Naegleria Fowleri Infection: ‘మెదడును తినే అమీబా’.. అమెరికాలో ఒకరు మృతి.. ఈ వ్యాధి ఎలా సోకుతుంది.. లక్షణాలేంటి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Naegleria Fowleri Infection: ప్రపంచంలో కొత్తకొత్త వ్యాధులు వెలుగులోకి వస్తున్నాయి. చైనా వూహాన్ నగరంలో ప్రారంభం అయిన కోవిడ్ 19 వ్యాధి గత రెండున్నరేళ్లుగా ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది. చాలా దేశాల ఆర్థిక వ్యవస్థలను చిన్నాభిన్నం చేసింది. చాలా దేశాలు కోవిడ్ తో ఆర్థికమాంద్యం పరిస్థితుల్లోకి వెళ్లాయి. ఇక ఇప్పుడు మంకీపాక్స్ రూపంలో మరో వ్యాధి ప్రపంచాన్ని కలవరపరుస్తోంది. ఇప్పటికే 92 దేశాల్లోకి ఈ వ్యాధి పాకింది. 35 వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. ఎక్కువగా యూరప్ దేశాలు, అమెరికాలోనే ఎక్కువగా నమోదు అయ్యాయి.
తాజాగా మరో కొత్త వ్యాధి వెలుగులోకి వచ్చింది. అత్యంత అరుదుగా సంభవించే నేగ్లేరియా ఫౌలెరీ ఇన్ఫెక్షన్తో అమెరికాలోనే నెబ్రాస్కాలో ఓ చిన్నారి మరణించింది. అత్యంత అరుదైన వ్యాధిగా దీన్ని చూస్తారు. ఈ నేగ్లేరియా ఫౌలేరీ ఇన్ఫెక్షన్ ను ‘‘ మెదడు తినే అమీబా’’గా పిలుస్తారు. ఇది ముఖ్యంగా మెదడుపై ప్రభావం చూపిస్తుంది. ఈ వ్యాధి సోకితే దాదాపుగా ప్రాణాలు కోల్పేయే అవకాశం ఉంది.
Also Read
Read Also: Chahal- Dhanashree: వేరే క్రికెటర్తో భార్యకు ఎఫైర్.. చాహల్ ఏమన్నాడంటే..?
వ్యాధి ఎలా సోకుతుంది..?
నెగ్లేరియా ఫౌలేరి అనేది సరస్సులు, నదులు, వేడి నీటి బుగ్గలు వంటి ప్రాంతాల్లో నేలలో, వెచ్చని మంచినీటిలో నివసించే అమీబా. ఈ అమీబీ ప్రైమరీ అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటీస్ (పీఏఎం)కు కారణం అవుతుంది. దీనిని మెదడును తినే అమీబాగా వ్యవహరిస్తారు. సాధారణంగా ఈత కొట్టేటప్పుడు అమీబా ఉన్న నీరు ముక్కుపైకి వెళ్లినప్పుడు మెదడుకు ఈ ఇన్ఫెక్షన్ సోకుతుంది. ఇది సోకితే దాదాపుగా మరణం సంభవిస్తుంది.
సురక్షితమై, క్లోరినేషన్ చేసిన నీటి కొలనుల్లో ఈత కొట్టడం వల్ల ఈ వ్యాధి బారిన పడే అవకాశం తగ్గతుంది. యూఎస్ఏలో ప్రతీ ఏడాది ముగ్గురు ఈ వ్యాధి బారినపడి మరణిస్తున్నారు. ఈ వ్యాధి సోకినప్పుడు ప్రారంభంలో తలనొప్పి, జ్వరం, వికారం, వాంతుల వంటి లక్షణాలు ఉంటాయి. నెమ్మదిగా వ్యాధి తీవ్రం అవుతుంది. చివరకు ప్రాణాంతకంగా మారుతుంది.
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!