Ramagundam Fertilizers: రామగుండం కర్మాగారం.. దక్షిణాది రాష్ట్రాల రైతులకు వరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ramagundam Fertilizers: నేడు ప్రధాని మోడీ ప్రారంభించనున్న రామగుండం ఎరువుల కర్మాగారంతో దక్షిణాది రాష్ట్రాల రైతులకు ఊరట లభించనుంది. 1970లో ప్రారంభమైన ఈ కర్మాగారం.. 2002లో మూతపడింది. వివిధ కారణాల వల్ల.. గతంలో ఎరువుల్ని ఉత్పత్తి చేసిన 5 కర్మాగారాలను వివిధ కారణాలతో మూసివేశారు. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఆ ఐదు కర్మాగారాలను పునఃప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ ఐదింటిలో ఈ రామగుండంలోని ఎరువుల ఫ్యాక్టరీ ఒకటి. రూ. 6,500 కోట్ల వ్యయంతో ఈ గ్యాస్ ఆధారిత కర్మాగారం పునఃప్రారంభమవుతోంది. 2021 మార్చి నుంచి ఇప్పటిదాకా ఈ ఫ్యాక్టరీ 8.8 మెట్రిక్ టన్నుల యూరియాని ఉత్పిత్తి చేసింది. ఇప్పుడు దీని నిర్మాణం పూర్తి స్థాయిలో కంప్లీట్ అవ్వడంతో.. దీనికి మోడీ జాతికి అంకితమివ్వనున్నారు.
ఈ రామగుండం ఫర్టిలైజర్స్ & కెమికల్స్ లిమిటెడ్ (ఆర్ఎఫ్సీఎల్)లో తెలంగాణ రాష్ట్రానికి 11 % వాటా ఉంది. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి ఈ కర్మాగారానికి 0.55 టీఎంసీ నీరు సరఫరా అవుతోంది. కిసాన్ పేరుతో ఆర్ఎఫ్సీఎల్ యూరియా మార్కెట్లోకి వస్తోంది. కేవలం యూరియానే కాదు.. అమ్మోనియాని కూడా ఈ కర్మాగారం ఉత్పత్తి చేయనుంది. రోజుకి 3850 మెట్రిక్ టన్నుల యూరియా, 2200 మెట్రిక్ టన్నుల అమ్మోనియాను ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఈ కర్మాగారానికి ఉంది. ఈ కర్మాగారం.. నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ (NFL), ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ (EIL), ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (FCIL)ల జాయింట్ వెంచర్ కంపెనీ. ఇందులో NFL & EILల చెరో 26% ఈక్విటీ భాగస్వామ్యం ఉండగా.. CCEA ఆమోదం పరంగా FCILకి 11% ఈక్విటీ మంజూరు చేయబడింది. ఇక తెలంగాణ ప్రభుత్వానికి 11% ఈక్విటీ భాగస్వామ్యం ఉంది.
Also Read
- Dharmendra Pradhan: ‘జెన్-జెడ్ను తప్పుదోవ పట్టించారు’.. తన రాజీనామాపై తొలిసారి స్పందించిన ధర్మేంద్ర ప్రధాన్
- PM Modi: జేడీ వాన్స్తో ప్రధాని మోడీ ఫోన్ సంభాషణ.. భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంపై కీలక చర్చ
- Russia-India Rail Route: భారత్కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
- CM Vijay: విజయ్ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ.. డీలిమిటేషన్పై అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశం
రామగుండం కర్మాగారంలో ఉత్పత్తి అవుతున్న యూరియాని ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళకి సరఫరా అవుతుంది. ఈ కర్మాగారంలో కేంద్రంతో పాటు తెలంగాణ రాష్ట్రానికి వాటా ఉంది. ఈ ఎరువుల కర్మాగారంతో పాటు తెలంగాణలో మూడు జాతీయ రహదారుల విస్తరణ, ఒక రైల్వే లైన్ పనులకు మోడీ శంకుస్థాపన చేయనున్నారు. జగిత్యాల-కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారి విస్తరణ పనుల కోసం కేంద్రం రూ.4,300 కోట్ల నిధులు ఇవ్వనుంది.
తాజావార్తలు
-
iPhone 17 Pro Max: iPhone 18 రాకముందే iPhone 17 Pro Maxపై భారీ ఆఫర్.. రూ.16 వేల వరకు ఆదా!
-
Vaibhav Sooryavanshi-Brett Lee: అవును, వైభవ్ సూర్యవంశీ వయసు 18 ఏళ్లు అయినా ఎవరికి నష్టం?
-
Thani Oruvan 2: రవి మోహన్, నయనతార ‘తని ఒరువన్ 2’ ఆగిపోయిందా? క్లారిటీ ఇచ్చిన నిర్మాత
-
Mojtaba Khamenei Health: మొజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై ఉత్కంఠకు తెర.. కొత్త వీడియో విడుదల చేసిన ఇరాన్
-
Buchi Babu Sana : బుచ్చి.. నెక్ట్స్ సినిమా ఎప్పుడు బాబు.. ఛాన్స్ ఇచ్చే హీరో ఎవరు?
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!