Bihar Deputy CM Tejashwi Yadav: కొత్త కార్లు కొనొద్దు, పెద్దవాళ్లను గౌరవించాలి.. మంత్రులకు తేజస్వీ సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar Deputy CM Tejashwi Yadav Requests for RJD Ministers: బీహార్ లో జేడీయూతో కలిసి రాష్ట్రీయ జనతాదళ్ ( ఆర్జేడీ) మహాఘటబంధన్ కూటమిని ఏర్పాటు చేసి బీహార్ లో అధికారం చేపట్టింది. నితీష్ కుమార్ ఎనిమిదో సారి సీఎంగా బాధ్యతలు చేపట్టగా.. ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు తేజస్వి యాదవ్ డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. అయితే ఇన్నాళ్లు జేడీయూతో పొత్తులో ఉన్న బీజేపీ ప్రతిపక్షానికి పరిమితం కావాల్సి వచ్చింది.
ఇదిలా ఉంటే ఆర్జేడీపై ఉన్న జంగిల్ రాజ్ ముద్రను డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ మార్చాలని అనుకుంటున్నారు. తాజాగా తన ఆర్జేడీ మంత్రులకు 6 ముఖ్య సూచనలు చేశారు. రాష్ట్రమంత్రి వర్గంలో మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన నేతలకు కొన్ని మార్గదర్శకాలు తెలియజేశారు. ఆర్జేడీ మంత్రులెవరూ కూడా కొత్త వాహనం కొనుగోలు చేయవద్దని.. తమ కంటే పెద్దవారు తమ పాదాలను తాకవద్దని తేజస్వీ యాదవ్ శనివారం తెలిపారు. ప్రతి ఒక్కరితోనూ మర్యాదగా నడుచుకోవాలని.. పేద ప్రజలను వారి కులం,మతంతో సంబంధం లేకుండా సహాయం చేయాలని మంత్రులకు సూచించారు. ఫేస్ బుక్ పోస్టు ద్వారా డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ తన మంత్రులకు వీటిని సూచించారు.
Also Read
- Pakistan: ఇద్దరు భారతీయులకు పాక్ అత్యున్నత పురస్కారం.. ఎందుకు ఇస్తోంది? జిన్నాతో సంబంధం ఏమిటి?
- Student Success: జేబులో రూ.1,000.. చేతిలో పాత ల్యాప్టాప్.. ఇప్పుడు రూ.3.5 కోట్ల స్కాలర్షిప్..
- Delhi Police Attack: షాకింగ్ ఘటన.. కర్రలు, ఇటుకలతో పోలీసులపై దాడి (వీడియో)
- Neha Pachisia: నేహా పచిసియా ఎవరు? ఎయిర్ హోస్టెస్ నుంచి పోలీస్ అధికారిణిగా.. ఇప్పుడు సస్పెన్షన్ ఎందుకు?
Read Also: Tragedy: ఆ వీసా జీవితకాలం లేటు.. ఆత్మహత్య తర్వాత రోజే వచ్చిన వీసా
దీంతో పాటు ఆర్జేడీ మంత్రులు కార్యకర్తలు, శ్రేయోభిలాషులు , మద్దతుదారులు లేదా తమ కంటే పెద్దవారు మంత్రుల పాదాలు తాకడాన్ని అనుమతించరని ఆయన అన్నారు. మర్యాదగా నడుచుకుంటూ ప్రతీ ఒక్కరికి నమస్కారం, అదాబ్ అంటూ పలకరించారని సూచించారు. మంత్రులు ఫ్లవర్ బుకేల బదులు పెన్నులు, పుస్తకాలను తీసుకోవాలని ప్రోత్సహించారు. ముఖ్యమంత్రి నితీస్ కుమార్ నాయకత్వంలో అన్ని శాఖల మంత్రులు నిజాయితీ, పారదర్శకతతో పనిచేయాలని ఆర్జేడీ మంత్రులకు సూచించారు. చివరగా ముఖ్యమంత్రి, ప్రభుత్వం, వారి శాఖలు చేసే అన్ని అభివృద్ధి పనులను సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయాలని ఆయన ఆర్జేడీ మంత్రులకు సూచించారు.
లాలూ హయాంతో బీహార్ లో జంగిల్ రాజ్ పరిపాలన ఉన్న విధంగానే.. ప్రస్తుతం జేడీయూ-ఆర్జేడీ పాలనతో మళ్లీ పాత జంగిల్ రాజ్ రోజులు వస్తాయని బీజేపీ విమర్శిస్తోంది. దీనికి ప్రతిగా జంగిల్ రాజ్ ముద్రను తొలగించుకోవాలని ఆర్జేడీ భావిస్తోంది. మరో రెండున్నరేళ్లలో వచ్చే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జంగిల్ రాజ్ ముద్రను చెరపేసుకోవాలని ఆర్జేడీ, తేజస్వీ యాదవ్ భావిస్తున్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : కేంద్ర ప్రభుత్వ తీరుపై రేవంత్ రెడ్డి ఆగ్రహం..
-
Honey Trap : రాజమహేంద్రవరంలో హనీ ట్రాప్ కలకలం.. నలుగురు మహిళలు అరెస్ట్
-
Miscarriage: గర్భస్రావం తర్వాత మహిళలు చెప్పుకోలేని బాధ ఇదే! శరీరం కోలుకున్నా మనసు ఎందుకు కోలుకోదు?
-
Yash Favorite Songs: తెలుగులో రాకింగ్ స్టార్ యశ్కి ఫేవరెట్ సాంగ్స్ ఇవేనట! లిస్ట్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాట..
-
Pakistan: ఇద్దరు భారతీయులకు పాక్ అత్యున్నత పురస్కారం.. ఎందుకు ఇస్తోంది? జిన్నాతో సంబంధం ఏమిటి?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!