Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- దేశీయ రవాణాలో కొత్త విప్లవం..
- ‘జీరో కమిషన్’తో ‘భారత్ టాక్సీ’ ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bharat Taxi Launch: దేశీయ రవాణా రంగంలో సరికొత్త సహకార విప్లవానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దేశంలోనే మొట్టమొదటి కో-ఆపరేటివ్ మోడల్ డ్రైవర్-ఓనర్షిప్ రైడ్-హెయిలింగ్ సర్వీస్ ‘భారత్ టాక్సీ’ (Bharat Taxi) సేవలను కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షా శనివారం గుజరాత్లో అధికారికంగా ప్రారంభించారు. తొలి విడతగా గుజరాత్లోని 14 నగరాల్లో ఈ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే రెండేళ్లలో ఈ సేవలను దేశవ్యాప్తంగా 500 కంటే ఎక్కువ నగరాలకు విస్తరించనున్నట్లు సంచలన ప్రకటన చేశారు.
ఓలా, ఉబర్లకు చెక్.. డ్రైవర్లే యజమానులు
అమిత్ షా మాట్లాడుతూ.. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ప్రైవేట్ క్యాబ్ అగ్రిగేటర్ కంపెనీలకు ప్రత్యామ్నాయంగా, డ్రైవర్ల సంక్షేమమే ధ్యేయంగా ఈ ‘భారత్ టాక్సీ’ ప్లాట్ఫారమ్ను తీసుకొచ్చినట్లు తెలిపారు. ఈ యాప్ యొక్క అతిపెద్ద ప్రత్యేకత ‘జీరో కమిషన్ మోడల్’ అని చెప్పారు. ఇందులో డ్రైవర్లు కంపెనీకి ఎలాంటి కమిషన్ కట్టాల్సిన అవసరం లేదని, ప్రయాణికుల నుంచి వచ్చే పూర్తి కిరాయి మొత్తం నేరుగా డ్రైవర్లకే దక్కుతుందన్నారు. ఈ వ్యవస్థలో డ్రైవర్లు కేవలం పని వాళ్లు మాత్రమే కాదని, ఈ ప్లాట్ఫారమ్కు సహ-యజమానులు అని, వారిని కేంద్ర ప్రభుత్వం ‘సారథులు’ అని పిలుస్తుందని అమిత్ షా పేర్కొన్నారు.
Also Read
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
- Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
- Mumbai Muharram Plot: మొహర్రం ఊరేగింపులో విషపూరిత క్యాప్సూల్స్ పంపిణీ! రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న పోలీసులు..
రాబోయే 2 ఏళ్లలో 500 నగరాలకు విస్తరణ
గుజరాత్ తర్వాత ఈ ప్రాజెక్ట్ను దేశవ్యాప్తంగా విస్తరించడానికి కేంద్రం భారీ స్కెచ్ వేసింది. రాబోయే రెండేళ్లలో ముంబై, పూణే, నాగపూర్, లక్నో, చండీగఢ్, జైపూర్, కోల్కతా వంటి దేశంలోని ప్రధాన నగరాలతో పాటు 500కు పైగా నగరాలను ఈ నెట్వర్క్తో అనుసంధానించనున్నామని చెప్పారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 7 లక్షల మందికి పైగా డ్రైవర్లు కేవలం 100 రూపాయల షేర్ కొనుగోలు చేసి ఈ భారత్ టాక్సీలో భాగస్వాములుగా మారడం విశేషం. ఈ సహకార నమూనా ద్వారా అటు ప్రయాణికులకు సురక్షితమైన, సరసమైన ధరలకే ప్రయాణ సౌకర్యం లభించడంతో పాటు, ఇటు డ్రైవర్లకు గౌరవం, ఆర్థిక భద్రత చేకూరుతుందని అమిత్ షా ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఈ ప్లాట్ఫారమ్తో అనుసంధానమైన డైవర్లకు తమ వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం తరపున తక్కువ వడ్డీకే రుణాలు, ఉచిత బీమా రక్షణ, ప్రత్యేక ఆర్థిక సహాయం అందించనున్నట్లు హోంమంత్రి స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
-
Ganja Smuggling : శంషాబాద్లో అంతర్రాష్ట్ర గంజాయి రాకెట్ గుట్టురట్టు..
-
PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
-
NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
-
Jackky Bhagnani: హీరోయిన్ రకుల్తో పెళ్లై ఏడాది కూడా కాకముందే డేటింగ్ యాప్లో జాకీ భగ్నానీ? వైరల్ అవుతున్న లీక్స్!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!