Amit shah: కేంద్రం కీలక నిర్ణయం.. జనాభా మార్పులపై ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు
- కేంద్రం సంచలన నిర్ణయం
- జనాభా మార్పులపై ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు
- రాజకీయ దుమారం చెలరేగే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో అక్రమ వలసలు, అసాధారణ జనాభా మార్పులపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జనాభా మార్పులను పర్యవేక్షించేందుకు కేంద్రం ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం ప్రకటించారు. అక్రమ చొరబాట్లు, ఇతర కారణాల వల్ల జరుగుతున్న అసహజ జనాభా మార్పులు కారణంగా దేశ సార్వభౌమత్వం, జాతీయ భద్రత, సామాజిక సమతుల్యత, గిరిజన సమాజాల రక్షణకు పెద్ద సవాలుగా మారాయని పేర్కొన్నారు.
ఈ కమిటీ ఏర్పాటుకు ప్రధాని నరేంద్ర మోడీ 2025 ఆగస్టు 15న చేసిన ప్రకటన ఆధారమని అమిత్ షా తెలిపారు. దేశవ్యాప్తంగా జనాభా మార్పుల ధోరణులను అధ్యయనం చేసి.. ముఖ్యంగా అక్రమ వలసలు, ఇతర అసాధారణ కారణాల వల్ల సంభవిస్తున్న మార్పులను విశ్లేషించడం కమిటీ ప్రధాన బాధ్యతగా వివరించారు.
Also Read
- Bullet Train: బుల్లెట్ ట్రైన్ ఆలస్యానికి భారతే కారణం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలు..
- Citizenship: భూమి పత్రాలు పౌరసత్వానికి ఆధారం కాదు: కలకత్తా హైకోర్టు..
- Sonam Wangchuk: సోనం వాంగ్చుక్ దీక్షలో నవ్వులు.. పువ్వులు.. ఏం జరిగిందంటే..!
- Pakistan: పాక్లో 5వ రాష్ట్రంగా గిల్గిట్-బాల్టిస్తాన్.. భారత్ను కవ్వించే చర్య..
ఈ ఉన్నతస్థాయి కమిటీకి రిటైర్డ్ జస్టిస్ ప్రకాశ్ ప్రభాకర్ నౌలేకర్ ఛైర్మన్గా వ్యవహరించనున్నారు. మాజీ ఐఏఎస్ అధికారి దుర్గా శంకర్ మిశ్రా, మాజీ ఐపీఎస్ అధికారి బాలాజీ శ్రీవాస్తవ, ఆర్థికవేత్త డాక్టర్ శామికా రవి సభ్యులుగా ఉండనున్నారు. అలాగే జనగణన కమిషనర్ కూడా కమిటీలో సభ్యుడిగా ఉంటారు. కేంద్ర హోంశాఖలోని ఫారినర్స్-I విభాగ జాయింట్ సెక్రటరీ సభ్య కార్యదర్శిగా వ్యవహరించనున్నారు.
దేశంలోని మత, సామాజిక వర్గాల వారీగా అసాధారణ జనాభా పెరుగుదల నమూనాలను కమిటీ సమగ్రంగా పరిశీలించనుంది. అలాగే సమస్య పరిష్కారానికి సమయపాలిత కార్యాచరణ ప్రణాళికను రూపొందించి కేంద్రానికి సిఫార్సులు చేయనుంది. “జనాభా మార్పు అనేది కేవలం సార్వభౌమత్వానికి సంబంధించిన అంశమే కాదు. ఇది జాతీయ భద్రత, శాంతిభద్రతలు, సామాజిక నిర్మాణం, గిరిజన సమాజాల పరిరక్షణకు కూడా నేరుగా సంబంధించిన విషయం” అని అమిత్ షా పేర్కొన్నారు.
అయితే కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా రాజకీయ చర్చలకు దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సరిహద్దు రాష్ట్రాల్లో అక్రమ వలసలు, జనాభా మార్పుల అంశం ఎప్పటికప్పుడు రాజకీయంగా వివాదాస్పదంగా మారుతోంది. ఏం జరుగుతుందో చూడాలి. ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి.
తాజావార్తలు
-
Pallaburusu: టూత్బ్రష్తో జిల్లా కోర్టులో లీగల్ ఫైట్?
-
Bullet Train: బుల్లెట్ ట్రైన్ ఆలస్యానికి భారతే కారణం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలు..
-
Trump: భారత్ విద్యార్థులకు బిగ్ షాక్.. ట్రంప్ కొత్త స్టూడెంట్ వీసా నిబంధనలివే!
-
6500mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే , 90W ఛార్జింగ్.. ఐఫోన్ 17 ప్రో మాక్స్ లా కనిపించే ఫోన్..
-
ENG Vs IND, 3rd ODI : టీమిండియాకు మరో బిగ్ షాక్.. మూడో వన్డేకు స్టార్ ప్లేయర్ దూరం..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?