ఒమిక్రాన్ ఎఫెక్ట్.. అఖిలేష్ యాదవ్ కీలక నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మళ్లీ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.. మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.. అయోధ్యలో ఈ నెల 9వ తేదీన జరగాల్సిన సమాజ్ వాదీ పార్టీ విజయ రథయాత్ర రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.. అంతేకాకుండా జనవరి 7 మరియు జనవరి 8న ఉత్తరప్రదేశ్లోని గోండా మరియు బస్తీలలో తన ఇతర ర్యాలీలను కూడా రద్దు చేసుకున్నారు అఖిలేష్.. కాగా, యూపీలో ఫిబ్రవరి-మార్చి నెలల్లో ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ పార్టీలు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి.. కానీ, కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు కూడా వెనుకడుగు వేస్తున్నాయి.
Read Also: హైదరాబాద్లో భారీగా డ్రగ్స్ పట్టివేత
Also Read
- Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్గాంధీ లేఖ.. ఏముందంటే..!
- Operation Sindoor: పాకిస్తాన్ వేడుకున్నా దాడి చేశాం: మాజీ సీడీఎస్ అనిల్ చౌహాన్..
- Operation Sindoor: పాక్ అణుకేంద్రం ‘‘కిరాణా హిల్స్’’పై దాడి.. సంచలన నిజం చెప్పిన మాజీ CDS..
- Rahul Gandhi: కృతి సనన్ రక్షాబంధన్ యాడ్పై కంగనా విమర్శలు.. ఆమె ఇష్టమని రాహుల్గాంధీ మద్దతు
ఇక, గత నెలలో అఖిలేష్ యాదవ్ పశ్చిమ యూపీలో నిర్వహించాల్సిన ర్యాలీని కూడా రద్దు చేసుకున్న విషయం తెలిసిందే.. ఆయన భార్య మరియు కుమార్తె కరోనా బారినపడ్డారు.. ఆ తర్వాత మూడు రోజుల పాటు బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉంటానని ప్రకటించి.. కార్యక్రమాలు రద్దు చేసుకున్నారు.. ఇదే సందర్భంలో తనకు కోవిడ్ నెగటివ్గా వచ్చిన రిపోర్ట్ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. మరోవైపు.. కోవిడ్ కేసులు పెరగడం, థర్డ్ వేవ్ దృష్ట్యా యూపీలో పెద్ద ర్యాలీలను రద్దు చేయాలని ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ పార్టీ లేఖ రాసింది. కోవిడ్, ఒమిక్రాన్ దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ కూడా తన కార్యక్రమాలను వాయిదా వేసింది. యూపీతో పాటు త్వరలోనే ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లోనూ మాస్ ర్యాలీలను వాయిదా వేయాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది.. తమ రాష్ట్రాల్లోని కోవిడ్-19 పరిస్థితిని అంచనా వేయాలని, ఆపై ర్యాలీలు నిర్వహించడంపై నిర్ణయం తీసుకోవాలని ఆయా రాష్ట్రాలకు సూచించారు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్. మరోవైపు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్.. గౌతంబుద్ధ్ నగర్ జిల్లాలో జరగాల్సిన ప్రభుత్వ కార్యక్రమాన్ని కూడా రద్దు చేసుకున్నారు..
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!