Site icon NTV Telugu

Ajit Pawar: అజిత్ పవార్‌ను కాపాడేందుకు స్థానికులు ప్రయత్నం.. చివరికేమైందంటే..!

Ajit Pawar10

Ajit Pawar10

బారామతి విమాన ప్రమాదం యావత్తు దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రాణాలు కోల్పోవడం పట్ల రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆయన అభిమానులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

ఇక బారామతిలో విమాన ప్రమాదాన్ని స్థానికులు ముందే గమనించారు. బారామతి విమానాశ్రయానికి 100 మీటర్ల దూరంలోనే ఈ ప్రమాదం జరిగింది. విమానం కింద వరకు రావడాన్ని స్థానికులు గమనించారు. విమానం కూలిపోయేలా ఉందని భావించిన స్థానికులు అలా చూస్తూనే ఉన్నారు. ఇంతలోనే పెద్ద శబ్దం వచ్చి కూలిపోయిందని తెలిపారు. అయితే విమానం కూలిపోగానే పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయని.. ఆ సమయంలో రెండు మృతదేహాలు దూరంగా పడినట్లుగా చెప్పారు. ప్రమాదం తర్వాత కూడా నాలుగైదు సార్లు శబ్దాలు వచ్చినట్లుగా తెలిపారు. చేతివాచీ, కళ్లద్దాలను బట్టి అజిత్ పవార్‌లా ఉన్నారని గమనించి బయటకు లాగేందుకు ప్రయత్నించామని.. బయటకు లాగినా ప్రయోజనం లేకుండా పోయిందని.. అప్పటికే అజిత్ పవార్ చనిపోయారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన మమ్మల్ని కలిచి వేసింనది ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.

అజిత్ పవార్‌కు బారామతి నియోజకవర్గంలో బుధవారం అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ఆ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఉదయం 8:10 గంటలకు ముంబై నుంచి బారామతికి బయల్దేరారు. అయితే మార్గమధ్యలో విమానంలో సాంకేతిక లోపం తలెత్తినట్లుగా పైలట్ గ్రహించాడు. దీంతో బారామతి విమానాశ్రయంలో ఉదయం 8:42 నిమిషాలకు ల్యాండింగ్ చేసేందుకు ప్రయత్నించారు. అనంతరం రెండోసారి కూడా ప్రయత్నించారు. మూడోసారి 8:45 గంటలకు ప్రయత్నిస్తుండగా రాడర్‌తో సంబంధాలు తెగిపోయి విమానం కూలిపోయింది. దీంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ప్రమాద దృశ్యాలు సమీపంలో ఉన్న సీసీకెమెరాలో రికార్డ్ అయ్యాయి. విమానం కూలగానే పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో మంటల్లో కాలిపోయారు. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా మారిపోయాయి.

Exit mobile version