Air India: ఓ వైపు అంతులేని విషాదం.. ఇంకోవైపు ఎయిరిండియా ఉద్యోగులు బ్రేక్ డ్యాన్స్లు.. వీడియో వైరల్
- సభ్యత మరిచిన ఎయిరిండియా ఉద్యోగులు
- అహ్మదాబాద్ ఘటన మరువక ముందే ఉద్యోగులు డీజే పార్టీ
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదం నుంచి బాధిత కుటుంబాలు తేరుకోలేదు.. దేశ ప్రజలు మరిచిపోలేదు. ఇంకా కళ్ల ముందు ఆ దృశ్యాలే మెదులుతున్నాయి. దేశ చరిత్రలోనే అత్యంత దారుణమైన విమాన ప్రమాదాల్లో ఇదొకటి. జూన్ 12న అహ్మదాబాద్ ఎయిర్పోర్టు నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే.. సెకన్లలో సమీపంలోని ఒక హాస్టల్ భవనంపై కూలిపోయింది. ఒక్కరు మినహా విమానంలో ఉన్న 241 మంది చనిపోయారు. హాస్టల్లో ఉన్న 35 మంది మెడికోలు కూడా దుర్మరణం చెందారు. ఇంత మంది ఒకేసారి చనిపోవడంతో దేశ ప్రజలంతా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇంత ఘోర విషాదం నెలకొంటే.. కనీసం మానవత్వం లేకుండా ఎయిరిండియా ఉద్యోగులు సభ్యత మరిచి ప్రవర్తించారు. డీజే పాటలకు మహిళా ఉద్యోగులతో పాటు పురుష ఉద్యోగులు నృత్యాలు చేస్తూ నానా హంగామా సృష్టించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Rashmika: ధనుష్పై ఎమోషనల్గా పోస్ట్ పెట్టిన నేషనల్ క్రష్..
Also Read
- India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
- Elections 2026: ఓటర్ల సునామీ.. బెంగాల్, తమిళనాడులో 1947 తర్వాత రికార్డ్ పోలింగ్
- Extramarital affair: భర్త స్నేహితుడితో ఏమిటా పని.. పైగా వాట్సాప్ స్టేటస్ కూడా పెట్టేసింది..
- Ration Cards: రేషన్ కార్డుదారులకు బిగ్ షాక్.. లక్షల కార్డులు రద్దు..
విమానాశ్రయంలో గ్రౌండ్ సేవలు అందించే టాటా గ్రూప్నకు చెందిన ఎయిరిండియా ఉద్యోగులు జూన్ 20న హర్యానాలోని గురుగ్రామ్లో ఒక పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. ఈ పార్టీకి AISATS చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అబ్రహం జకారియా, ఎయిర్ ఇండియా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సంప్రీత్ కోటియన్, బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ జీఎం హాజరయ్యారు. కార్యనిర్వాహకులు డీజే పార్టీ ఏర్పాటు చేశారు. బాలీవుడ్ పాటలు ప్లే అవుతుండగా ఉద్యోగులంతా బ్రేక్ డ్యాన్స్లు చేస్తూ ఎంజాయ్ చేశారు. మహిళా ఉద్యోగులు కూడా రెచ్చిపోయి డ్యాన్స్ చేశారు. మగ ఉద్యోగులతో కలిసి డ్యాన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Phone Tapping : సిట్ ముందుకు ఈటల రాజేందర్
ఎయిరిండియా ఉద్యోగుల తీరుపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధితులు బాధలో ఉంటే.. ఆప్తులను కోల్పోయి రోదిస్తుంటే కనీసం మానవత్వం లేకుండా గంతులేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. యావత్తు దేశం దు:ఖంలో ఉంటే ఇంగిత జ్ఞానం లేకుండా ఇవేమీ డ్యాన్స్లు అంటూ నెటిజన్లంతా ఫైరవుతున్నారు.
It has only been a few days since the tragic Ahmedabad plane crash.
Many families have not yet been able to see their loved ones for the last time; several bodies have still not been handed over.
Grief hangs heavy in households, funeral pyres are yet to cool. And at such a… pic.twitter.com/rrlekBNAeD
— Squint Neon (@TheSquind) June 22, 2025
తాజావార్తలు
-
Off The Record : కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా ఆర్మూర్ వ్యవహారాలు
-
Rose Lassi Recipe: ఎప్పుడైనా రోజ్ లస్సీని రుచి చూశారా..? ఇలా సింపుల్గా తయారు చేయండి.. వన్ మోర్ అనాల్సిందే..
-
Telangana Cabinet: రాష్ట్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు.. అక్కడ అతి పెద్ద స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
-
India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
-
Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!