు.
లాలూ హయాంతో బీహార్ లో జంగిల్ రాజ్ పరిపాలన ఉన్న విధంగానే.. ప్రస్తుతం జేడీయూ-ఆర్జేడీ పాలనతో మళ్లీ పాత జంగిల్ రాజ్ రోజులు వస్తాయని బీజేపీ విమర్శిస్తోంది. దీనికి ప్రతిగా జంగిల్ రాజ్ ముద్రను తొలగించుకోవాలని ఆర్జేడీ భావిస్తోంది. మరో రెండున్నరేళ్లలో వచ్చే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జంగిల్ రాజ్ ముద్రను చెరపేసుకోవాలని ఆర్జేడీ, తేజస్వీ యాదవ్ భావిస్తున్నారు.
తాజావార్తలు
-
New OTT Rules 2026 : ఓటీటీలో కొత్త రూల్స్.. నిర్మాతలకు ‘షాక్’.. వసూళ్లు లేకపోతే రైట్స్ కట్!
-
Ashu Reddy: ప్రేమ, పెళ్లి పేరుతో 9 కోట్లు స్వాహ.. బిగ్ బాస్ అషు రెడ్డి పై సైబర్ కేసు
-
న్యూ లుక్లో YS Jagan.. యూరప్ టూర్కు బయల్దేరిన మాజీ సీఎం.!
-
Lungi Ngidi Injury: లుంగి ఎంగిడికి తీవ్ర గాయం.. 11 నిమిషాల్లోనే ఆస్పత్రికి అంబులెన్స్, తాజా అప్డేట్ ఇదే!
-
Amani: అందుకే మెగాస్టార్ సరసన నటించలేదు..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!