Atiq Ahmed: గ్యాంగ్స్టర్ అతిక్ అహ్మద్కు జీవిత ఖైదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Atiq Ahmed: ఒకానొక సమయంలో ఉత్తర్ ప్రదేశ్ లో చక్రం తిప్పిన గ్యాంగ్ స్టర్ కమ్ పొలిటీషియన్ అతిక్ అహ్మద్ కు ప్రయాగ్ రాజ్ కోర్టు జీవితఖైదు విధించింది. ఆయనతో పాటు మరో ఇద్దరికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది. ఈ కేసులో అతిక్ అహ్మద్ సోదరుడు ఖలీద్ అజీమ్ అలియాస్ అష్రఫ్ సహా మరో ఏడుగురిని నిర్దోషులుగా గుర్తించింది. హత్య, కిడ్నాప్ తో సహా అతిక్ అహ్మద్ పై 100కు పైగా క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నారు.
సోమవారం ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు ఇతడిని రోడ్డు మార్గం ద్వారా గుజరాత్ నుంచి ప్రయాగ్ రాజ్ తీసుకువచ్చారు. అతడిని తీసుకువచ్చే క్రమంలో యూపీ పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. యోగీ సర్కార్ ఎన్ కౌంటర్ చేస్తుందనే భయంతో తనను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించాలని అతిక్ అహ్మద్ కోరారు. 17 ఏళ్ల నాటి కిడ్నాప్ కేసులో నేడు కోర్టు విచారణకు ముందు, అహ్మద్ను గుజరాత్లోని సబర్మతి జైలు నుంచి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రయాగ్రాజ్లోని నైనీ సెంట్రల్ జైలుకు తరలించారు.
Also Read
- CM Vijay: తమిళనాడు సీఎం విజయ్ పథకం.. ఒక్క పైసకే గ్రాము బంగారం.. పథకంలో షాకింగ్ ట్విస్ట్..
- H1N1: ఢిల్లీలో స్వైన్ ఫ్లూ టెన్షన్.. గతేడాదితో పోల్చితే 8 రెట్లు పెరిగిన కేసులు..
- Mu*rder: భార్య కోసం నరబలి.? వ్యక్తిని హత్య చేసి తలను పూజా గదిలో దాచిన హంతకుడు.!
- Vande Mataram Row: 150 ఏళ్ల చరిత్ర...వందేమాతరంపై కాంగ్రెస్ అభ్యంతరమేంటి?
Read Also: Rahul Gandhi: ఎంపీ బంగ్లాను ఖాళీ చేస్తా.. “హ్యాపీ మెమోరీస్” అంటూ రాహుల్ లేఖ
2005లో మాయావతి పార్టీ బహూజన్ సమాజ్వాదీ పార్టీ( బీఎస్పీ) కి చెందిన ఎమ్మెల్యే రాజుపాల్ ను హత్య చేశారు. ఈ కేసులో ఉమేష్ పాల్ అనే వ్యక్తి కీలక సాక్షిగా ఉన్నాడు. అయితే ఇతడిని 2006లో అతిక్ అహ్మద్ గ్యాంగ్ కిడ్నాప్ చేసింది. తన వాంగ్మూలాన్ని ఉపసంహరించుకోవాలని తుపాకీతో బెదిరించారు. ఇదిలా ఉంటే ఒక నెల క్రితం ఫిబ్రవరిలో ఉమేష్ పాల్ దారుణంగా హత్యకు గురయ్యాడు. ఈ ఘటనలో ఉమేష్ పాల్ తో పాటు ఇద్దరు గన్ మెన్స్ కూడా మరణించారు. ఈ ఘటన వెనక అతిక్ అహ్మద్ హస్తం ఉందని తెలుస్తోంది. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న యూపీ పోలీసులు నిందితులను పట్టుకునే ప్రయత్నం చేశారు. ఉమేష్ పాల్ హత్యలో పాల్గొన్న ఇద్దరిని యూపీ పోలీసు ఎన్ కౌంటర్ లో లేపేశారు.
ప్రస్తుతం 2006 ఉమేష్ పాల్ కిడ్నాప్ కేసులో కోర్టు తీర్పు వెలువరించింది.ఇదిలా ఉంటే ప్రత్యక్ష సాక్షిగా ఉన్న ఉమేష్ పాల్ ను హత్య చేయడంపై యోగీ ఆదిత్య నాథ్ సీరియస్ అయ్యారు. ప్రతిపక్ష నేత, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ పై అసెంబ్లీలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. యూపీలో మాఫియాను మట్టిలో కలిపేస్తానంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
తాజావార్తలు
-
Spirit Controversy: వంగా బ్రదర్స్ ఆరోపణలపై దీపికా పదుకొణె పరోక్ష కౌంటర్.. ఆ ఒక్క లైక్తో సంచలనం!
-
Saha: థియేటర్లలోకి శివ కుమార్ కాసారం ‘సహ’.. రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన మేకర్స్
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Gachibowli Building Collapse : గచ్చిబౌలిలో హైటెన్షన్.. కుప్పకూలిన 7 అంతస్తుల భవనం..!
-
ISRO: ఇస్రో ఇక రాకెట్లు తయారు చేయదా?.. సంస్థ కొత్త వ్యూహం ఇదే..!
ట్రెండింగ్
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!