ఉత్తరాఖండ్ గవర్నర్ రాజీనామా.. కారణం ఇదేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2022లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరాఖండ్లో ఇప్పటికే కీలక రాజకీయ మార్పులు జరిగాయి… ఇప్పుడు.. ఆ రాష్ట్ర గవర్నర్ బేబీ రాణి మౌర్య తన పదవికి రాజీనామా చేశారు. ఉత్తరాఖండ్ గవర్నర్గా ఆమె బాధ్యతలు స్వీకరించి మూడేళ్లు కాగా.. మరో రెండేళ్ల పదవీ కాలం మిగిలి ఉండగానే బాధ్యతల నుంచి తప్పుకోవడం చర్చగా మారింది.. బేబీ రాణి మౌర్య.. రాజీనామా లేఖను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు పంపినట్టు రాజ్భవన్ అధికారి తెలిపారు.. అయితే, ఆమె వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేసినట్టు చెప్పుకొచ్చాడు. 2018 ఆగస్టు 26న ఉత్తరాఖండ్ గవర్నర్గా బాధ్యతలు స్వీకరించిన ఆమె.. పదవికాలం మిగిలుండగానే రాజీనామా చేయడం కొత్త చర్చకు తావిస్తోంది.
అయితే, ఉత్తరాఖండ్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది.. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనే రాష్ట్రాల్లో ఉత్తరాఖండ్ కూడా ఒకటిగా ఉంది.. మరోవైపు.. తక్కువ కాలంలో అక్కడ ఇద్దరు సీఎంలను మార్చేసింది బీజేపీ అధిష్టానం.. మరోసారి ఉత్తరాఖండ్లో విజయం సాధించడానికే సీఎంలను మార్చారనే చర్చ జరగగా.. ఇప్పుడు గవర్నర్ రాజీనామాలో కూడా రాజకీయ కారణాలను వెతుకున్నారు విశ్లేషకులు.
Also Read
- Tamil Politics: విజయ్పై మొదలైన డీఎంకే విమర్శలు.. ఏం జరిగిందంటే..?
- PM Modi: మే 15 లోపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగొచ్చా.. మోడీ వ్యాఖ్యల ఆంతర్యం ఏమిటి.?
- CM Vijay Simplicity: దటీజ్ దళపతి.. సీఎం హోదాలో ఉన్నా.. టేబుల్ మోసి సింప్లిసిటీ చాటుకున్న విజయ్!
- PM Modi: కాంగ్రెస్కు కొత్త పేరు పెట్టిన మోడీ.. ‘MMC’ అంటే ముస్లిం లీగ్, మావోవాది కాంగ్రెస్!
తాజావార్తలు
-
Vishwambhara Two Parts : రెండు భాగాలుగా విశ్వంభర.. కన్ఫమ్ చేసిన దర్శకుడు
-
IPL 2026 Playoffs: ఒకే రోజు రెండు జట్లు ఇంటికి.. టాప్ లేపిన ఆర్సీబీ.. ప్లేఆఫ్స్ రేసు మరింత రసవత్తరం!
-
Hero to Turn Director : హిట్టు కోసం తానే దర్శకత్వం చేసుకుంటున్న హీరో
-
Sai Pallavi: ‘రామాయణ’ టీమ్పై సాయిపల్లవి ఫ్యాన్స్ ఫైర్!
-
Dropped Catch: ఆ ఒక్క క్యాచ్ మిస్.! ఫలితం.. ఐపీఎల్ 2026 నుండి ముంబై ఇండియన్స్ అవుట్..