PM Modi: ప్రధాని మోడీకి నమీబియా పార్లమెంట్ “స్టాండింగ్ ఓవేషన్”.. వీడియో చూడండి..
- ప్రధాని మోడీకి నమీబియా పార్లమెంట్లో స్టాండింగ్ ఓవేషన్..
- భారత్-నమీబియా సంబంధాలపై ప్రసంగం..
- కలిసి అభివృద్ధి చెందుతామని నమీబియాకు పిలుపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ తన ఐదు దేశాల పర్యటనలో భాగంగా, బుధవారం ఆఫ్రికా దేశమైన నమీబియాలో పర్యటిస్తున్నారు. కొన్ని దశాబ్దాల తర్వాత ఆ దేశానికి వెళ్తున్న తొలి భారత ప్రధానిగా మోడీ రికార్డుకెక్కారు. ఇప్పటివరకు ఈ దేశానికి మోడీతో కలిపి ముగ్గురు భారత ప్రధానులు మాత్రమే వెళ్లారు. ప్రధానికి నమీబియా దేశ అత్యున్నత పురస్కారమైన ‘‘ఆర్డర్ ఆఫ్ ది మోస్ట్ ఏన్షియంట్ వెల్విట్చియా మిరాబిలిస్’’ ప్రదానం చేసింది.
పర్యటనలో భాగంగా ప్రధాని నమీబియా పార్లమెంట్ని ఉద్దేశించి ప్రసంగించారు. అంతకుముందు, నమీబియా పార్లమెంట్ సభ్యులు ప్రధాని మోడీ రాకతో ‘‘స్టాండింగ్ ఓవేషన్’’తో స్వాగతం పలికారు. తమ చప్పట్లతో సాదరంగా పార్లమెంట్లోకి ఆహ్వానించారు. 27 ఏళ్లలో ఒక భారతదేశ ప్రధాని నమీబియాను సందర్శించడం ఇదే మొదటిసారి.
Also Read
- Indoor Plants: ఒక్క గ్లాస్ నీటితో ఇంట్లో గ్రీన్ డెకరేషన్.. ఈ మొక్కలను ఇలా పెంచండి!
- AP Dwakra Women: డ్వాక్రా మహిళలకు గుడ్న్యూస్.. రూ.3 లక్షల రుణం, సబ్సిడీ కూడా!
- Census 2027: జనాభా లెక్కల్లో తొలిసారి కులగణన.. 40 ప్రశ్నలను నోటిఫై చేసిన కేంద్రం
- Termite-Proof Furniture: చెదల బెడదకు చెక్.. చెక్కకు బదులుగా ఈ మెటీరియల్స్ ఎంచుకోండంతే.!
Read Also: Pawan Kalyan: బ్యాటరీ సైకిల్ నడిపిన పవన్ కళ్యాణ్.. లక్ష ప్రోత్సాహకం! వీడియో వైరల్
నమీబియా పార్లమెంట్లో మాట్లాడుతూ, ఇరు దేశాల సంబంధాలను హైలెట్ చేశారు. మీ స్వాతంత్ర్యంతో భారత్ మీ వెంట నిలబడిందని, భారత్ ఐక్యరాజ్యసమితిలో నైరుతి ఆఫ్రికా సమస్యని లేవనెత్తిన విషయాన్ని ప్రధాని గుర్తు చేశారు. నమీబియా మహిళా అధ్యక్షురాలిని ఎన్నుకున్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. భారతదేశం కూడా ఒక పేద గిరిజన కుటుంబం నుంచి వచ్చిన మహిళ దేశానికి అధ్యక్షురాలు అయిన విషయాన్ని చెప్పారు. పేద కుటుంబంలో పుట్టిన నాలాంటి వ్యక్తిని మూడుసార్లు దేశానికి ప్రధాని అయ్యేలా చేసిన ఘటన రాజ్యాంగానిది అని కొనియాడారు.
2027 క్రికెట్ వరల్డ్ కప్కి సహ ఆతిథ్యం ఇస్తున్న నమీబియా విజయవంతం కావాలని కోరుకుంటున్నట్లు ప్రధాని చెప్పారు. మనం పోటీ పడటానికి కాదు, సహకరించడానికి ప్రయత్నిస్తున్నామని, భారత్ ఆఫ్రికా పారిశ్రామీకరణ కోసం మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు. పవర్ ద్వారా కాకుండా భాగస్వామ్యం ద్వారా నిర్వచించిన భవిష్యత్తును నిర్మిద్దామని, ఆధిపత్యం ద్వారా కాదు, సంభాషన ద్వారా కలిసి అభివృద్ధి చెందుదామని ప్రధాని పిలుపునిచ్చారు. కరోనా సమయంలో చాలా మంది వ్యాక్సిన్స్ ఇవ్వడానికి నిరాకరించిన సమయంలో కూడా, భారత్ వ్యాక్సిన్లు, మందులు ఇచ్చిందని గుర్తు చేశారు. నమీబియా ఆరోగ్యరంగం కోసం కీలక పరికరాలు ఇచ్చేందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రధాని చెప్పారు.
#WATCH | Windhoek, Namibia: PM Narendra Modi receives a standing ovation after his address at the Parliament of Namibia.
PM Narendra Modi also greeted the members of the Namibian Parliament.
(Video: DD News) pic.twitter.com/7CH1CFwWO9
— ANI (@ANI) July 9, 2025
తాజావార్తలు
-
Moto G Max: భారత్ లో మోటో జి మ్యాక్స్ విడుదల.. స్నాప్డ్రాగన్ 6s జెన్ 4 చిప్, 7,000mAh బ్యాటరీ.. ధర, ఫీచర్స్ ఇవే
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!
-
JoJo : ‘జోజో’ ఫస్ట్ లుక్.. ‘మనోభావాల బ్యాచ్’కి స్వీట్ వార్నింగ్
-
Indoor Plants: ఒక్క గ్లాస్ నీటితో ఇంట్లో గ్రీన్ డెకరేషన్.. ఈ మొక్కలను ఇలా పెంచండి!
-
AP Dwakra Women: డ్వాక్రా మహిళలకు గుడ్న్యూస్.. రూ.3 లక్షల రుణం, సబ్సిడీ కూడా!
ట్రెండింగ్
-
Termite-Proof Furniture: చెదల బెడదకు చెక్.. చెక్కకు బదులుగా ఈ మెటీరియల్స్ ఎంచుకోండంతే.!
-
Hardik Pandya Trade: చెన్నై, కోల్కతా కాదు.. హార్దిక్ ఆ జట్టులోకే వెళ్తాడు.. ఏ తప్పేముంది!
-
IND vs SL 1st Test: తుది జట్టులో చోటు ఉండదు.. స్టార్ బ్యాటర్కు హెడ్ కోచ్ గంభీర్ వార్నింగ్!
-
BSNL బంపర్ ఆఫర్.. 365 రోజులకు బదులుగా 412 రోజుల వ్యాలిడిటీ.! రోజుకు 2GB హై-స్పీడ్ డేటా కూడా..
-
IND vs SL: గిల్, రాహుల్, పంత్ కాదు.. అతడే సబ్ కాంటినెంట్కు కింగ్.. మొదటి టెస్టులో ఆడించాలి!