All India Muslim Personal Law Board: ముస్లింలు టీవీ డిబేట్లలో పాల్గొన వద్దని కీలక ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓ టీవీ డిబెట్ లో పాల్గొంటూ బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలపై దేశంలో, విదేశాల్లో దుమారమే చెలరేగుతోంది. ఇప్పటికే ఖతార్, యూఏఈ, సౌదీ, మలేషియా, ఇరాక్ వంటి దేశాలు భారత్ కు తమ నిరసన తెలిపాయి. భారత విదేశాంగ శాఖ కూడా అంతే స్థాయిలో బదులిచ్చింది. ఇప్పటికే మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మతో పాటు నవీన్ జిందాల్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసిందని.. వ్యక్తులు చేసిన వ్యాఖ్యలను భారత ప్రభుత్వానికి ఆపాదించవద్దని హితవు పలికింది.
ఇదిలా ఉంటే ఈ వ్యాఖ్యలపై నుపుర్ శర్మను అరెస్ట్ చేయాలంటూ పెద్ద ఎత్తున శుక్రవారం రోజు ముస్లింలు ఆందోళన, నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలకు దిగారు. యూపీ, ఢిల్లీ, హైదరాబాద్, రాంచీ ఇలా పలు చోట్ల ఆందోళన నిర్వహించారు. యూపీలోని ప్రయాగ్ రాజ్ తో పాటు జార్ఖండ్ రాంచీలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి.
Also Read
ఈ వివాదం ఇలా ఉంటే ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇస్లాం, ముస్లింలను అపహాస్యం చేయడానికి ఉద్దేశించిన వార్తా చర్చలలో పాల్గొనవద్దని కోరింది. అటువంటి ప్రదర్శనల్లో పాల్గొనడం వల్ల ముస్లింలకు, ఇస్లాంకు ఏ విధంగా సేవ చేయకపోవడమే కాకుండా.. ముస్లింలు, ఇస్లాంలు లక్ష్యంగా చేసుకుంటున్నారని వ్యాఖ్యానిచారు. ఈ టీవీ డిబేట్లు నిర్మాణాత్మక చర్చకు ఉపయోగపడేవి కావని..కేవలం ఇస్లాం, ముస్లింలను అపహాస్యం చేయడానికి మాత్రమే అని లా బోర్డ్ అభిప్రాయపడింది.
కేవలం టీవీ డిబేట్లలో న్యూస్ ఛానెల్స్ బ్యాలెన్సుడ్ గా ఉన్నామని చూపడానికి మాత్రేమే ముస్లిం ప్రముఖులను ఆహ్వానిస్తున్నాయని..మనం ఈ మోసానికి బలైపోతున్నామని.. మేము ఈ ప్రోగ్రామ్స్, ఛానెల్స్ ను బహిష్కరిస్తే సదరు టీవీ ఛానెళ్లు టీఆర్పీ కోల్పోవడమే కాకుండా.. వారి ప్రణాళికలు విఫలం అవుతాయని ముస్లిం పర్సనల్ లా బోర్డ్ అభిప్రాయపడింది.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?