Amit Shah: బాబ్రీ మసీదు వాళ్లతో కలవడం కన్నా, 20 ఏళ్లు ప్రతిపక్షంలోనే ఉంటాం
- బెంగాల్ ఎన్నికల్లో సంచలనంగా హుమాయున్ కబీర్ వీడియో..
- బీజేపీతో డీల్ ఉందని చెబుతున్న వీడియోపై ప్రకంపనలు..
- బాబ్రీ మసీదు వాళ్లతో కలిసేది లేదని చెప్పిన అమిత్ షా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు ముందు కీలక మైనారిటీ నేత హుమాయున్ కబీర్ వ్యవహారం సంచలనంగా మారింది. ఆయనపై జరిగిన స్టింగ్ ఆపరేషన్ ఇప్పుడు రాజకీయాలకు కేంద్రంగా మారింది. బీజేపీ-హుమాయున్ కబీర్ మధ్య రూ. 1000 కోట్ల డీల్ జరిగిందని ఓ వీడియోలో హుమాయున్ కబీర్ చెబుతున్నట్లు కనిపించడంతో వివాదం ముదిరింది. బెంగాల్ మాల్దాలో బాబ్రీ మసీదు నిర్మిస్తూ వార్తల్లో నిలిచిన కబీర్ ఇప్పుడు ఈ వీడియోతో వార్తల్లో వ్యక్తిగా నిలిచారు.
Read Also: Shocking: మేకప్ సామాగ్రి తక్కువైందని పెళ్లి క్యాన్సిల్…
Also Read
- UAPA Terrorists List: మరో కఠిన నిర్ణయం.. 23 మంది పేర్లను ఉగ్రవాదుల జాబితాలో చేర్చిన కేంద్రం
- Agra Husband M*urder Case: ఇక మీరు మారరా.. పాయసంలో నిద్ర మాత్రలు కలిపి భర్తను చంపి.. బాత్రూమ్లో పాతిపెట్టిన భార్య..
- Lalu Prasad Yadav: బీహార్ ప్రభుత్వం యూటర్న్.. లాలూ ప్రసాద్, రబ్రీ దేవికి మళ్లీ Z కేటగిరీ భద్రత..
- Centre Orders Google, Apple: ప్రయాణికుల భద్రతకు ముప్పు.. గూగుల్, యాపిల్కు కేంద్రం కీలక ఆదేశాలు
అయితే, ఈ వ్యవహారంతో స్పందించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. ‘‘బాబ్రీ మసీదు నిర్మించే వారితో కలిసి పనిచేయడం కన్నా, మరో 20 ఏళ్లు మేము ప్రతిపక్షంలో ఉండటానికి సిద్ధం’’ అని ప్రకటించారు. ఇప్పుడు హుమాయున్ కబీర్ వీడియో వైరల్ అవుతోంది. దీనిపై విచారణ జరిపించాలని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది. ఈ వీడియోలో తాను బీజేపీ నాయకులతో ఒప్పందం చేసుకున్నట్లు కబీర్ చెబుతున్నట్లు ఉంది. అయితే, ఇది ఏఐతో చేసిన వీడియో అని కబీర్ ఆరోపించారు. తనను అప్రతిష్టపాలు చేయడానికి టీఎంసీ ఇలాంటి పనులు చేస్తోందని ఆరోపించారు. ముస్లిం ఓట్లు కోల్పోతామనే భయంతో టీఎంసీ తనపై ఇలాంటి ప్రచారాన్ని చేస్తుందని కబీర్ అన్నారు. దీనిపై పరువు నష్టం కేసు పెడతానని బెదిరించారు.
ఈ వీడియోను బీజేపీ ఖండించింది. హుమాయున్ కబీర్, బీజేపీలు ఉత్తర-దక్షిణ ధ్రువాల లాంటివని ఇవి ఎప్పటికీ కలవవని అమిత్ షా అన్నారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇలాంటివి 2000 వీడియోలను క్రియేట్ చేయగలదని ఆయన ఆరోపించారు. దీనికి ముందు మాజీ బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు దిలీప్ ఘోష్ మాట్లాడుతూ.. కబీర్ రూ. 1000 కోట్లు కాదు కదా, రూ. 100 కోట్లకు కూడా అర్హత లేని వ్యక్తి అని ఎద్దేవా చేశారు.
తాజావార్తలు
-
UAPA Terrorists List: మరో కఠిన నిర్ణయం.. 23 మంది పేర్లను ఉగ్రవాదుల జాబితాలో చేర్చిన కేంద్రం
-
Jr NTR-Akhil: ‘లెనిన్’ కోసం రంగంలోకి ఎన్టీఆర్?.. అక్కినేని అఖిల్కు బూస్ట్ ఇచ్చే స్పెషల్ ప్లాన్!
-
Agra Husband M*urder Case: ఇక మీరు మారరా.. పాయసంలో నిద్ర మాత్రలు కలిపి భర్తను చంపి.. బాత్రూమ్లో పాతిపెట్టిన భార్య..
-
RBI: విదేశీ మారక, బంగారు నిల్వలు భారీ పతనం.. ఆర్బీఐ తాజా గణాంకాలు
-
Netflix: పరిచయాలు అవసరం లేదు.. మంచి కథ ఉంటే నెట్ఫ్లిక్స్లో గోల్డెన్ ఛాన్స్
ట్రెండింగ్
-
Thailand: 11 ఏళ్ల బాలుడి ర్యాష్ డ్రైవింగ్.. 9 మంది సన్యాసుల ప్రాణాలు బలి.! వీడియో వైరల్..
-
Smartphones in Budget: రూ. 15,000 లోపు భారీ బ్యాటరీ లైఫ్ బెస్ట్ 5G స్మార్ట్ఫోన్లు ఇవే.. రెండు రోజుల బ్యాకప్ గ్యారెంటీ!
-
EV కారు కొనాలనుకుంటున్నారా? Hyundai Creta ఎలక్ట్రిక్ కు కొత్త BaaS ప్లాన్.. రూ.7 లక్షల వరకు తగ్గింపు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ అరంగేట్రంపై విమర్శలు.. మా ఇష్టం అంటూ మాజీలకు గట్టిగా ఇచ్చిపడేసిన బీసీసీఐ!
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో