Amit Shah: మహ్మద్ అలీ జిన్నా గ్రేట్.. అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యలపై అమిత్ షా ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: గతంలో సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా విమర్శలు గుప్పించారు. పాకిస్తాన్ వ్యవస్థాపకుడు మహ్మద్ అలీ జిన్నా ‘గ్రేట్’ అంటూ గతంలో అఖిలేష్ వ్యాఖ్యానించిన విషయాన్ని షా గుర్తు చేశారు. హర్దోయ్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో షా మాట్లాడుతూ.. 2021లో సర్దా్ర్ వల్లభబాయ్ పటేల్ విగ్రహావిష్కరణ సందర్భంగా యూపీ మాజీ సీఎం జిన్నా గొప్ప నాయకుడంటూ చెప్పారని అన్నారు.
‘‘ అఖిలేష్ యాదవ్ చరిత్ర తెలుసుకోవాలి. ఎందుకంటే భారత దేశ విభజనకు కారణం జిన్నా. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమే అఖిలేష్ ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారు. అలాంటి వారికి ఓటేయాలా..?’’ అని అమిత్ షా ప్రశ్నించారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్రతీ వేసవిలో విశ్రాంతి తీసుకునేందుకు విదేశాలకు వెళ్తున్నారని మండిపడ్డారు. ఎండలు పెరిగినప్పుడు రాహుల్ బాబా థాయ్లాండ్ వెళ్తారు, కానీ ప్రధాని మోడీ 23 ఏళ్లుగా విరామం తీసుకోలేదని చెప్పారు.
Also Read
- Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
- VB-G RAM G Scheme: వీబీ-జీ రామ్ జీ పథకం.. తొలి నెలలోనే 50% తగ్గిన గ్రామీణ ఉపాధి..!
- Maggi Noodles Case: మ్యాగీ లీడ్ వివాదానికి మరో ట్విస్ట్.. కేసులు కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు
Read Also: PM Modi: శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై ప్రధాని ఫైర్.. డీఎంకేకి కాంగ్రెస్తో పొత్తు తెంచుకునే దమ్ముందా..?
ఇండియా కూటమి మొత్తం అవినీతి విలువ రూ. 12లక్షల కోట్లని, 23 ఏళ్లుగా ఏ చిన్న అవినీతి కూడా ప్రధాని మోడీ చేయలేదని చెప్పారు. జార్ఖండ్ మంత్రి వ్యక్తిగత కార్యదర్శి తన ఇంట్లో రూ. 30 కోట్లు, ఒక కాంగ్రెస్ నేత ఇంట్లో రూ. 350 కోట్లు, మమతా బెనర్జీ ప్రభుత్వంలో మాజీ మంత్రి వద్ద రూ. 50 కోట్లు పట్టుబడ్డాయని అమిత్ షా చెప్పారు. రాహుల్ బాబా అమేథీ నుంచి వయనాడ్, వయనాడ్ నుంచి రాయ్బరేలీ వచ్చారు, రాయ్బరేలీ నుంచి నేరుగా ఇటలీ వెళ్తారని ఎద్దేవా చేశారు. లోక్సభ మొదటి మూడు దశల్లోనే ఎన్డీయే కూటమి 190 సీట్లను అధిగమించిందని అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎస్పీలు పూర్తిగా తుడిచిపెట్టుకుపపోతాయని అన్నారు. రాహుల్ గాంధీ పాకిస్తాన్ ఎజెండాను మరింతగా ముందుకు తీసుకెళ్తున్నారని, అందుకే పొరుగు దేశం అతడిని ప్రశంసిస్తుందని ఆరోపించారు.
తాజావార్తలు
-
Tobacco Farmers: పొగాకు రైతులకు సర్కార్ గుడ్న్యూస్.. క్వింటాల్కు రూ.1,000 ప్రోత్సాహకం, వడ్డీలేని రుణాలు
-
KTM RC 160 Price Hiked: KTM RC 160 ధర పెంపు.. ఇప్పుడు ఎంతంటే? కొత్త ధర, ఇంజిన్, ఫీచర్ల పూర్తి వివరాలు
-
Lopamudra Raut Theft Case: బిగ్బాస్ ఫేమ్ ఇంట్లో భారీ చోరీ.. నిందితుడి అరెస్ట్, రూ.76 లక్షల సొత్తు స్వాధీనం!
-
Tollywood : ఇండస్ట్రీ సంక్షోభానికి కారణం స్టార్ హీరోలేనా? సింగిల్ స్క్రీన్లు మూతపడటానికి బాధ్యులెవరు?
-
AP PPP Policy 2026కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. కీలక ఉత్తర్వులు జారీ
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!