UPI: ఆగస్టు 15 నుంచి దేశవ్యాప్తంగా అన్ని పంచాయతీల్లో యూపీఐ సేవలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UPI: ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం నుంచి దేశవ్యాప్తంగా అన్ని పంచాయతీలు డిజిటల్ గా మారబోతున్నాయి. ఆగస్టు 15 నుంచి అన్ని పంచాయతీల్లో యూపీఐ సేవలు ప్రారంభించాలని పంచాయితీ రాజ్ మంత్రిత్వ శాఖ జారీ చేసిన లేఖలో పేర్కొంది. అన్ని అభివృద్ధి, ఆదాయ సేకరణ కోసం తప్పనిసరిగా డిజిటల్ చెల్లింపులను చేసేలా పంచాయతీల్లో యూపీఐ సేవలను ప్రారంభించాలని లేఖలో తెలిపింది. ముఖ్యమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వంటి ప్రముఖుల సమక్షంలో రాష్ట్రాలు పంచాయతీల్లో యూపీఐ సేవలన్ని ప్రారంభించాలని మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాకలు లేఖ రాసింది.
దేశంలో 98 శాతం పంచాయతీలు ఇప్పటికే యూపీఐ ఆధారిత చెల్లింపులను ఉపయోగించడం ప్రారంభించాయని పంపంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సునీల్ కుమార్ తెలిపారు. పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ (పిఎంఎఫ్ఎస్) ద్వారా దాదాపు రూ. 1.5 లక్షల కోట్ల విలువైన చెల్లింపులు జరిగాయి. ఇకపై పంచాయతీలకు డిజిటల్గా చెల్లింపులు జరగనున్నాయి. చెక్కులు మరియు నగదు చెల్లింపులు దాదాపు ఆగిపోయాయని ఆయన తెలిపారు.
Also Read
- Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
- NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
- Maharashtra: ఘోర విషాదం.. ఆలయ గోడ కూలి ఆరుగురు మృతి
- UP: భర్త కోసం టవరెక్కిన మహిళ.. గంట తర్వాత ఏం జరిగిందంటే..!
Read Also: Sejal Suside Attempt: జూబ్లీహిల్స్ పెద్దమ్మ టెంపుల్ వద్ద శేజల్ ఆత్మహత్యాయత్నం.. ఇది మూడోసారి
జూన్ 30న సర్వీస్ ప్రొవైడర్లు, వెండర్స్ తో సమావేశాలు నిర్వహించాలని పంచాయతీలను మంత్రిత్వశాఖ కోరింది. UPI ప్లాట్ఫారమ్లు జీపే, ఫోన్ పే, పేటీఎం, భీమ్, వాట్సాప్ పే, అమెజాన్ పే, భారత్ పేలకు సంబంధించివన సంబంధిత వ్యక్తుల వివరాలను మంత్రిత్వశాఖ షేర్ చేసింది. జూలై 15 నాటికి, మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం, పంచాయతీలు తగిన సర్వీస్ ప్రొవైడర్లను ఎన్నుకోవాలని, జూలై 30 లోపు వెండర్లని ఖరారు చేయాలని సూచించింది.
అధికారులకు జిల్లా, బ్లాక్ స్థాయిల్లో శిక్షణ శిబిరాలను నిర్వహించాలని సూచించింది. డిజిటల్ లావాదేవీలను ప్రారంభించడం వల్ల అవినీతిని అరికట్టవచ్చునని పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి కపిల్ మోరేశ్వర్ పాటిల్ అన్నారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, 2023 జనవరిలోనే BHIM ద్వారా రూ.12.98 లక్షల కోట్ల విలువైన 806.3 కోట్ల లావాదేవీలు జరిగాయి. డిజిటల్ లావాదేవీలలో గ్రామీణ, పెరి-అర్బన్ ప్రాంతాల సహకారం దాదాపు 50 శాతంగా ఉంది. పంచాయతీ రాజ్ సంస్థలు PFMS-eGram Swaraj ఇంటర్ఫేస్ ద్వారా డిజిటల్ చెల్లింపులు చేస్తున్నాయి. 90 శాతం పంచాయతీ రాజ్ సంస్థలు ఆన్ లైన్ ద్వారా ఆడిట్ చేయబడినట్లు మంత్వత్వ శాఖ తెలిపింది.
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!