Bengaluru: ఎయిర్పోర్టులో దారుణం.. తనిఖీ నెపంతో ఆపి కొరియన్ మహిళపై అఘాయిత్యం!
- బెంగళూరులో ఎయిర్పోర్టులో దారుణం
- తనిఖీ నెపంతో ఆపి కొరియన్ మహిళపై అఘాయిత్యం!
- ఎయిరిండియా ఉద్యోగి అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టెక్ సిటీ బెంగళూరులో దారుణం జరిగింది. కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘోరం జరిగింది. కొరియా మహిళా పర్యాటకురాలిపై మృగాడు అత్యాచారానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు విమానాశ్రయ ఉద్యోగిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి: Stock Market: మార్కెట్కు జోష్ తెచ్చిన ఈయూ ప్రకటన.. భారీ లాభాల్లో సూచీలు
Also Read
- Tamil Politics: విజయ్పై మొదలైన డీఎంకే విమర్శలు.. ఏం జరిగిందంటే..?
- PM Modi: మే 15 లోపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగొచ్చా.. మోడీ వ్యాఖ్యల ఆంతర్యం ఏమిటి.?
- CM Vijay Simplicity: దటీజ్ దళపతి.. సీఎం హోదాలో ఉన్నా.. టేబుల్ మోసి సింప్లిసిటీ చాటుకున్న విజయ్!
- PM Modi: కాంగ్రెస్కు కొత్త పేరు పెట్టిన మోడీ.. ‘MMC’ అంటే ముస్లిం లీగ్, మావోవాది కాంగ్రెస్!
జనవరి 19న ఎయిర్పోర్టుకు కొరియన్ మహిళ వచ్చింది. అయితే టికెట్, సామాన్లు తనిఖీ నెపంతో అఫాన్ అహ్మద్ అనే ఉద్యోగి.. మహిళను వాష్రూమ్కు తీసుకెళ్లాడు. చెక్-ఇన్ దగ్గర బ్యాగ్ బీప్ అవుతుందని.. కౌంటర్లో తనిఖీ చేయడం వల్ల విమానం ఆలస్యం అవుతుందని.. వ్యక్తిగతంగా తనిఖీలు చేయాలంటూ పురుషుల వాష్రూమ్కు తీసుకెళ్లాడు. ప్యాంట్ డౌన్ చేసి అనుచితంగా ప్రవర్తించాడు. ఈ ఘటనతో బాధితురాలు ఒక్కసారిగా షాక్కు గురైంది. ఆమెతో ఇష్టానురీతిగా అనుచితంగా ప్రవర్తించిన తర్వాత నిందితుడు ‘‘సరే.. ధన్యవాదాలు’’ అని చెప్పి వెళ్లిపోయాడు.
ఇది కూడా చదవండి: Amruta: నా భర్త పిక్నిక్ కోసం దావోస్ వెళ్లలేదు.. విపక్షాలకు సీఎం భార్య స్ట్రాంగ్ కౌంటర్
ఈ పరిణామంతో షాకైన బాధితురాలు వెంటనే విమానాశ్రయ భద్రతా సిబ్బందికి ఫిర్యాదు చేసింది. వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
ఎయిరిండియా క్షమాపణ..
నిందితుడు అఫాన్ అహ్మద్.. విమానాశ్రయంలో గ్రౌండ్, కార్గో సేవలను అందించే ఎయిరిండియా SATSలో పని చేస్తున్నాడు. అయితే ఈ సంఘటన ‘క్షమించరానిదిగా’ భావించిన ఎయిరిండియా వెంటనే ఉద్యోగం నుంచి తొలగించింది. చట్టపరమైన చర్యలకు ఆదేశించింది. ఈ సంఘటనకు చింతిస్తున్నామని.. బాధితురాలికి అవసరమైన సహాయం అందిస్తామని తెలిపింది. ప్రయాణికులకు భద్రతకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?
-
Delhi Tour: ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీబిజీ.. అమిత్ షా, సీఆర్ పాటిల్తో కీలక భేటీలు!
-
Bhuvneshwar Kumar: స్వింగ్ కింగ్ ‘భూవీ’ ఈజ్ బ్యాక్.. టీమిండియాకు రీఎంట్రీ ఖాయమేనా..!
-
Viral Road Accident: అరె బాబు.. బైకును అక్కడ ఎలా పార్క్ చేశావయ్యా.!
-
Genelia: “నా సమస్య కూడా సాల్వ్ చేయండి”.. బిగ్ బిని కోరిన జెనీలియా