Parliament: కేంద్రమంత్రి భగీరథ్ చౌదరి కీలక నిర్ణయం.. పార్లమెంట్లో సంచలన ప్రకటన
- కేంద్రమంత్రి భగీరథ్ చౌదరి కీలక నిర్ణయం
- సబ్సిడీ డబ్బులు వెనక్కి ఇచ్చేసినట్లు ప్రకటన
- రూ.99 లక్షల సబ్సిడీ పొందిన కేంద్రమంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం లోక్సభలో కీలక సమాచారం వెల్లడించింది. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి భగీరథ్ చౌదరి తన సొంత వ్యవసాయ క్షేత్రం కోసం ఉద్యానవన పథకం కింద పొందిన రూ.99 లక్షల సబ్సిడీని తిరిగి చెల్లించినట్లు తెలిపింది. వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి రామ్నాథ్ ఠాకూర్ లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయాన్ని వెల్లడించారు. భగీరథ్ చౌదరి సంబంధిత బ్యాంకుకు సబ్సిడీ మొత్తాన్ని తిరిగి చెల్లించారని, ఆ మొత్తాన్ని జాతీయ ఉద్యానవన బోర్డుకు బదిలీ చేయాలని బ్యాంకుకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.
వివాదానికి కారణం
నెల రోజుల క్రితం వెలువడిన మీడియా కథనం ప్రకారం.. భగీరథ్ చౌదరి తన మంత్రిత్వ శాఖ పరిధిలో అమలవుతున్న జాతీయ ఉద్యానవన బోర్డు పథకం కింద ఆర్థిక సబ్సిడీ పొందినట్లు వెల్లడైంది. దీంతో ప్రయోజనాల సంఘర్షణ అంశంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. నివేదికల ప్రకారం.. భగీరథ్ చౌదరి 16,592 చదరపు మీటర్ల విస్తీర్ణంలో వాణిజ్యపరంగా దోసకాయ సాగు చేపట్టేందుకు ఈ సబ్సిడీని పొందారు. ఈ ప్రాజెక్టు 2025లో జాతీయ ఉద్యానవన బోర్డు ఆమోదించిన 467 ప్రతిపాదనల్లో ఒకటిగా నిలిచింది. ఈ సబ్సిడీ మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ (MIDH) పథకం కింద అందించబడుతుంది. 2014-15లో ప్రారంభమైన ఈ పథకాన్ని వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని జాతీయ ఉద్యానవన బోర్డు అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా దోసకాయ, క్యాప్సికం, టమాటా వంటి కూరగాయలు, అలాగే గులాబీలు, ఆర్కిడ్లు, ఆంథూరియంల వంటి పూల వాణిజ్య సాగుకు ప్రోత్సాహం కల్పిస్తారు. ప్రాజెక్టు వ్యయంలో గరిష్ఠంగా 50 శాతం వరకు, ఒక కుటుంబానికి రూ.1 కోటి వరకు సబ్సిడీ అందించే అవకాశం ఉంది.
Also Read
- Priyanka Gandhi: ‘‘ అత్యాచార నిందితులకు మద్దతు’’.. ప్రహ్లాద్ జోషిపై ప్రియాంకాగాంధీ సంచలన వ్యాఖ్యలు..
- Rahul Gandhi: ‘అత్యంత నీచమైన వ్యక్తి’.. కొత్త విద్యాశాఖ మంత్రిపై రాహుల్ గాంధీ ఫైర్
- Bihar: దారుణం.. పెళ్లి చేసుకోమన్నందుకు ప్రేయసిని బైక్పై ఈడ్చుకెళ్లిన ప్రియుడు
- Delhi: జంతర్మంతర్ దగ్గర ధర్నాకు పోలీసుల ప్లాన్.. దేనికోసమంటే..!
అభిషేక్ బెనర్జీ ప్రశ్న
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ లోక్సభలో ప్రశ్నిస్తూ.. గత ఐదేళ్లలో కేంద్ర మంత్రులు, ఎంపీలు లేదా వారి కుటుంబ సభ్యులు ఎవరైనా NHB సబ్సిడీ పథకాల ద్వారా లబ్ధి పొందారా? అలాంటి దరఖాస్తుల విషయంలో ప్రయోజనాల సంఘర్షణను నివారించేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిబంధనలు అమలు చేస్తుందా? అని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా రామ్నాథ్ ఠాకూర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం అమల్లో ఉన్న NHB మార్గదర్శకాలలో కేంద్ర మంత్రులు, ఎంపీలు లేదా వారి కుటుంబ సభ్యుల దరఖాస్తుల విషయంలో ప్రయోజనాల సంఘర్షణ లేదా తప్పనిసరి తప్పుకోవడం వంటి ప్రత్యేక నిబంధనలు లేవని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Parliament: కేంద్రమంత్రి భగీరథ్ చౌదరి కీలక నిర్ణయం.. పార్లమెంట్లో సంచలన ప్రకటన
-
Fielder Clicks Finger Video: క్రికెట్ చరిత్రలోనే వినూత్న చీటింగ్.. వేలితో చిటికేసి బ్యాటర్ను అవుట్ చేశాడు.. వీడియో వైరల్..
-
YS Jagan: డీఎస్సీ వివాదం.. లోకేష్ రాజీనామా.. సీబీఐ విచారణకు జగన్ డిమాండ్
-
Bonda Uma: త్రీమెన్ కమిటీ ముందుకు బోండా ఉమా.. తన వ్యాఖ్యలపై క్లారిటీ.. ప్రతి మాటకు రికార్డు ఉంది..!
-
8000mAh బ్యాటరీ, 7-అంగుళాల OLED డిస్ప్లే, 50MP కెమెరా.. Redmi నుంచి కొత్త ఫోన్ విడుదల తేదీ ఖరారు..
ట్రెండింగ్
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?
-
Home Cleaning Hacks : టీ, కాఫీ కప్పుల మొండి మరకలా.? ఈ టిప్స్తో సులభంగా 5 నిమిషాల్లో క్లీన్ చేయండి.!
-
Clean Fridge Door Rubber: ఫ్రిజ్ డోర్ రబ్బర్కు మరకలా..? ఈ ట్రిక్తో 10 నిమిషాల్లో తలతల మెరిసిపోవాల్సిందే..!
-
రూ.5,499కే 120 అంగుళాల స్క్రీన్.. Zebronics Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్.!
-
3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, 165Hz రిఫ్రెష్ రేట్ తో రాబోతున్న iQOO Z11 5G..!