Archana Tiwari: లా గ్రాడ్యుయేట్ అర్చన తివారీ అదృశ్యం.. 3 బృందాలు గాలింపు
- భోపాల్లో లా గ్రాడ్యుయేట్ అర్చన తివారీ అదృశ్యం
- 3 బృందాలు గాలింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రదేశ్లో న్యాయవాది అర్చన తివారీ (29) అదృశ్యం తీవ్ర కలకలం రేపుతోంది. ఆగస్టు 7 నుంచి ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో మూడు పోలీస్ బృందాలు ఆమె కోసం జల్లెడ పడుతున్నాయి. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Trump-Zelensky: వైట్హౌస్లో ట్రంప్-జెలెన్స్కీ నవ్వులు.. పువ్వులు.. వీడియో వైరల్
Also Read
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
- Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
- USA: "నువ్వు ముస్లింవా?" అని భారతీయుడిపై 15 సార్లు కత్తితో దాడి..
అర్చన తివారీ.. సివిల్ జడ్జి పదవికి సిద్ధపడుతోంది. ఆగస్టు 7న ఇండోర్ నుంచి కట్నికి వెళ్లడానికి బయల్దేరింది. ఆగస్టు 7న మధ్యాహ్నం 2:20 గంటలకు హాస్టల్ నుంచి అర్చన తివారీ ఇండోర్ రైల్వేస్టేషన్కు బయల్దేరింది. సాయంత్రం 4:10 గంటలకు ఇండోర్-బిలాస్పూర్ నర్మదా ఎక్స్ప్రెస్(18233) ఎక్కింది. ఏసీ కోచ్ బీ-3 సీటు దగ్గర కూర్చుంది. ఇది తలుపు దగ్గర ఉంది. రైలు భోపాల్ సమీపంలోకి వచ్చినప్పుడు అర్చన తివారీ తన తల్లితో ఫోన్లో సంభాషించింది. అప్పుడు రాత్రి 10:16 గంటలు అయింది. ఇక ఆగస్టు 8న నర్మదా ఎక్స్ప్రెస్ ఉదయం 6:50 గంటలకు కాట్నీ సౌత్ రైల్వే స్టేషన్కు చేరుకుంది. కానీ అర్చన మాత్రం స్టేషన్లో దిగలేదు. సీటుపై మాత్రం ఆమె బ్యాగ్ ప్రత్యక్షమైంది. దీంతో కుటుంబ సభ్యులు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రైల్వే పోలీసులు.. స్థానిక పోలీసులకు సమాచారం చేరవేశారు. దీంతో మూడు బృందాలు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టాయి.
భోపాల్-నర్మదాపురం ఏం జరిగింది
నర్మదా ఎక్స్ప్రెస్ రాత్రి 10:05 గంటలకు భోపాల్ నుంచి బయల్దేరింది. రాత్రి 11:26 గంటలకు నర్మదాపురం చేరుకుంటుంది. భోపాల్ నుంచి నర్మదాపురం చేరుకోవడానికి గంట 21 నిమిషాలు పడుతుంది. ఈ గంట 21 నిమిషాల్లో ఏం జరిగింది అనేది సస్పెన్ష్గా మారింది. అయితే రైలు మిడ్ఘాట్లోని దట్టమైన అడవి గుండా రైలు వెళ్తుంది. చాలాసార్లు పులులు నిద్రమత్తులో ఉన్న ప్రయాణికులపై దాడి చేసిన సందర్భాలున్నాయి. అర్చన సీటు కూడా తలుపు దగ్గరే ఉంది. వాష్రూమ్కు వెళ్లే సమయంలో ఏమైనా పులి ఏదైనా దాడి చేసిందా? అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Trump: పుతిన్-జెలెన్స్కీ భేటీపై ట్రంప్ కీలక ప్రకటన
ఇక నర్మదాపురం వరకు అర్చన ఫోన్ సిగ్నల్ వచ్చింది. ఒకవేళ నదిలో గానీ పడి ఉండొచ్చేమోనని నదిలో కూడా గజ ఈతగాళ్లతో కూడా గాలిస్తున్నారు. లేదంటే ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారా? అనే సందేహం వ్యక్తం అవుతోంది. ఒకవేళ కిడ్నాప్ చేస్తే.. తోటి ప్రయాణికులు అప్రమత్తం అవుతారు. ఇంకొక విషయం ఏంటంటే ఆరోజు రైలు భక్తులతో కిటకిటలాడుతూ ఉంది. కనుక అలాంటిది జరిగి ఉండదేమోనని భావిస్తున్నారు. ఇంకా లేదంటే ఏదైనా ప్రేమ వ్యవహారం కారణంగా తల్లిదండ్రులకు తెలియకుండా అదృశ్యమైందా? అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే అర్చన ఫోన్ సమాచారాన్ని సేకరించగా.. ఏ అబ్బాయితోనూ ఎక్కువగా మాట్లాడిన దాఖలాలు కూడా కనిపించలేదు.
ప్రస్తుతం ఇండోర్ నుంచి కాట్నీ రైల్వే స్టేషన్ వరకు ఉన్న సీసీ కెమెరాలను పోలీసులు జల్లెడ పడుతున్నారు. అయితే అర్చన బ్యాగ్ మాత్రం సీటు దగ్గరే కనుగొన్నారు. ఇక హాస్టల్లో ఎవరితోనో ఎక్కువగా మాట్లాడినట్లు సీసీటీవీ ఫుటేజ్లో కనిపించింది. ప్రస్తుతం ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సహచరులను, హాస్టల్ నిర్వాహకులను ప్రశ్నిస్తున్నారు. మరోవైపు బంధువుల్లో ఆందోళన ఎక్కువ అయిపోతుంది. అర్చనకు ఏమైనా జరిగిందా? అనే ఆందోళన మొదలైంది.
తాజావార్తలు
-
IRCTC Beta Website 2026: ఐఆర్ సీటీసీ కొత్త వెబ్సైట్ వచ్చేసింది.. కొత్త బీటా వెబ్సైట్లో ఏమేం మారాయంటే?
-
Lionel Messi: 39 ఏళ్ల మెస్సీ.. మరో చరిత్రకు అడుగు దూరంలో.. గోల్డెన్ బూట్ గెలుస్తాడా?
-
Lionel Messi:19ఏళ్ల క్రితం మెస్సీ చేతుల్లో పెరిగిన బుడతడు.. ఇప్పుడు ప్రపంచకప్ ఫైనల్లో అతడికే సవాల్ విసురుతున్న చిచ్చరపిడుగు!
-
Vrushakarma OTT Deal: థియేటర్లకు ముందే ‘వృషకర్మ’ సంచలనం.. నాగ చైతన్య కెరీర్లోనే అతిపెద్ద డీల్ ఇదేనా?
-
Argentina vs England 2026: ఇంగ్లాండ్పై అర్జెంటీనా సంచలన విజయం.. వరుసగా రెండోసారి ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లోకి
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!