UPI: ఆగస్టు 15 నుంచి దేశవ్యాప్తంగా అన్ని పంచాయతీల్లో యూపీఐ సేవలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UPI: ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం నుంచి దేశవ్యాప్తంగా అన్ని పంచాయతీలు డిజిటల్ గా మారబోతున్నాయి. ఆగస్టు 15 నుంచి అన్ని పంచాయతీల్లో యూపీఐ సేవలు ప్రారంభించాలని పంచాయితీ రాజ్ మంత్రిత్వ శాఖ జారీ చేసిన లేఖలో పేర్కొంది. అన్ని అభివృద్ధి, ఆదాయ సేకరణ కోసం తప్పనిసరిగా డిజిటల్ చెల్లింపులను చేసేలా పంచాయతీల్లో యూపీఐ సేవలను ప్రారంభించాలని లేఖలో తెలిపింది. ముఖ్యమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వంటి ప్రముఖుల సమక్షంలో రాష్ట్రాలు పంచాయతీల్లో యూపీఐ సేవలన్ని ప్రారంభించాలని మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాకలు లేఖ రాసింది.
దేశంలో 98 శాతం పంచాయతీలు ఇప్పటికే యూపీఐ ఆధారిత చెల్లింపులను ఉపయోగించడం ప్రారంభించాయని పంపంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సునీల్ కుమార్ తెలిపారు. పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ (పిఎంఎఫ్ఎస్) ద్వారా దాదాపు రూ. 1.5 లక్షల కోట్ల విలువైన చెల్లింపులు జరిగాయి. ఇకపై పంచాయతీలకు డిజిటల్గా చెల్లింపులు జరగనున్నాయి. చెక్కులు మరియు నగదు చెల్లింపులు దాదాపు ఆగిపోయాయని ఆయన తెలిపారు.
Also Read
- Nepal: నేపాల్ భారత భూభాగాలను ఆక్రమించుకుంది.. బాలెన్ షా సంచలన వ్యాఖ్యలు..
- Indian Railways: రేపటి నుంచి రైల్వే కొత్త రూల్స్.. వెయిటింగ్ టికెట్లు, అడ్వాన్స్ బుకింగ్లలో కీలక మార్పులు
- UP Encounter: సూర్య హత్య, అసద్ ఎన్కౌంటర్.. యోగి సర్కార్పై ఎస్పీ విమర్శలు..
- West Bengal: మమతకు భారీ షాక్.. 80 మందిలో 20 మంది ఎమ్మెల్యేలే హాజరు!
Read Also: Sejal Suside Attempt: జూబ్లీహిల్స్ పెద్దమ్మ టెంపుల్ వద్ద శేజల్ ఆత్మహత్యాయత్నం.. ఇది మూడోసారి
జూన్ 30న సర్వీస్ ప్రొవైడర్లు, వెండర్స్ తో సమావేశాలు నిర్వహించాలని పంచాయతీలను మంత్రిత్వశాఖ కోరింది. UPI ప్లాట్ఫారమ్లు జీపే, ఫోన్ పే, పేటీఎం, భీమ్, వాట్సాప్ పే, అమెజాన్ పే, భారత్ పేలకు సంబంధించివన సంబంధిత వ్యక్తుల వివరాలను మంత్రిత్వశాఖ షేర్ చేసింది. జూలై 15 నాటికి, మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం, పంచాయతీలు తగిన సర్వీస్ ప్రొవైడర్లను ఎన్నుకోవాలని, జూలై 30 లోపు వెండర్లని ఖరారు చేయాలని సూచించింది.
అధికారులకు జిల్లా, బ్లాక్ స్థాయిల్లో శిక్షణ శిబిరాలను నిర్వహించాలని సూచించింది. డిజిటల్ లావాదేవీలను ప్రారంభించడం వల్ల అవినీతిని అరికట్టవచ్చునని పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి కపిల్ మోరేశ్వర్ పాటిల్ అన్నారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, 2023 జనవరిలోనే BHIM ద్వారా రూ.12.98 లక్షల కోట్ల విలువైన 806.3 కోట్ల లావాదేవీలు జరిగాయి. డిజిటల్ లావాదేవీలలో గ్రామీణ, పెరి-అర్బన్ ప్రాంతాల సహకారం దాదాపు 50 శాతంగా ఉంది. పంచాయతీ రాజ్ సంస్థలు PFMS-eGram Swaraj ఇంటర్ఫేస్ ద్వారా డిజిటల్ చెల్లింపులు చేస్తున్నాయి. 90 శాతం పంచాయతీ రాజ్ సంస్థలు ఆన్ లైన్ ద్వారా ఆడిట్ చేయబడినట్లు మంత్వత్వ శాఖ తెలిపింది.
తాజావార్తలు
-
Gender Determination Racket : చిత్తూరు జిల్లాలో అక్రమ లింగ నిర్ధారణ రాకెట్ గుట్టురట్టు..
-
Kohli-Venkatesh Iyer: ఐపీఎల్ ఫైనల్లో మొదటిసారిగా.. అరుదైన రికార్డు సాధించిన కోహ్లీ, వెంకటేష్ అయ్యర్..
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Samsung Galaxy F70e 5G: సామ్ సంగ్ గెలాక్సీ F70e 5Gపై భారీ డిస్కౌంట్.. 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Nepal: నేపాల్ భారత భూభాగాలను ఆక్రమించుకుంది.. బాలెన్ షా సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!