Planes Collide: ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం పెను ప్రమాదం తప్పింది. ఎయిర్ ఇండియా, ఇండిగో విమానాలు టాక్సీ వేలో ఢీకొన్నాయి. ఈ సంఘటనలో ప్రయాణికులు క్షేంగా ఉన్నారు. ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. రెండు విమానాల రెక్కలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.
Read Also: Rahul Gandhi: “కావాలనే నన్ను మాట్లాడనివ్వడం లేదు”.. స్పీకర్కు రాహుల్ గాంధీ లేఖ..
ఎయిర్ ఇండియా వెల్లడించిన వివరాల ప్రకారం, ముంబై నుంచి కోయంబత్తూర్ బయలుదేరాల్సిన AI 2732 విమానం టాక్సీవేపై నిలిచివున్న సమయంలో, ఎదురుగా వచ్చిన ఇండిగో విమానం దాని వింగ్ టిప్ను తాకింది. దీంతో ఎయిర్ ఇండియా విమానం రెక్క చివరి భాగం దెబ్బతింది. దీంతో విమానాన్ని నిలిపేసి, సాంకేతిక పరిశీలన ప్రారంభించినట్లు సంస్థ తెలిపింది.
ఇండిగో సంస్థ ప్రకారం.. ఇండిగో విమానం 6E 791 హైదరాబాద్ నుంచి ముంబైకి వచ్చింది. టాక్సీ చేస్తుండగా మరో విమాన రెక్కని తాకినట్లు సంస్థ ప్రకటించింది. ఇండిగోలోని ప్రయాణికులు అంతా క్షేమంగా ఉన్నారని, విమానాన్ని పరిశీలన కోసం పంపినట్లు చెప్పింది. సంఘటన తర్వాత రెండు విమాన సంస్థలు వెంటనే భద్రతా ప్రోటోకాల్స్ పాటించడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
