Bihar Deputy CM Tejashwi Yadav: కొత్త కార్లు కొనొద్దు, పెద్దవాళ్లను గౌరవించాలి.. మంత్రులకు తేజస్వీ సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar Deputy CM Tejashwi Yadav Requests for RJD Ministers: బీహార్ లో జేడీయూతో కలిసి రాష్ట్రీయ జనతాదళ్ ( ఆర్జేడీ) మహాఘటబంధన్ కూటమిని ఏర్పాటు చేసి బీహార్ లో అధికారం చేపట్టింది. నితీష్ కుమార్ ఎనిమిదో సారి సీఎంగా బాధ్యతలు చేపట్టగా.. ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు తేజస్వి యాదవ్ డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. అయితే ఇన్నాళ్లు జేడీయూతో పొత్తులో ఉన్న బీజేపీ ప్రతిపక్షానికి పరిమితం కావాల్సి వచ్చింది.
ఇదిలా ఉంటే ఆర్జేడీపై ఉన్న జంగిల్ రాజ్ ముద్రను డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ మార్చాలని అనుకుంటున్నారు. తాజాగా తన ఆర్జేడీ మంత్రులకు 6 ముఖ్య సూచనలు చేశారు. రాష్ట్రమంత్రి వర్గంలో మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన నేతలకు కొన్ని మార్గదర్శకాలు తెలియజేశారు. ఆర్జేడీ మంత్రులెవరూ కూడా కొత్త వాహనం కొనుగోలు చేయవద్దని.. తమ కంటే పెద్దవారు తమ పాదాలను తాకవద్దని తేజస్వీ యాదవ్ శనివారం తెలిపారు. ప్రతి ఒక్కరితోనూ మర్యాదగా నడుచుకోవాలని.. పేద ప్రజలను వారి కులం,మతంతో సంబంధం లేకుండా సహాయం చేయాలని మంత్రులకు సూచించారు. ఫేస్ బుక్ పోస్టు ద్వారా డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ తన మంత్రులకు వీటిని సూచించారు.
Also Read
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- India-China Ties: ప్రధాని మోడీ ఒక్క ప్రకటనతో చైనాలో ఆనందం..
- Gurugram: ఆమె అమ్మాయినే తెలియదు.. గురుగ్రామ్ బైకర్ను ఢీకొట్టిన నిందితుడు వింత వాదన
- India’s Artificial Sun: భారత్ ‘ఆర్టిఫిషియల్ సన్’ ప్రయోగం సక్సెస్.. సూర్యుడి కేంద్రం కంటే 20 రెట్లు వేడి!
Read Also: Tragedy: ఆ వీసా జీవితకాలం లేటు.. ఆత్మహత్య తర్వాత రోజే వచ్చిన వీసా
దీంతో పాటు ఆర్జేడీ మంత్రులు కార్యకర్తలు, శ్రేయోభిలాషులు , మద్దతుదారులు లేదా తమ కంటే పెద్దవారు మంత్రుల పాదాలు తాకడాన్ని అనుమతించరని ఆయన అన్నారు. మర్యాదగా నడుచుకుంటూ ప్రతీ ఒక్కరికి నమస్కారం, అదాబ్ అంటూ పలకరించారని సూచించారు. మంత్రులు ఫ్లవర్ బుకేల బదులు పెన్నులు, పుస్తకాలను తీసుకోవాలని ప్రోత్సహించారు. ముఖ్యమంత్రి నితీస్ కుమార్ నాయకత్వంలో అన్ని శాఖల మంత్రులు నిజాయితీ, పారదర్శకతతో పనిచేయాలని ఆర్జేడీ మంత్రులకు సూచించారు. చివరగా ముఖ్యమంత్రి, ప్రభుత్వం, వారి శాఖలు చేసే అన్ని అభివృద్ధి పనులను సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయాలని ఆయన ఆర్జేడీ మంత్రులకు సూచించారు.
లాలూ హయాంతో బీహార్ లో జంగిల్ రాజ్ పరిపాలన ఉన్న విధంగానే.. ప్రస్తుతం జేడీయూ-ఆర్జేడీ పాలనతో మళ్లీ పాత జంగిల్ రాజ్ రోజులు వస్తాయని బీజేపీ విమర్శిస్తోంది. దీనికి ప్రతిగా జంగిల్ రాజ్ ముద్రను తొలగించుకోవాలని ఆర్జేడీ భావిస్తోంది. మరో రెండున్నరేళ్లలో వచ్చే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జంగిల్ రాజ్ ముద్రను చెరపేసుకోవాలని ఆర్జేడీ, తేజస్వీ యాదవ్ భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!