Assam: అత్యాచార నిందితుడిని కొట్టి చంపిన గ్రామస్తులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
criminal beaten to death by mob after fleeing custody: అత్యాచారం కేసుతో పాటు ఇతర కేసుల్లో నిందితుడిగా ఉన్న ఓ వ్యక్తిని గ్రామస్తులు కొట్టిచంపారు. ఈ ఘటన అస్సాం రాష్ట్రంలోని లఖింపూర్ లోని గిలమారా పోలీస్ స్టేషన్ పరిధిలోని కిలకిలి గ్రామంలో చోటు చేసుకుంది. రాజు బారువా అలియాస్ గెర్జాయ్ ఇటీవల ఓ కేసు విచారణ సందర్భంగా కోర్టుకు తీసుకెళ్లిన క్రమంలో తప్పించుకున్నాడు. అయితే కిలకిల గ్రామంలోని ఓ వాగు దగ్గర దాక్కుని ఉండడాని గమనించారు కొంతమంది గ్రామస్తులు. అయితే పట్టుకున్న అతడిని పోలీసులకు అప్పగించే లోపే గ్రామస్తులంతా కలిసి కొట్టారు.
గురువారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకునే లోపే నిందితుడు రాజుబారువా తీవ్రంగా గాయపడి ఉన్నాడు. ఈ క్రమంలో అతడిని స్థానిక ఆస్పత్రికి తలరించారు.. కానీ అప్పటికే గాయాల తీవ్రత ఎక్కవగా ఉండటంతో అతడు మరణించాడని లఖింపూర్ ఎస్పీ బీఎం రాజ్ ఖోవా తెలిపారు. 40 ఏళ్ల వయసున్న రాజు బారువా ఆ ప్రాంతంలో కరగుగట్టిన నేరస్తుడు. అతనిపై డజనుకు పైగా కేసులు ఉన్నాయి. అత్యాచారం, హత్య కేసులు కూడా ఉన్నాయి. ఇతడి నేర కలాపాలపై స్థానికులకు బాగా తెలుసు ఎస్పీ వెల్లడించారు. నిందితుడిని కొట్టి చంపిన గ్రామస్తుల గుర్తింపు జరుగుతుందని.. గుర్తు తెలియని వ్యక్తులపై హత్యానేరం కింద కేసులు నమోదు చేశామని.. కొట్టి చంపిన గ్రామస్తుల గుర్తింపు జరుగుతుంది.. అయితే ఇంకా ఎవరిని అరెస్ట్ చేయలేదని ఎస్పీ తెలిపారు.
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
ఇటీవల రాజు బారువాతో పాటు మరో ఇద్దరు నేరస్తులు ఢకుఖానలోని కోర్టు నుంచి పోలీస్ కస్టడీ నుంచి పారిపోయారు. విచారణకు కోర్టుకు తీసుకువచ్చిన సందర్భంలో ఎస్కేప్ అయ్యారు. ఇందులో బుధవారం ఒక వ్యక్తిని అరెస్ట్ చేయగా.. రాజు బారువా గ్రామస్తుల చేతిలో చనిపోయాడు. మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. బారువా గత ఏడాది సెప్టెంబర్ లో పోలీసు ఎన్ కౌంటర్ లో గాయపడ్డాడు. ఈ ఏడాది జనవరిలో కోవిడ్ సోకడంతో ఆస్పత్రిలో చేర్పిస్తే అక్కడి నుంచి పారిపోయాడు.. ఆ తరువాత మళ్లీ పోలీసులు పట్టుకున్నారు. అయితే ఈ సారి కూడా పారిపోయాడా..అయితే గ్రామస్తులకు చిక్కి కుక్కచావు చచ్చాడు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!