UP: మహిళలపై అఖిలేష్ ఎన్నికల వరాలు.. ఏడాదికి రూ.40 వేలు సాయం ప్రకటన
- మహిళలపై అఖిలేష్ ఎన్నికల వరాలు
- ఏడాదికి రూ.40 వేలు సాయం ప్రకటన
- బాలికలకు ఉచితంగా ల్యాప్టాప్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్తో పాటు గుజరాత్ సహా ఏడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఏడు రాష్ట్రాలు బీజేపీకి చాలా కీలకమైనవి. దీంతో ఇప్పటికే కాషాయ పార్టీ కసరత్తు ప్రారంభించింది. ఇక ముచ్చటిగా మూడోసారి యూపీలో అధికారంలోకి రావాలని బీజేపీ తహతహలాడుతోంది. మరోవైపు సమాజ్వాదీ పార్టీ కూడా ఈసారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీలు పోటాపోటీగా ప్రజలపై హామీలు కుమ్మరిస్తున్నాయి.
నిన్న ఉత్తరప్రదేశ్ సీఎం యోగి భారీగా హామీలు కుమ్మరించారు. 60 ఏళ్లు పైబడిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. 12వ తరగతి ఉత్తీర్ణులైన 25 లక్షల మంది బాలికా విద్యార్థినులకు ఉచిత ల్యాప్టాప్లు, 50 వేల మంది బాలికలకు ఉచితంగా స్కూటీలను అందించే రాణి లక్ష్మీబాయి పథకాన్ని ప్రకటించారు.
Also Read
- Nepal Floods: నేపాల్ ప్రధానికి నరేంద్రమోడీ ఫోన్.. సాయం అందిస్తామని హామీ..
- Sugar Price Fall: చక్కెర ధరలపై కేంద్రం మాస్టర్ ప్లాన్.. సామాన్యులకు గుడ్ న్యూస్..
- Operation Sindoor: భారత్ హిట్ లిస్టులో పాకిస్తాన్ ‘‘స్కార్దు’’.. చైనాకు కూడా హెచ్చరికేనా..?
- Egg Prices Rise: గుడ్ల ధరలకు ఇథనాల్ ఎఫెక్ట్.. అసలు కారణం ఇదే!
తాజాగా సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్.. మహిళా ఓటర్లు లక్ష్యంగా హామీలు కుమ్మరించారు. 10 భారీ ప్రకటనలు చేశారు. మహిళలకు రూ.40 వేలు, వారానికి రెండు రోజులు సెలవులు.. 33 శాతం ఉద్యోగ రిజర్వేషన్ వంటి హామీలు ఇచ్చారు. పేద మహిళలకు 40,000 రూపాయల సహాయం అందిస్తామని తెలిపారు. ఈ మొత్తాన్ని ప్రతి ఏటా పెంచుతామని డింపుల్ యాదవ్ చెప్పారు. దీనికి ‘స్త్రీ సమ్మాన్ సమృద్ధి యోజన’ అని పేరు పెట్టారు.
సమాజ్వాదీ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 12వ తరగతి ఉత్తీర్ణులైన ప్రతి బాలికకు ఉచితంగా ల్యాప్టాప్ అందిస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తి ఫీజు మాఫీ చేయగా.. ప్రైవేట్ పాఠశాలల్లో సగం ఫీజు చెల్లిస్తామని పేర్కొన్నారు. నెలకు కనీసం రెండు రోజుల సాధారణ సెలవు మంజూరు చేస్తామని.. ప్రతి తహసీల్లో ఒక పీజీ కళాశాల, ప్రతి జిల్లాలో ఒక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని ప్రకటించారు. ప్రతి వితంతువుకు, నిరుపేద మహిళకు శాశ్వత ప్రభుత్వ గృహాన్ని అందిస్తామన్నారు. ప్రతి నిరుపేద మహిళకు గౌరవప్రదమైన అంత్యక్రియల బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని.. మూసివేసిన 26,000కు పైగా పాఠశాలలను తిరిగి ప్రారంభిస్తామన్నారు. మహిళలపై నేరాలకు సంబంధించిన కేసుల కోసం ఫాస్ట్-ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామని కూడా హామీ ఇచ్చారు.
ఉత్తరప్రదేశ్లో మహిళా జనాభా ఎంత?
2022 ఉత్తర ప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఓటర్ల జాబితా ప్రకారం.. రాష్ట్రంలో దాదాపు 69.8 మిలియన్ల మహిళా ఓటర్లు ఉన్నారు. మొత్తం ఓటర్ల సంఖ్య దాదాపు 15 కోట్లు. 2022లో ఉత్తర ప్రదేశ్ మొత్తం జనాభా అంచనా దాదాపు 24 కోట్లు ఉంది.
VIDEO | During an event on party’s Stree Samman Samriddhi Yojana, which is a poll promise, Samajwadi Party chief Akhilesh Yadav (@yadavakhilesh) says, “Today when we are talking about the scheme, those who spoke, I want to thank them… Earlier as well, during Samajwadi Party… pic.twitter.com/HBTiXSqOsH
— Press Trust of India (@PTI_News) August 26, 2026
తాజావార్తలు
-
UP: మహిళలపై అఖిలేష్ ఎన్నికల వరాలు.. ఏడాదికి రూ.40 వేలు సాయం ప్రకటన
-
Nepal Floods: నేపాల్ ప్రధానికి నరేంద్రమోడీ ఫోన్.. సాయం అందిస్తామని హామీ..
-
Komaram Bheem District : ఆసిఫాబాద్లో వరద బీభత్సం.. బైకిస్టులకు తృటిలో తప్పిన ప్రమాదం..
-
Sugar Price Fall: చక్కెర ధరలపై కేంద్రం మాస్టర్ ప్లాన్.. సామాన్యులకు గుడ్ న్యూస్..
-
Ranabaali: ఇప్పుడు రష్మిక – విజయ్ వంతు.. ఈ వారంలోనే ‘రణబాలి’ బిగ్ సర్ప్రైజ్? అసలు ట్విస్ట్ ఇదే!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..