Air India: ఓ వైపు అంతులేని విషాదం.. ఇంకోవైపు ఎయిరిండియా ఉద్యోగులు బ్రేక్ డ్యాన్స్లు.. వీడియో వైరల్
- సభ్యత మరిచిన ఎయిరిండియా ఉద్యోగులు
- అహ్మదాబాద్ ఘటన మరువక ముందే ఉద్యోగులు డీజే పార్టీ
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదం నుంచి బాధిత కుటుంబాలు తేరుకోలేదు.. దేశ ప్రజలు మరిచిపోలేదు. ఇంకా కళ్ల ముందు ఆ దృశ్యాలే మెదులుతున్నాయి. దేశ చరిత్రలోనే అత్యంత దారుణమైన విమాన ప్రమాదాల్లో ఇదొకటి. జూన్ 12న అహ్మదాబాద్ ఎయిర్పోర్టు నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే.. సెకన్లలో సమీపంలోని ఒక హాస్టల్ భవనంపై కూలిపోయింది. ఒక్కరు మినహా విమానంలో ఉన్న 241 మంది చనిపోయారు. హాస్టల్లో ఉన్న 35 మంది మెడికోలు కూడా దుర్మరణం చెందారు. ఇంత మంది ఒకేసారి చనిపోవడంతో దేశ ప్రజలంతా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇంత ఘోర విషాదం నెలకొంటే.. కనీసం మానవత్వం లేకుండా ఎయిరిండియా ఉద్యోగులు సభ్యత మరిచి ప్రవర్తించారు. డీజే పాటలకు మహిళా ఉద్యోగులతో పాటు పురుష ఉద్యోగులు నృత్యాలు చేస్తూ నానా హంగామా సృష్టించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Rashmika: ధనుష్పై ఎమోషనల్గా పోస్ట్ పెట్టిన నేషనల్ క్రష్..
Also Read
- BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!
- Indian Railways Viral Train Puja: కదులుతున్న రైలులో పూజలు?.. రైల్వే శాఖ క్లారిటీ..
- Bihar Bank Account Glitch: పింఛను తీసుకునే తండ్రీకొడుకుల ఖాతాలో.. ఏకంగా రూ. 1500 కోట్ల బ్యాలెన్స్..!
- Mobile Theft: మొబైల్ దొంగతనం యత్నం.. 9 కి.మీ. పాటు రైలుకే వేలాడిన దొంగ.!
విమానాశ్రయంలో గ్రౌండ్ సేవలు అందించే టాటా గ్రూప్నకు చెందిన ఎయిరిండియా ఉద్యోగులు జూన్ 20న హర్యానాలోని గురుగ్రామ్లో ఒక పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. ఈ పార్టీకి AISATS చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అబ్రహం జకారియా, ఎయిర్ ఇండియా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సంప్రీత్ కోటియన్, బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ జీఎం హాజరయ్యారు. కార్యనిర్వాహకులు డీజే పార్టీ ఏర్పాటు చేశారు. బాలీవుడ్ పాటలు ప్లే అవుతుండగా ఉద్యోగులంతా బ్రేక్ డ్యాన్స్లు చేస్తూ ఎంజాయ్ చేశారు. మహిళా ఉద్యోగులు కూడా రెచ్చిపోయి డ్యాన్స్ చేశారు. మగ ఉద్యోగులతో కలిసి డ్యాన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Phone Tapping : సిట్ ముందుకు ఈటల రాజేందర్
ఎయిరిండియా ఉద్యోగుల తీరుపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధితులు బాధలో ఉంటే.. ఆప్తులను కోల్పోయి రోదిస్తుంటే కనీసం మానవత్వం లేకుండా గంతులేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. యావత్తు దేశం దు:ఖంలో ఉంటే ఇంగిత జ్ఞానం లేకుండా ఇవేమీ డ్యాన్స్లు అంటూ నెటిజన్లంతా ఫైరవుతున్నారు.
It has only been a few days since the tragic Ahmedabad plane crash.
Many families have not yet been able to see their loved ones for the last time; several bodies have still not been handed over.
Grief hangs heavy in households, funeral pyres are yet to cool. And at such a… pic.twitter.com/rrlekBNAeD
— Squint Neon (@TheSquind) June 22, 2025
తాజావార్తలు
-
ENG-W vs IND-W: లార్డ్స్లో భారత్ హవా.. చరిత్రకు అడుగు దూరంలో టీమిండియా మహిళలు..!
-
Nagarjuna: నాగ్ 101పై బిగ్ అప్డేట్.. ‘బొమ్మరిల్లు’ డైరెక్టర్తో కొత్త కాంబో?
-
Vivo Y05e: వివో Y05e విడుదల.. 5150mAh బ్యాటరీ, Unisoc T606 చిప్తో బడ్జెట్ స్మార్ట్ఫోన్
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!
-
Akhil Akkineni : ‘లెనిన్’ కు క్రూషియల్ టెస్ట్.. ఎలాంటి బ్యాటింగ్ చేస్తాడో?
ట్రెండింగ్
-
iPhone 17 Demand: సీన్ రివర్స్.. ఐఫోన్ 17 సిరీస్కు ఊహించని డిమాండ్.. అసలు కారణం ఏంటో తెలుసా?
-
Mobile Theft: మొబైల్ దొంగతనం యత్నం.. 9 కి.మీ. పాటు రైలుకే వేలాడిన దొంగ.!
-
Rahul Dravid Coach: మరోసారి హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్!
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?