Adani Iron Bridge: 90 అడుగుల ఐరన్ బ్రిడ్జ్ని దొంగలించిన దుండగులు.. ఎలా దొరికారంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Adani Company 6000kg Iron Bridge Stolen In Mumbai Malad: బిహార్లో రైలు ఇంజిన్, రైలు పట్టాలను దొంగలించడం వంటి విచిత్రమైన సంఘటనల గురించి మీరంతా వినే ఉంటారు. సరిగ్గా అలాంటిదే మరో ఘటన చోటు చేసుకుంది. అదానీ కంపెనీకి సంబంధించిన ఓ ఐరన్ బ్రిడ్జ్ని నలుగురు దుండగులు చోరీ చేశారు. అయితే.. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి, సీసీటీవీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా, దొంగల్ని పట్టుకోగలిగారు. ఆ వివరాల్లోకి వెళ్తే..
Dunki: రికార్డ్ ధరకు అమ్ముడుపోయిన డంకీ డిజిటల్ రైట్స్
Also Read
- MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమార్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
అదానీ కంపెనీ గత సంవత్సరం ముంబైలోని మలాడ్ ప్రాంతంలో ఒక తాత్కాలిక ఇనుప వంతెనని నిర్మించింది. భారీ ఎలక్ట్రిక్ కేబుళ్లను తరలించడం కోసమే దీనిని నిర్మించడం జరిగింది. అయితే.. కొన్ని రోజుల తర్వాత దాని పక్కనే మహారాష్ట్ర ప్రభుత్వం మరో వంతెనని ఏర్పాటు చేసింది. ఈ వంతెని అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి.. అదానీ కంపెనీకి చెందిన ఆ ఇనుప వంతెనని వినియోగించడం మానేశారు. ఆ వంతెన 90 అడుగులు, 6000 కిలోల బరువు ఉంటుంది. అలాంటి వంతెన.. ఉన్నట్టుండి ఒక్కసారిగా మాయం అయ్యింది. మ్యాజిక్ షోలలో కళ్ల ముందే ఏనుగుని మాయం చేసినట్టు.. రాత్రికి రాత్రే ఈ వంతెన కనిపించకుండా పోయింది.
Palak Puraswani: వాడు దారుణంగా మోసం చేశాడు.. బెడ్రూంలో నటితో శృంగారం చేస్తూ..
దీంతో అవాక్కయిన అదానీ కంపెనీ.. తమ వంతెనని ఎవరో దొంగలించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎంతైనా అదానీ కంపెనీకి చెందినది కదా.. ఈ కేసుని పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకొని, వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. అయితే.. మొదట్లో ఈ కేసు పోలీసులకు కాస్త సవాలుగా మారింది. ఎందుకంటే.. దొంగలించబడ్డ ఈ వంతెనకి దగ్గరలో ఎలాంటి సీసీటీవీ కెమెరాలు లేవు. దీంతో.. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. అప్పుడే పోలీసులకు జూన్ 11వ తేదీన ఓ భారీ ట్రక్కు వెళ్లడాన్ని గమనించారు. దాంతో.. కచ్ఛితంగా వంతెనని అందులోని తరలించి ఉంటారని నిర్ధారణకి వచ్చారు.
Video Viral: ఆడవాళ్ల గొడవలో తలదూర్చొద్దు అని ఊరికే చెప్పారా? ఇప్పుడు చూడు ఏం జరిగిందో..
తొలుత సీసీటీవీ కెమెరాలో చిక్కిన ట్రక్కు డీటెయిల్స్ని కనుక్కున్నారు. అక్కడి నుంచి దర్యాప్తు వేగవంతం చేసి, చివరికి ఆ వంతెనని చోరీ చేసిన నలుగురు దొంగల్ని పట్టుకున్నారు. ఇక్కడ షాక్కి గురి చేసే విషయం ఏమిటంటే.. ఈ వంతెన నిర్మాణ సమయంలో పని చేసిన వ్యక్తే, ఈ చోరీలో ప్రధాన నిందితుడిగా తేలాడు. గ్యాస్ కట్టర్లతో ఆ వంతెనని ముక్కలు ముక్కలు చేసి, భారీ ట్రక్కు ద్వారా తరలించినట్టు విచారణలో తేలింది. ఈ వంతెన వినియోగంలో లేదు కాబట్టే, వాళ్లు ఈ చోరీకి పాల్పడినట్టు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!