రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్పర్సన్ నీతా అంబానీ, భర్త ముఖేష్ అంబానీ ఇంట వివాహ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాధిక మర్చంట్తో కుమారుడు అనంత్ అంబానీ వివాహానికి ముందు బుధవారం మామెరు వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వధూవరులతో పాటు ఇరువైపుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Nepal: కూలిన నేపాల్ ప్రభుత్వం.. మిత్రపక్షాలు మద్దతు ఉపసంహరణ
ఇక మంగళవారం 50 పేద జంటలకు ముఖేష్ అంబానీ కుటుంబం వివాహాలు జరిపించారు. విలువైన వస్తువులు బహుమతులుగా ఇచ్చి ఘనంగా జరిపించారు. ఇక జూలై 12న అనంత్-రాధిక వివాహం జరగనుంది. ముంబైలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముఖ్య అతిథులంతా హాజరుకానున్నారు. ఇక మార్చి 1-3 వరకు గుజరాత్లో ప్రీ వెడ్డింగ్ వేడుకలు నిర్వహించారు.
ఇది కూడా చదవండి: Pimples On Face : ముఖంపై పదే పదే మొటిమలు ఇబ్బంది పెడుతున్నాయా.. ఐతే ఇలా చేయాల్సిందే..
#WATCH | Mumbai: Founder and Chairperson of Reliance Foundation Nita Ambani and husband Mukesh Ambani take part in the Mameru Ceremony ahead of the wedding of their son Anant Ambani with Radhika Merchant. pic.twitter.com/rSb3elHDOv
— ANI (@ANI) July 3, 2024