Adani Iron Bridge: 90 అడుగుల ఐరన్ బ్రిడ్జ్ని దొంగలించిన దుండగులు.. ఎలా దొరికారంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Adani Company 6000kg Iron Bridge Stolen In Mumbai Malad: బిహార్లో రైలు ఇంజిన్, రైలు పట్టాలను దొంగలించడం వంటి విచిత్రమైన సంఘటనల గురించి మీరంతా వినే ఉంటారు. సరిగ్గా అలాంటిదే మరో ఘటన చోటు చేసుకుంది. అదానీ కంపెనీకి సంబంధించిన ఓ ఐరన్ బ్రిడ్జ్ని నలుగురు దుండగులు చోరీ చేశారు. అయితే.. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి, సీసీటీవీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా, దొంగల్ని పట్టుకోగలిగారు. ఆ వివరాల్లోకి వెళ్తే..
Dunki: రికార్డ్ ధరకు అమ్ముడుపోయిన డంకీ డిజిటల్ రైట్స్
Also Read
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Gas Pipeline: భారత్ మాస్టర్ ప్లాన్.. సముద్రగర్భంలో భారీ గ్యాస్ పైప్లైన్..
- Kamal Haasan: పొదుపు మంత్రంపై కమల్హాసన్ కీలక వ్యాఖ్యలు
- 1991 India Gold Crisis: రాత్రికి రాత్రి బ్రిటన్కు 47,000 కిలోల బంగారం తరలింపు.. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే!
అదానీ కంపెనీ గత సంవత్సరం ముంబైలోని మలాడ్ ప్రాంతంలో ఒక తాత్కాలిక ఇనుప వంతెనని నిర్మించింది. భారీ ఎలక్ట్రిక్ కేబుళ్లను తరలించడం కోసమే దీనిని నిర్మించడం జరిగింది. అయితే.. కొన్ని రోజుల తర్వాత దాని పక్కనే మహారాష్ట్ర ప్రభుత్వం మరో వంతెనని ఏర్పాటు చేసింది. ఈ వంతెని అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి.. అదానీ కంపెనీకి చెందిన ఆ ఇనుప వంతెనని వినియోగించడం మానేశారు. ఆ వంతెన 90 అడుగులు, 6000 కిలోల బరువు ఉంటుంది. అలాంటి వంతెన.. ఉన్నట్టుండి ఒక్కసారిగా మాయం అయ్యింది. మ్యాజిక్ షోలలో కళ్ల ముందే ఏనుగుని మాయం చేసినట్టు.. రాత్రికి రాత్రే ఈ వంతెన కనిపించకుండా పోయింది.
Palak Puraswani: వాడు దారుణంగా మోసం చేశాడు.. బెడ్రూంలో నటితో శృంగారం చేస్తూ..
దీంతో అవాక్కయిన అదానీ కంపెనీ.. తమ వంతెనని ఎవరో దొంగలించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎంతైనా అదానీ కంపెనీకి చెందినది కదా.. ఈ కేసుని పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకొని, వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. అయితే.. మొదట్లో ఈ కేసు పోలీసులకు కాస్త సవాలుగా మారింది. ఎందుకంటే.. దొంగలించబడ్డ ఈ వంతెనకి దగ్గరలో ఎలాంటి సీసీటీవీ కెమెరాలు లేవు. దీంతో.. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. అప్పుడే పోలీసులకు జూన్ 11వ తేదీన ఓ భారీ ట్రక్కు వెళ్లడాన్ని గమనించారు. దాంతో.. కచ్ఛితంగా వంతెనని అందులోని తరలించి ఉంటారని నిర్ధారణకి వచ్చారు.
Video Viral: ఆడవాళ్ల గొడవలో తలదూర్చొద్దు అని ఊరికే చెప్పారా? ఇప్పుడు చూడు ఏం జరిగిందో..
తొలుత సీసీటీవీ కెమెరాలో చిక్కిన ట్రక్కు డీటెయిల్స్ని కనుక్కున్నారు. అక్కడి నుంచి దర్యాప్తు వేగవంతం చేసి, చివరికి ఆ వంతెనని చోరీ చేసిన నలుగురు దొంగల్ని పట్టుకున్నారు. ఇక్కడ షాక్కి గురి చేసే విషయం ఏమిటంటే.. ఈ వంతెన నిర్మాణ సమయంలో పని చేసిన వ్యక్తే, ఈ చోరీలో ప్రధాన నిందితుడిగా తేలాడు. గ్యాస్ కట్టర్లతో ఆ వంతెనని ముక్కలు ముక్కలు చేసి, భారీ ట్రక్కు ద్వారా తరలించినట్టు విచారణలో తేలింది. ఈ వంతెన వినియోగంలో లేదు కాబట్టే, వాళ్లు ఈ చోరీకి పాల్పడినట్టు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..