Ramagundam Fertilizers: రామగుండం కర్మాగారం.. దక్షిణాది రాష్ట్రాల రైతులకు వరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ramagundam Fertilizers: నేడు ప్రధాని మోడీ ప్రారంభించనున్న రామగుండం ఎరువుల కర్మాగారంతో దక్షిణాది రాష్ట్రాల రైతులకు ఊరట లభించనుంది. 1970లో ప్రారంభమైన ఈ కర్మాగారం.. 2002లో మూతపడింది. వివిధ కారణాల వల్ల.. గతంలో ఎరువుల్ని ఉత్పత్తి చేసిన 5 కర్మాగారాలను వివిధ కారణాలతో మూసివేశారు. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఆ ఐదు కర్మాగారాలను పునఃప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ ఐదింటిలో ఈ రామగుండంలోని ఎరువుల ఫ్యాక్టరీ ఒకటి. రూ. 6,500 కోట్ల వ్యయంతో ఈ గ్యాస్ ఆధారిత కర్మాగారం పునఃప్రారంభమవుతోంది. 2021 మార్చి నుంచి ఇప్పటిదాకా ఈ ఫ్యాక్టరీ 8.8 మెట్రిక్ టన్నుల యూరియాని ఉత్పిత్తి చేసింది. ఇప్పుడు దీని నిర్మాణం పూర్తి స్థాయిలో కంప్లీట్ అవ్వడంతో.. దీనికి మోడీ జాతికి అంకితమివ్వనున్నారు.
ఈ రామగుండం ఫర్టిలైజర్స్ & కెమికల్స్ లిమిటెడ్ (ఆర్ఎఫ్సీఎల్)లో తెలంగాణ రాష్ట్రానికి 11 % వాటా ఉంది. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి ఈ కర్మాగారానికి 0.55 టీఎంసీ నీరు సరఫరా అవుతోంది. కిసాన్ పేరుతో ఆర్ఎఫ్సీఎల్ యూరియా మార్కెట్లోకి వస్తోంది. కేవలం యూరియానే కాదు.. అమ్మోనియాని కూడా ఈ కర్మాగారం ఉత్పత్తి చేయనుంది. రోజుకి 3850 మెట్రిక్ టన్నుల యూరియా, 2200 మెట్రిక్ టన్నుల అమ్మోనియాను ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఈ కర్మాగారానికి ఉంది. ఈ కర్మాగారం.. నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ (NFL), ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ (EIL), ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (FCIL)ల జాయింట్ వెంచర్ కంపెనీ. ఇందులో NFL & EILల చెరో 26% ఈక్విటీ భాగస్వామ్యం ఉండగా.. CCEA ఆమోదం పరంగా FCILకి 11% ఈక్విటీ మంజూరు చేయబడింది. ఇక తెలంగాణ ప్రభుత్వానికి 11% ఈక్విటీ భాగస్వామ్యం ఉంది.
Also Read
- Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
- Nepal Floods: ఏం ఇళ్లురా ఇది, కట్టిన వాడికి ‘‘నేపాల్ రత్న’’ ఇవ్వాల్సిందే.. వరదల్లో చెక్కు చెదరలేదు.. వీడియో వైరల్..
- Karnataka: కర్ణాటక కాంగ్రెస్లో షాక్.. అవినీతి ఆరోపణలు.. కీలక మంత్రి రాజీనామా..
- Ganja Seized: ఒడిశా నుంచి యూపీకి కారులో గంజాయి తరలింపు.. ముగ్గురు అరెస్ట్..
రామగుండం కర్మాగారంలో ఉత్పత్తి అవుతున్న యూరియాని ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళకి సరఫరా అవుతుంది. ఈ కర్మాగారంలో కేంద్రంతో పాటు తెలంగాణ రాష్ట్రానికి వాటా ఉంది. ఈ ఎరువుల కర్మాగారంతో పాటు తెలంగాణలో మూడు జాతీయ రహదారుల విస్తరణ, ఒక రైల్వే లైన్ పనులకు మోడీ శంకుస్థాపన చేయనున్నారు. జగిత్యాల-కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారి విస్తరణ పనుల కోసం కేంద్రం రూ.4,300 కోట్ల నిధులు ఇవ్వనుంది.
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!