Bangladesh: పాకిస్తాన్ కోసం బంగ్లాదేశ్ కీలక నిర్ణయం.. భారత్కి సెక్యూరిటీ సమస్య..
- పాకిస్తాన్ కోసం బంగ్లాదేశ్ కీలక నిర్ణయం..
- వీసా రూల్స్ సవరించిన బంగ్లా..
- భారత్కి భద్రతాపరమైన సమస్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: బంగ్లాదేశ్ రోజురోజుకు భారత్తో వైరం పెట్టుకోవాలని తహతహలాడుతోంది. అందుకు ఆ దేశం తీసుకుంటున్న నిర్ణయాలే కారణం. ఇప్పటికే బంగ్లాదేశ్ వ్యాప్తంగా హిందువులపై అకృత్యాలు కొనసాగిస్తూ, భారత్ని కవ్వించే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు బంగ్లాదేశ్ తన సరిహద్దుల్లో బైరెక్టర్ డ్రోన్లను మోహరించింది. బంగ్లాదేశ్ సరిహద్దును దాటి ఆ దేశ బోర్డర్ గార్డ్స్ అస్సాంలోకి చొరబడ్డారు. సరిహద్దుల్లో నిర్మితమవుతున్న ఆలయ నిర్మాణాన్ని ఆపేయాలంటూ, లేకుంటే కాల్పులు జరుపుతామంటూ హెచ్చరించారు. ఈ చర్యతో అంతర్జాతీయ చట్టాలను బంగ్లాదేశ్ సరిహద్దు దళం ఉల్లంఘించింది.
Read Also: Pushpa 2: రెండో రోజుకే 500 కోట్ల క్లబ్బులో పుష్ప.. అస్సలు తగ్గేదేలే!
Also Read
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
- Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
ఇదిలా ఉంటే, బంగ్లాదేశ్-పాకిస్తాన్ మధ్య సంబంధాలు మరింతగా పెరుగుతున్నాయి. ఇప్పటికే బంగ్లాలో తమ జాతిపిత షేక్ ముజిబుర్ రెహ్మాన్ని కాదని మహ్మద్ అలీ జిన్నాను పొగుడుతున్నారు. తాజాగా రెండు దేశాల మధ్య బంధం మరింతగా పెరిగేందుకు బంగ్లాదేశ్, పాకిస్తాన్ పౌరులకు వీసా నిబంధనల్ని సడలించింది. పాకిస్తాన్ పౌరులుకు భద్రతా క్లియరెన్స్ పొందాల్సిన అవసరాన్ని తొలగించింది. 2019లో ఈ క్లియరెన్స్ని ప్రవేశపెట్టారు. డిసెంబర్ 2న బంగ్లా హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని సెక్యూరిటీ సర్వీసెస్ డివిజన్(ఎస్ఎస్డీ) కొత్త విధానాన్ని ప్రవేశపెట్టి, పరిమితుల్ని తొలగించింది. ఈ పరిణామం రానున్న కాలంలో భారత్కి భద్రతా పరమైన సమస్యలు తెచ్చిపెట్టే అవకాశం ఉంది.
బంగ్లాదేశ్లోని పాకిస్తాన్ హైకమీషనర్ సయ్యద్ అహ్మద్ మరూఫ్ డిసెంబర్ 3న ఢాకాలో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) నాయకురాలు ఖలీదా జియాతో సమావేశానికి ఒక రోజు ముందు ఈ నిర్ణయం వెలువడింది. గత నెలలో తొలిసారిగా కరాచీ నుంచి బంగ్లాదేశ్ చిట్టగాంగ్కి పాకిస్తాన్ నుంచి కార్గో నౌక వచ్చింది. ఇప్పుడు పాకిస్తానీలకు వీసా నిబంధనల్లో సడలింపుల్ని ఇచ్చింది. ఖలీదా జియా, మాజీ ప్రధాని షేక్ హసీనాలా కాకుండా పాకిస్తాన్తో సంబంధాలను కలిగి ఉండి. షేక్ హసీనా సమయంలో భారత్కి మంచి మిత్రురాలిగా ఉండేది. ఇప్పుడు బంగ్లాదేశ్ మొత్తం జమాతే ఇస్లామీ, బీఎన్పీలే పాలన సాగిస్తున్నారు. ఈ రెండు కూడా పాకిస్తాన్ అనుకూల పార్టీలుగా పేరు పొందాయి.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!