Kolkata Doctor Case: ‘‘ ఒక్కరు కాదు, నలుగురు నిందితులు’’.. ట్రైనీ డాక్టర్ తండ్రి సంచలన ఆరోపణ..
- కోల్కతా వైద్యురాలి కేసులో దోషిగా తేలిన సంజయ్ రాయ్..
- ఈ కేసులో మరికొందరు ఉన్నారంటూ డాక్టర్ తండ్రి ఆరోపణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kolkata Doctor Case: కోల్కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్పై అత్యాచారం, హత్య కేసులో ఈ రోజు సీల్దా సెషన్స్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నిందితుడు సంజయ్రాయ్ని దోషిగా తేల్చింది. హత్య, అత్యాచారం సెక్షన్ల కింద నేరానికి పాల్పడినట్లు నిర్ధారించింది. సోమవారం ఈ శిక్షలను విధించనుంది. గతేడాది ఆగస్టులో మెడికల్ కాలేజీలో డ్యూటీలో ఉన్న సమయంలోనే వైద్యురాలిపై పాశవికంగా హత్యాచారం జరిగింది. ఈ కేసులో ఆస్పత్రిలో పోలీస్ వాలంటీర్గా పనిచేస్తున్న సంజయ్ రాయ్ని అరెస్ట్ చేశారు. కేసుని విచారించిన సీబీఐ ఇతడికి వ్యతిరేకంగా అనేక సాక్ష్యాలను కోర్టు ముందుంచింది. డీఎన్ఏ రిపోర్ట్, వెంట్రుకలు, నిందితుడి బ్లూటూత్ ఇలా పలు ఆధారాలు సంజయ్ రాయ్కి వ్యతిరేకంగా లభించాయి. అయితే, తీర్పు చెబుతున్న సమయంలో ‘‘ తాను ఈ నేరం చేయలేదని, తనను ఇరికిస్తున్నారు’’ అని సంజయ్ రాయ్ చెప్పాడు.
Read Also: Thaman : మీ మాటలు జీవితాంతం గుర్తు ఉంటాయి.. చిరు ట్వీట్కు తమన్ రిప్లై
Also Read
- DK Shivakumar: కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్.. నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రుల లిస్ట్ ఇదే.!
- DK Shivakumar: నేడు సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం.. దేవాలయాల్లో పూజలు, వీవీఐపీలకు ప్రత్యేక ఆహ్వానాలు!
- WMO Warning: ప్రమాదకర ఎల్నినో రాబోతుంది.. ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరిక
- RudraM-2: చైనా-పాక్ గుండెల్లో గుబులు.. రుద్రమ్-2 క్షిపణి పరీక్ష సక్సెస్..
ఇదిలా ఉంటే, ఈ కేసులో బాధితురాలి తండ్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో న్యాయం జరిగే వరకు తాము కోర్టు తలుపులు తడుతూనే ఉంటామని చెప్పారు. ‘‘ఇక్కరు మాత్రమే కాదు, డీఎన్ఏ నివేదికలో నలుగురు అబ్బాయిలు, ఒక అమ్మాయి ఉన్నట్లు చూపిస్తోంది. కేవలం సంజయ్ రాయ్ని మాత్రమే నిందితుడిగా చేర్చారు. నిందితులు అందరికి శిక్ష పడినప్పుడు మాత్రమే మాకు ఉపశమనం కలుగుతుంది. మాకు న్యాయం జరిగే వారకు కోర్టు తలుపులు తడుతూనే ఉంటాము. దేశ ప్రజలు మద్దతు మాకు ఉంది’’ అని వైద్యురాలి తండ్రి అన్నారు. తమ కూతురి గొంతుపై గాయాలు ఉన్నా, వాటి శాంపిళ్లను సేకరించలేదని ఆరోపించారు.
ఈ కేసులో సీబీఐపై కూడా ఆయన ఆరోపణలు చేశారు. ఈ విషయంలో సీబీఐ ఏమీ చేయలేదని అన్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టు ముందు మేము అనేక ప్రశ్నలు లేవనెత్తామని, కోర్టు నుంచి ఆధారాలు కోరామని, అయితే సీబీఐ తమకు ఎలాంటి సమాధానాలు ఇవ్వలేదని చెప్పారు. రెండు నెలలు కోర్టు అన్ని ఆధారాలను సమీక్షించిందని, ఏ శిక్ష వేయాలనేది కోర్టు నిర్ణయిస్తుందని ఆయన అన్నారు. తాము ప్రధాని, హోం మంత్రి, న్యాయ మంత్రికి లేఖలు రాసినప్పటికీ, తమకు ఎలాంటి స్పందన రాలేదని అన్నారు. ఈ రోజు కోర్టుకు తమని పిలువలేని, తమ లాయర్ని రావద్దని కోరినట్లు తెలిపారు.
తాజావార్తలు
-
Michael Movie OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న 7,000 కోట్ల మైఖేల్ జాక్సన్ బయోపిక్ .. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
ACB Raids: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు ఇంట్లో ఏసీబీ సోదాలు.!
-
Rohit-Hardik: ముందు బెంగళూరుకు రండి.. రోహిత్, హార్దిక్కు బీసీసీఐ అల్టిమేటం!
-
Gold Recycle: మీ ఇంట్లో పాత బంగారం ఉందా? ఈ ఒక్క ట్రిక్తో మన జీవితాలే మారిపోవచ్చు!
-
Train Safety Tips: ట్రైన్లో ఫ్రీ వైఫై వాడేవారికి బిగ్ షాక్.. ఈ తప్పు చేస్తే మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ!
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!