Arunachal CM: చైనా “మెగా డ్యామ్”, భారత్కు “వాటర్ బాంబ్”
- చైనా నిర్మిస్తున్న మెగాడ్యామ్, భారత్కు ‘‘వాటర్ బాంబ్’’..
- బ్రహ్మపుత్రపై టిబెట్లో చైనా భారీ డ్యామ్..
- హెచ్చరించిన అరుణాచల్ సీఎం పెమా ఖండూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arunachal CM: అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు సమీపంలో చైనా నిర్మిస్తున్న మెగా డ్యామ్, భారతదేశానికి ఒక ‘‘వాటర్ బాంబ్’’ అని అరుణాచల్ సీఎం పెమా ఖండూ అన్నారు. ఇది అస్తిత్వ ముప్పు, సైనిక ముప్పు మాత్రమే కాకుండా, మరేదైనా పెద్ద సమస్యగా ఉంటుందని ఆయన అన్నారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బ్రహ్మపుత్రపై(చైనా యార్లుంగ్ త్సాంగ్పోగా పిలుస్తుంది) చైనా నిర్మిస్తున్న అతిపెద్ద ఆనకట్ట, తీవ్ర ఆందోళన కలిగించే విషయమని అన్నారు. ఈ మెగా డ్యామ్ టిబెట్ ప్రాంతంలో ఉంది. చైనా అంతర్జాతీయ జల ఒప్పందాలపై సంతకం చేయకపోవడం వల్ల, అది అంతర్జాతీయ నిబంధనలకు కట్టుబడి ఉండే అవకాశం లేదని ఆయన చెప్పారు.
చైనాను నమ్మలేమని, వారు ఏం చేస్తారో ఎవరికీ తెలియదని ఖండూ అన్నారు. చైనా నుంచి సైనిక ముప్పుతో పోలిస్తే, ఇది అంతకన్నా పెద్ద ముప్పుగా తనకు అనిపిస్తోందని చెప్పారు. ఇది తెగలు, మన జీవనోపాధికి అస్తిత్వ సమస్య అని చెప్పారు. ఇది ఒక రకమైన ‘‘వాటర్ బాంబు’’ అని చెప్పారు. 2021లో చైనా ప్రధాని లీ కెకియాంగ్ సరిహద్దు ప్రాంతంలో ఈ ఆనకట్ట నిర్మాణాన్ని ప్రకటించారు.
Also Read
- IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
- Shocking Incident: రూ. 60 లక్షల ప్యాకేజ్ అల్లుడు.. చిన్న గొడవకే చంపేసిన అత్తింటివారు..
- PM Modi: బీజేపీ కొత్త టీమ్తో మోడీ భేటీ.. జెన్-జీపై ప్రత్యేక ఫోకస్
- Abhijeet Dipke: స్కూల్లోకి ఎంట్రీ.. టీచర్లకు బెదిరింపు! అభిజీత్ దీప్కేపై కేసు
Read Also: PM Modi: ప్రధాని మోడీకి నమీబియా పార్లమెంట్ “స్టాండింగ్ ఓవేషన్”.. వీడియో చూడండి..
నివేదికల ప్రకారం, 2024లో 137 బిలియన్ డాలర్ల ఖర్చుతో ఐదేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది. దీని ద్వారా 60,000 MW విద్యుత్తును ఉత్పత్తి చేయాలని డ్రాగన్ కంట్రీ భావిస్తోంది. ఈ ప్రాజెక్టు నిర్మితమైతే ప్రపంచంలోనే అతిపెద్ద జల విద్యుత్ ఆనకట్టగా మారుతుంది.
వాస్తవానికి, అంతర్జాతీయ జల-పంపిణీ ఒప్పందాలకు చైనా సంతకం చేసి ఉంటే, ఈ ప్రాజెక్టు భారతదేశానికి ఒక వరంలా ఉండేదని పెమా ఖండూ అన్నారు. ఒకటి, బ్రహ్మపుత్ర ప్రవహించే అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బంగ్లాదేశ్ల వేసవి వరదలను ఇది నిరోధించి ఉండేది. కానీ, చైనా సంతకం చేయకపోవడం వల్ల అకాస్మత్తుగా నీటిని విడుదల చేస్తే సియాంగ్ బెల్ట్ నాశనం అవుతుందని చెప్పారు. దీని కారణంగా, భారత ప్రభుత్వం సియాంగ్ ఎగువ ఎగువ బహుళార్ధసాధక ప్రాజెక్టు రూపొందించిందని, ఇది మనకు రక్షణగా పనిచేస్తుందని సీఎం చెప్పారు.
తాజావార్తలు
-
KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్ను కూడా మారుస్తుంది!
-
Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
-
Hockey World Cup 2026: భారత్కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!