2014 నుంచి 2026 వరకు దేశ అంతర్గత భద్రతకు స్వర్ణయుగంగా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఢిల్లీ పోలీసులు 79వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ కార్యక్రమానికి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ‘‘2014కి ముందు 3-4 దశాబ్దాలుగా మూడు సమస్యలు మన అంతర్గత భద్రతకు తీవ్రమైన సవాలుగా నిలిచాయి. కాశ్మీర్ ప్రాంతం, మొత్తం ఈశాన్య ప్రాంతం. పదకొండు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు. అయితే ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్, ఈశాన్య, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో హింసను 80 శాతం తగ్గించడంలో మేము విజయం సాధించామని మీకు తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. 2026 మార్చి 31 నాటికి మొత్తం దేశాన్ని మావోయిస్టు హింస నుంచి విముక్తి చేయడంలో విజయం సాధిస్తామని నేను దేశ ప్రజలకు భరోసా ఇవ్వాలనుకుంటున్నాను..’’ అని అమిత్ అన్నారు.
ఈ సందర్భంగా పోలీసులు కవాతును నిర్వహించారు. ఢిల్లీ పోలీసుల అత్యుత్తమ మార్చింగ్ బృందం, SWAT బృందం, డాగ్ స్క్వాడ్, బ్యాండ్ బృందం, మోటార్ సైకిల్ రైడర్లు, PCR యూనిట్లు, అనేక ఇతర ప్రత్యేక బృందాలు సమన్వయంతో కూడిన మార్చ్ పాస్ట్ను ప్రదర్శించాయి. ఈ కార్యక్రమాన్ని అమిత్ షా వీక్షించారు.
#WATCH | Delhi: Union Home Minister Amit Shah says, "From 2014 to 2026 will forever be marked in our history as a golden period for the country's internal security. Before 2014, three problems had posed a serious challenge to our internal security for 3-4 decades: the Kashmir… pic.twitter.com/4DtVgE3BWe
— ANI (@ANI) February 16, 2026
