PM Modi: ప్రధాని మోడీకి నమీబియా పార్లమెంట్ “స్టాండింగ్ ఓవేషన్”.. వీడియో చూడండి..
- ప్రధాని మోడీకి నమీబియా పార్లమెంట్లో స్టాండింగ్ ఓవేషన్..
- భారత్-నమీబియా సంబంధాలపై ప్రసంగం..
- కలిసి అభివృద్ధి చెందుతామని నమీబియాకు పిలుపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ తన ఐదు దేశాల పర్యటనలో భాగంగా, బుధవారం ఆఫ్రికా దేశమైన నమీబియాలో పర్యటిస్తున్నారు. కొన్ని దశాబ్దాల తర్వాత ఆ దేశానికి వెళ్తున్న తొలి భారత ప్రధానిగా మోడీ రికార్డుకెక్కారు. ఇప్పటివరకు ఈ దేశానికి మోడీతో కలిపి ముగ్గురు భారత ప్రధానులు మాత్రమే వెళ్లారు. ప్రధానికి నమీబియా దేశ అత్యున్నత పురస్కారమైన ‘‘ఆర్డర్ ఆఫ్ ది మోస్ట్ ఏన్షియంట్ వెల్విట్చియా మిరాబిలిస్’’ ప్రదానం చేసింది.
పర్యటనలో భాగంగా ప్రధాని నమీబియా పార్లమెంట్ని ఉద్దేశించి ప్రసంగించారు. అంతకుముందు, నమీబియా పార్లమెంట్ సభ్యులు ప్రధాని మోడీ రాకతో ‘‘స్టాండింగ్ ఓవేషన్’’తో స్వాగతం పలికారు. తమ చప్పట్లతో సాదరంగా పార్లమెంట్లోకి ఆహ్వానించారు. 27 ఏళ్లలో ఒక భారతదేశ ప్రధాని నమీబియాను సందర్శించడం ఇదే మొదటిసారి.
Also Read
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
- Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
- CSK Vs LSG: లక్నో గ్రౌండ్లో కార్తీక్ శర్మ వీరవిహారం.. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై భారీ స్కోరు..
Read Also: Pawan Kalyan: బ్యాటరీ సైకిల్ నడిపిన పవన్ కళ్యాణ్.. లక్ష ప్రోత్సాహకం! వీడియో వైరల్
నమీబియా పార్లమెంట్లో మాట్లాడుతూ, ఇరు దేశాల సంబంధాలను హైలెట్ చేశారు. మీ స్వాతంత్ర్యంతో భారత్ మీ వెంట నిలబడిందని, భారత్ ఐక్యరాజ్యసమితిలో నైరుతి ఆఫ్రికా సమస్యని లేవనెత్తిన విషయాన్ని ప్రధాని గుర్తు చేశారు. నమీబియా మహిళా అధ్యక్షురాలిని ఎన్నుకున్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. భారతదేశం కూడా ఒక పేద గిరిజన కుటుంబం నుంచి వచ్చిన మహిళ దేశానికి అధ్యక్షురాలు అయిన విషయాన్ని చెప్పారు. పేద కుటుంబంలో పుట్టిన నాలాంటి వ్యక్తిని మూడుసార్లు దేశానికి ప్రధాని అయ్యేలా చేసిన ఘటన రాజ్యాంగానిది అని కొనియాడారు.
2027 క్రికెట్ వరల్డ్ కప్కి సహ ఆతిథ్యం ఇస్తున్న నమీబియా విజయవంతం కావాలని కోరుకుంటున్నట్లు ప్రధాని చెప్పారు. మనం పోటీ పడటానికి కాదు, సహకరించడానికి ప్రయత్నిస్తున్నామని, భారత్ ఆఫ్రికా పారిశ్రామీకరణ కోసం మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు. పవర్ ద్వారా కాకుండా భాగస్వామ్యం ద్వారా నిర్వచించిన భవిష్యత్తును నిర్మిద్దామని, ఆధిపత్యం ద్వారా కాదు, సంభాషన ద్వారా కలిసి అభివృద్ధి చెందుదామని ప్రధాని పిలుపునిచ్చారు. కరోనా సమయంలో చాలా మంది వ్యాక్సిన్స్ ఇవ్వడానికి నిరాకరించిన సమయంలో కూడా, భారత్ వ్యాక్సిన్లు, మందులు ఇచ్చిందని గుర్తు చేశారు. నమీబియా ఆరోగ్యరంగం కోసం కీలక పరికరాలు ఇచ్చేందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రధాని చెప్పారు.
#WATCH | Windhoek, Namibia: PM Narendra Modi receives a standing ovation after his address at the Parliament of Namibia.
PM Narendra Modi also greeted the members of the Namibian Parliament.
(Video: DD News) pic.twitter.com/7CH1CFwWO9
— ANI (@ANI) July 9, 2025
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..