Arunachal CM: చైనా “మెగా డ్యామ్”, భారత్కు “వాటర్ బాంబ్”
- చైనా నిర్మిస్తున్న మెగాడ్యామ్, భారత్కు ‘‘వాటర్ బాంబ్’’..
- బ్రహ్మపుత్రపై టిబెట్లో చైనా భారీ డ్యామ్..
- హెచ్చరించిన అరుణాచల్ సీఎం పెమా ఖండూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arunachal CM: అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు సమీపంలో చైనా నిర్మిస్తున్న మెగా డ్యామ్, భారతదేశానికి ఒక ‘‘వాటర్ బాంబ్’’ అని అరుణాచల్ సీఎం పెమా ఖండూ అన్నారు. ఇది అస్తిత్వ ముప్పు, సైనిక ముప్పు మాత్రమే కాకుండా, మరేదైనా పెద్ద సమస్యగా ఉంటుందని ఆయన అన్నారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బ్రహ్మపుత్రపై(చైనా యార్లుంగ్ త్సాంగ్పోగా పిలుస్తుంది) చైనా నిర్మిస్తున్న అతిపెద్ద ఆనకట్ట, తీవ్ర ఆందోళన కలిగించే విషయమని అన్నారు. ఈ మెగా డ్యామ్ టిబెట్ ప్రాంతంలో ఉంది. చైనా అంతర్జాతీయ జల ఒప్పందాలపై సంతకం చేయకపోవడం వల్ల, అది అంతర్జాతీయ నిబంధనలకు కట్టుబడి ఉండే అవకాశం లేదని ఆయన చెప్పారు.
చైనాను నమ్మలేమని, వారు ఏం చేస్తారో ఎవరికీ తెలియదని ఖండూ అన్నారు. చైనా నుంచి సైనిక ముప్పుతో పోలిస్తే, ఇది అంతకన్నా పెద్ద ముప్పుగా తనకు అనిపిస్తోందని చెప్పారు. ఇది తెగలు, మన జీవనోపాధికి అస్తిత్వ సమస్య అని చెప్పారు. ఇది ఒక రకమైన ‘‘వాటర్ బాంబు’’ అని చెప్పారు. 2021లో చైనా ప్రధాని లీ కెకియాంగ్ సరిహద్దు ప్రాంతంలో ఈ ఆనకట్ట నిర్మాణాన్ని ప్రకటించారు.
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Silver: బంగారం తర్వాత ఇప్పుడు వెండి.. కేంద్రం కీలక నిర్ణయంతో పెరగనున్న ధరలు..
Read Also: PM Modi: ప్రధాని మోడీకి నమీబియా పార్లమెంట్ “స్టాండింగ్ ఓవేషన్”.. వీడియో చూడండి..
నివేదికల ప్రకారం, 2024లో 137 బిలియన్ డాలర్ల ఖర్చుతో ఐదేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది. దీని ద్వారా 60,000 MW విద్యుత్తును ఉత్పత్తి చేయాలని డ్రాగన్ కంట్రీ భావిస్తోంది. ఈ ప్రాజెక్టు నిర్మితమైతే ప్రపంచంలోనే అతిపెద్ద జల విద్యుత్ ఆనకట్టగా మారుతుంది.
వాస్తవానికి, అంతర్జాతీయ జల-పంపిణీ ఒప్పందాలకు చైనా సంతకం చేసి ఉంటే, ఈ ప్రాజెక్టు భారతదేశానికి ఒక వరంలా ఉండేదని పెమా ఖండూ అన్నారు. ఒకటి, బ్రహ్మపుత్ర ప్రవహించే అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బంగ్లాదేశ్ల వేసవి వరదలను ఇది నిరోధించి ఉండేది. కానీ, చైనా సంతకం చేయకపోవడం వల్ల అకాస్మత్తుగా నీటిని విడుదల చేస్తే సియాంగ్ బెల్ట్ నాశనం అవుతుందని చెప్పారు. దీని కారణంగా, భారత ప్రభుత్వం సియాంగ్ ఎగువ ఎగువ బహుళార్ధసాధక ప్రాజెక్టు రూపొందించిందని, ఇది మనకు రక్షణగా పనిచేస్తుందని సీఎం చెప్పారు.
తాజావార్తలు
-
Karuppu : ‘కరుప్పు’ సక్సెస్పై సూర్య ఎమోషనల్ పోస్ట్ వైరల్..!
-
Shubman Gill: “మేం గెలవడానికి అస్సలు అర్హులం కాదు”.. సొంత జట్టుపై కెప్టెన్ గిల్ తీవ్ర ఆగ్రహం..
-
Rajinikanth-Kamal Haasan: రజినీ – కమల్ మల్టీస్టారర్ నుంచి త్రిష ఔట్..?
-
Finn Allen: 10 సిక్సర్లు, 4 ఫోర్లు.. అభిషేక్, వైభవ్ల ప్రత్యేక బ్యాట్స్మెన్ల జాబితాలో ఫిన్ అలెన్..
-
Astrology: మే 17 శనివారం దినఫలాలు.. ఈ రాశివారు కాస్త జాగ్రత్త..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..