Bedroom Jihadis: కశ్మీర్లో బెడ్రూం జిహాదీలు.. కొనసాగుతున్న మత కలహాలు!
- జమ్మూకశ్మీర్లో రెచ్చిపోతున్న బెడ్రూం జిహాదీలు..
- కశ్మీర్ ప్రజల మధ్య మత కలహాలు, కులాల మధ్య చిచ్చు..
- సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్స్ ఓపెన్ చేసి రెచ్చగొట్టే కంటెంట్ వ్యాప్తి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bedroom Jihadis: జమ్మూ కశ్మీర్లో టెర్రరిస్టులతో ఏళ్ల తరబడి ప్రత్యక్ష పోరాటం చేస్తున్న భద్రతా దళాలకు ప్రస్తుతం రహస్య శత్రువులను ఎదుర్కొంటున్నారని సమాచారం. ఇంట్లోనే కూర్చుని సోషల్ మీడియా వేదికగా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ.. వర్గ విభేదాలను రెచ్చగొడుతున్న బెడ్రూం జిహాదీల రూపంలో వారికి ఛాలెంజ్ విసిరుతున్నారు. సాంప్రదాయ ఉగ్రవాదులకు భిన్నంగా ఉండే ఈ దుర్మార్గులు కశ్మీర్ను అస్థిరపరిచే ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు అధికారులు చెప్పుకొచ్చారు. ఈ అల్లర్లు సృష్టంచడానికి సోషల్ మీడియాలో అనేక ఫేక్ అకౌంట్స్ ఓపెన్ చేసినట్లు గుర్తించారు.
Read Also: iQOO Z10 Lite 4G: 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరా, AMOLED డిస్ప్లేతో ఐక్యూ Z10 లైట్ 4G లాంచ్..!
Also Read
- PM Modi: విదేశాల నుంచి రాగానే ప్రధాని మోడీ అత్యవసర భేటీ.. అసలు కథ ఇదేనా?
- Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
- West Bengal: అక్రమ బంగ్లాదేశీయుల బహిష్కరణ.. బెంగాల్లో సీఏఏ స్టార్ట్..
- Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో ఎన్ఐఏ సంచలన ఛార్జిషీట్.. ఆ ఇద్దరి గైడ్స్ ఎంత పని చేశారంటే..!
అయితే, కశ్మీర్ లోయలో మత కలహాలు, అశాంతి సృష్టించాలనే ఉద్దేశంతో దుష్ప్రచారం, రెచ్చగొట్టే కంటెంట్ను వ్యాప్తి చేస్తున్న సోషల్ మీడియా ఖాతాల నెట్వర్క్ను అధికారులు గుర్తించారు. ఈ ఖాతాలను పాకిస్థాన్లోని ఉగ్ర సంస్థలు, వాటి సానుభూతిపరులు నియంత్రిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చాలా కాలంగా కొనసాగుతున్న దర్యాప్తులో అధికారులు వేలాది సోషల్ మీడియా పోస్టులు, కామెంట్లు, ప్రైవేట్ మెసేజ్లను పరిశీలించారు. ఈ విశ్లేషణలో పాక్లో ఉన్న హ్యాండ్లర్లకు ఈ సంఘ విద్రోహక గుంపులకు ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లు సాక్ష్యాలు లభించాయి. కంప్యూటర్లు, స్మార్ట్ఫోన్ల సహాయంతో ఈ ‘జిహాదీలు’ ఎక్కడి నుంచైనా యుద్ధం చేస్తారు, వదంతులు వ్యాప్తి చేస్తూ యువతను ప్రలోభాలకు గురి చేస్తున్నారని అధికారులు తెలిపారు.
Read Also: Off The Record : 20 నెలలుగా సుడా పాలక మండలి లేక పడకేసిన అభివృద్ధి
ఇక, ఓ సోషల్ మీడియా పోస్టుల ద్వారా స్థానికంగా ఇరు వర్గాల మధ్య చిచ్చుపెట్టారు.. కానీ.. శ్రీనగర్ పోలీసులు సకాలంలో స్పందించడం వల్ల పరిస్థితి అదుపులోకి వచ్చిందని అన్నారు. మరో కేసులో.. ఓ వర్గానికి చెందిన వారి వ్యక్తిగత వివరాలను సోషల్ మీడియాలో లీకయ్యాయని వెల్లడించారు. ఈ వ్యవహారంలో ఓ యువకుడిని అరెస్టు చేసి ఎంక్వైరీ చేయగా.. పాక్ నుంచి తనకు ఈ మేరకు ఆదేశాలు వచ్చాయని పేర్కొన్నాడని సదరు అధికారి తెలిపారు.
తాజావార్తలు
-
Brahma Muhurta Dreams: బ్రహ్మ ముహూర్తంలో ఎలాంటి కలలు వస్తే మంచిదో తెలుసా..?
-
PM Modi: విదేశాల నుంచి రాగానే ప్రధాని మోడీ అత్యవసర భేటీ.. అసలు కథ ఇదేనా?
-
US Navy Deployment Cuba: క్యూబాపై ట్రంప్ దృష్టి.. కరేబియన్కు చేరుకున్న అమెరికా యుద్ధనౌక
-
Hardik Pandya: “సాకులు చెప్పను.. మేం తప్పు చేశాం”.. ముంబై వైఫల్యాలపై హార్దిక్ ఓపెన్ టాక్!
-
Astrology: మే 21 గురువారం దినఫలాలు.. ఏ రాశివారు ఏ పూజ చేస్తే మేలు..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!