Atiq Ahmed: గ్యాంగ్స్టర్ అతిక్ అహ్మద్కు జీవిత ఖైదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Atiq Ahmed: ఒకానొక సమయంలో ఉత్తర్ ప్రదేశ్ లో చక్రం తిప్పిన గ్యాంగ్ స్టర్ కమ్ పొలిటీషియన్ అతిక్ అహ్మద్ కు ప్రయాగ్ రాజ్ కోర్టు జీవితఖైదు విధించింది. ఆయనతో పాటు మరో ఇద్దరికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది. ఈ కేసులో అతిక్ అహ్మద్ సోదరుడు ఖలీద్ అజీమ్ అలియాస్ అష్రఫ్ సహా మరో ఏడుగురిని నిర్దోషులుగా గుర్తించింది. హత్య, కిడ్నాప్ తో సహా అతిక్ అహ్మద్ పై 100కు పైగా క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నారు.
సోమవారం ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు ఇతడిని రోడ్డు మార్గం ద్వారా గుజరాత్ నుంచి ప్రయాగ్ రాజ్ తీసుకువచ్చారు. అతడిని తీసుకువచ్చే క్రమంలో యూపీ పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. యోగీ సర్కార్ ఎన్ కౌంటర్ చేస్తుందనే భయంతో తనను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించాలని అతిక్ అహ్మద్ కోరారు. 17 ఏళ్ల నాటి కిడ్నాప్ కేసులో నేడు కోర్టు విచారణకు ముందు, అహ్మద్ను గుజరాత్లోని సబర్మతి జైలు నుంచి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రయాగ్రాజ్లోని నైనీ సెంట్రల్ జైలుకు తరలించారు.
Also Read
- Kesar Mango Record: పండ్ల రాజు గిర్ కేసర్ మామిడి.. 10 ఏళ్ల రికార్డులు బద్దలు
- Uddhav Thackeray: అధికారం కోసం కాదు, సిద్ధాంతాల కోసమే పదవిని వదులుకున్నా: ఉద్ధవ్ ఠాక్రే
- MK Stalin: రాహుల్గాంధీకి వెరైటీగా బర్త్డే విషెస్ చెప్పిన స్టాలిన్
- Rahul Gandhi: ఖర్గే ఆధ్వర్యంలో బర్త్డే కేక్ కట్ చేసిన రాహుల్ గాంధీ.. అభిమానులతో ఫొటోలు
Read Also: Rahul Gandhi: ఎంపీ బంగ్లాను ఖాళీ చేస్తా.. “హ్యాపీ మెమోరీస్” అంటూ రాహుల్ లేఖ
2005లో మాయావతి పార్టీ బహూజన్ సమాజ్వాదీ పార్టీ( బీఎస్పీ) కి చెందిన ఎమ్మెల్యే రాజుపాల్ ను హత్య చేశారు. ఈ కేసులో ఉమేష్ పాల్ అనే వ్యక్తి కీలక సాక్షిగా ఉన్నాడు. అయితే ఇతడిని 2006లో అతిక్ అహ్మద్ గ్యాంగ్ కిడ్నాప్ చేసింది. తన వాంగ్మూలాన్ని ఉపసంహరించుకోవాలని తుపాకీతో బెదిరించారు. ఇదిలా ఉంటే ఒక నెల క్రితం ఫిబ్రవరిలో ఉమేష్ పాల్ దారుణంగా హత్యకు గురయ్యాడు. ఈ ఘటనలో ఉమేష్ పాల్ తో పాటు ఇద్దరు గన్ మెన్స్ కూడా మరణించారు. ఈ ఘటన వెనక అతిక్ అహ్మద్ హస్తం ఉందని తెలుస్తోంది. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న యూపీ పోలీసులు నిందితులను పట్టుకునే ప్రయత్నం చేశారు. ఉమేష్ పాల్ హత్యలో పాల్గొన్న ఇద్దరిని యూపీ పోలీసు ఎన్ కౌంటర్ లో లేపేశారు.
ప్రస్తుతం 2006 ఉమేష్ పాల్ కిడ్నాప్ కేసులో కోర్టు తీర్పు వెలువరించింది.ఇదిలా ఉంటే ప్రత్యక్ష సాక్షిగా ఉన్న ఉమేష్ పాల్ ను హత్య చేయడంపై యోగీ ఆదిత్య నాథ్ సీరియస్ అయ్యారు. ప్రతిపక్ష నేత, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ పై అసెంబ్లీలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. యూపీలో మాఫియాను మట్టిలో కలిపేస్తానంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
తాజావార్తలు
-
Israel-Hezbollah: ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం! అమెరికా సంకేతాలు
-
Kuldeep Yadav: కుల్దీప్ స్థానానికి ముప్పు..? టీమిండియాలో అసలు నిజాలు వెల్లడించిన కోచ్..
-
Kesar Mango Record: పండ్ల రాజు గిర్ కేసర్ మామిడి.. 10 ఏళ్ల రికార్డులు బద్దలు
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్తో నిమిషాల్లో క్లీన్.!
-
Parastoo Ahmadi: హిజాబ్ ధరించనందుకు గాయనికి 74 కొరడా దెబ్బలతో శిక్ష
ట్రెండింగ్
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు