MadyaPradesh: మధ్యప్రదేశ్లో వ్యాపం తరహా కుంభకోణం..!.. గ్రూప్-2 టాపర్లలో ఏడుగురు ఒకే పరీక్ష కేంద్రంలో రాశారు..
MadyaPradesh: మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని వ్యాపమ్ కుంభకోణం కుదిపేసిన సంగతి గుర్తుంది కదా. 10 ఏళ్ల క్రితం మధ్యప్రదేశ్ను వ్యాపమ్ కుంభకోణం కుదిపేసి.. చివరకు ప్రభుత్వ పతనానికి దారితీసిన విషయం తెలిసింది. ఇటీవల జరిగిన గ్రూప్-2, గ్రూప్-4 పరీక్షల్లో కూడా వ్యాపమ్ తరహాలోనే కుంభకోణం జరిగినట్టు విమర్శలు వస్తున్నాయి. గ్రూప్-2, గ్రూప్-4 ఫలితాలను రాష్ర్ట ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ఈ ఫలితాల్లో టాప్-10లో ఒకే పరీక్షా కేంద్రంలో రాసిన అభ్యర్థులే ఉండటం ఇందుకు కారణంగా చూపుతున్నారు. పది సంవత్సరాల క్రితం మధ్యప్రదేశ్ను కుదిపేసిన ‘వ్యాపమ్’ తరహా కుంభకోణం మళ్లీ జరిగినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల జరిగిన ఓ నియామక పరీక్షలో టాపర్లుగా నిలిచిన వారిలో ఏడుగురు ఒకే కేంద్రంలో పరీక్ష రాయడం అనుమానాలకు తావిస్తోంది. అది స్థానిక భాజపా ఎమ్మెల్యేకు చెందిన కళాశాల కావడంతో మరింత వివాదాస్పదమైంది.
Read also: Himachal Pradesh: వణికిస్తున్న భారీ వర్షాలు.. వ్యర్థాలతో పూర్తిగా నిండిన బ్రిడ్జ్..
Also Read
- Rs 397 Crore Transformer Scam: ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలులో రూ.397 కోట్ల స్కామ్.. సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశాలు..
- JMI VC Mazhar Asif: "భారతీయులందరిది మహాదేవుడి డిఎన్ఏ!".. ముస్లిం వైస్ ఛాన్సలర్ ఆసిఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- PM Modi: ప్రధాని మోడీ వారణాసి పర్యటన.. కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రత్యేక పూజలు
- West Bengal Assembly Elections 2026: బెంగాల్ 2వ దశ పోలింగ్లో EVM గందరగోళం.. హౌరాలో హింసాత్మక ఘటనలు
మధ్యప్రదేశ్లో గ్రూప్-2, గ్రూప్-4 పట్వారీ పరీక్ష ఫలితాలను గత నెల జూన్ 30న విడుదల చేశారు. ఆ తర్వాత మూడు రోజులకు టాపర్లుగా నిలిచిన 10 మంది జాబితాను విడుదల చేశారు. వారిలో ఏడుగురు గ్వాలియర్లోని ఎన్ఆర్ఐ కాలేజీలో ఈ పరీక్ష రాసినట్లు సమాచారం. టాపర్లుగా నిలిచిన వారి రోల్ నంబర్లు 2488 7991 నుంచి 2488 9693 మధ్యే ఉన్నాయి. అంటే ఒకే చోట పరీక్ష రాసిన దాదాపు 1,700 మంది అభ్యర్థుల్లో ఏడుగురు టాప్ 10 జాబితాలో నిలిచారు. వీరు జవాబు పత్రంలో హిందీలో సంతకం చేసి.. పరీక్ష మాత్రం ఆంగ్లంలో రాసినట్లు తెలిసిందని పలు మీడియా కథనాలు వెల్లడించాయి. దీంతో ఈ పరీక్ష నిర్వహణపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరీక్ష నిర్వహించిన సంస్థను కేంద్ర ప్రభుత్వం గతంలోనే బ్లాక్లిస్ట్ చేసినందనీ, అయినప్పటికీ మధ్యప్రదేశ్ ఎంప్లాయిస్ సెలెక్షన్ బోర్డు.. పరీక్ష నిర్వహణ కోసం ఆ సంస్థకే టెండర్ అప్పగించినట్లు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. మరోవైపు టాపర్లు రాసిన పరీక్షా కేంద్రం భాజపా ఎమ్మెల్యే సంజీవ్ కుశ్వాహాకు చెందినదిగా తెలుస్తోంది. దీంతో ఇది రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. భాజపా హయాంలో మరోసారి వ్యాపమ్ కుంభకోణం జరిగిందని ప్రతిపక్ష కాంగ్రెస్ ఆరోపించింది. 2013లో భాజపా హయాంలో చోటుచేసుకున్న వ్యాపమ్ కుంభకోణం సంచలనం సృష్టించింది. ఈ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించిన పలు నియామక పరీక్షల్లో రాజకీయ నాయకులు, అధికారులు డబ్బు కోసం అక్రమాలకు పాల్పడ్డారని బయటపడింది. వ్యాపమ్ కుంభ కోణం రాష్ట్ర రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేసిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Ramya Krishna : రేపు పెళ్లి అనంగా.. రాత్రి 2 వరకు ఎన్టీఆర్ తోనే ఉన్న..!
-
Donald Trump: ట్రంప్ను రోస్ట్ చేసిన కింగ్ చార్లెస్.. మేము లేకపోతే మీరు ఫ్రెంచ్ మాట్లాడేవారంటూ ఎగతాళి
-
KTR: కేసీఆర్ అప్పుడే చిలుకకు చెప్పినట్టు చెప్పారు.. కల్వకుర్తి సభను గుర్తు చేసిన కేటీఆర్..
-
Uttam Kumar Reddy: ప్రాణహిత-చేవెళ్లపై వెనక్కి తగ్గేదే లేదు! తుమ్మిడిహట్టి ప్రతిపాదనలపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన
-
Malla Reddy: పార్టీ మార్పుపై మాజీ మంత్రి మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో