అనంత్ అంబానీ 31వ పుట్టిన రోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై సందడి చేశారు. ఇక బర్త్డే సెలబ్రేషన్స్లో సినీ కళాకారులు డ్యాన్స్లతో అదరగొట్టారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా కృష్ణ భజనకు భార్య గౌరీతో కలిసి షారూఖ్ ఖాన్ డ్యాన్స్ చేశారు. అలాగే వదిన ఇషాతో కలిసి రాధిక మర్చంట్ గర్బా నృత్యం చేశారు. ఆద్యంతం సందడి సందడిగా బర్త్డే వేడుకలు జరిగాయి. ఇక గాయకులు ఆలపించిన భక్తి గీతాలు అలరించాయి. రణవీర్ సింగ్, షారుఖ్ ఖాన్, జాన్వీ కపూర్, అనన్య పాండే, ఇతర సినీ తారలు హాజరయ్యారు. ప్రతిఒక్కరూ భక్తిలో లీనమైనట్లు కనిపించారు. పార్టీకి హాజరైన అతిథులందరూ సాంప్రదాయ దుస్తులలో కనిపించారు.
ఇక నీతా అంబానీ అయితే చాలా ఉల్లాసంగా.. ఉత్సాహంగా కనిపించారు. మురిసిపోతూ డ్యాన్స్ చేశారు. ముఖంలో ఆనందం స్పష్టంగా కనిపించింది. జాన్వీ కపూర్, అనన్య పాండే కూడా అంబానీ కుటుంబంతో కలిసి గర్బా నృత్యం చేశారు. రాధిక, ఇషా కిక్లీ ఆడారు. కైలాష్ ఖేర్ తన శివ గీతాలతో పుట్టినరోజు వేడుకను ఉర్రూతలూగించారు. మైథిలీ ఠాకూర్, హన్స్రాజ్ రఘువంశీ కూడా భక్తి గీతాలు ఆలపించి అందరినీ మంత్రముగ్ధులను చేశారు.