Priyanka Gandhi: బీజేపీకి భయపడి ప్రియాంకా గాంధీ పోటీకి దూరంగా ఉన్నారా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Priyanka Gandhi: ప్రియాంకా గాంధీ రాయ్బరేలీ లేదా అమేథీ నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలకు ఈ రోజుతో తెరపడింది. సోనియా గాంధీ రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఇన్నాళ్లు ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్బరేలీ నుంచి ప్రియాంకాగాంధీ బరిలోకి దిగుతారని వార్తలు వినిపించాయి. అయితే ఈ రోజు రాయ్బరేలీ నుంచి రాహుల్ గాంధీ నామినేషన్ దాఖలు చేశారు. మరోవైపు అమేథీ నుంచి బీజేపీ నేత, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఎదుర్కొనేందుకు కిషోరీ లాల్ శర్మని కాంగ్రెస్ బరిలోకి దింపింది. ఈ రెండు స్థానాలు కాంగ్రెస్కి కంచుకోటలుగా ఉండేవి. అయితే 2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీ స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు.
Read Also: AC For Buffaloes : ఆహా.. ఏమి సుఖం.. గేదెల కోసం ప్రత్యేకంగా ఏసీ రూమ్.. వీడియో వైరల్..
Also Read
- Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
- UP: యూపీలో హర్యానా నటుడు అంకిత్ బలియాన్ హత్య
- Nepal-Tibet Flood: వరదల్లో చిక్కుకున్న ఇషా ఫౌండేషన్కు చెందిన 77 మంది భక్తులు, రంగంలోకి సద్గురు
- Nepal Floods: నేపాల్ జలప్రళయానికి ముందు భూకంపం.. 7 నిమిషాల్లోనే ఫ్లాష్ ఫ్లడ్స్!
అయితే, ఈ రెండు స్థానాల్లో ఏదో ఒక స్థానం నుంచి ప్రియాంకాగాంధీ పోటీ చేయాలని ఒప్పించేందుకు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ, ఆమె మాత్రం నో చెప్పింది. దీనికి ఒక కారణం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తాను గెలిస్తే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో పాటు గాంధీ కుటుంబానికి చెందిన ముగ్గురం కూడా పార్లమెంట్లో ఉంటామని, దీంతో బీజేపీ వంశపారంపర్య రాజకీయాలు అని చేసే విమర్శలకు మరింత అవకాశం ఇచ్చినట్లు ప్రియాంకా భావించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ ఆరోపణలకు భయపడే ఆమె పోటీ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.
అయితే, ఆమె నిర్ణయం ఓటర్లలో ప్రతికూల భావన కలిగిస్తుందని కొందరు కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఆమె పోటీ చేసి ఉంటే స్టార్ పవర్తో కాంగ్రెస్ లాభపడేదనే భావనని వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు కీలకమైన రాయ్బరేలీ, అమేథీ నుంచి రాహుల్ గాంధీతో పాటు గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న కిషోరి లాల్ శర్మ నామినేషన్ దాఖలు చేశారు. ఈ రెండు స్థానాలకు ఐదో విడతలో మే 20న ఎన్నికలు జరగనున్నాయి.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..