Arunachal Pradesh: అరుణాచల్ మా దేశంలో విడదీయలేని భాగం.. చైనా వ్యాఖ్యలపై భారత్ ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arunachal Pradesh: అరుణాచల్ ప్రదేశ్ తమ ప్రాంతమని డ్రాగన్ కంట్రీ చైనా చెబుతోంది. అయితే, ఎప్పటికప్పుడు చైనా వాదనల్ని భారత్ తిప్పికొడుతోంది. తాజాగా మరోసారి ఇండియాపై చైనా తన అక్కసు వెళ్లగక్కింది. చైనా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరుణాచల్పై చేసిన వాదనల్ని భారత్ తీవ్రంగా తప్పుపట్టింది. ‘‘ అరుణాచల్ భారతదేశంలో అంతర్భాగం, విడదీయలేని భాగం’’ అని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఈ రోజు అధికార ప్రకటన విడుదల చేసింది. ‘‘భారత్ రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ భూభాగంపై చైనా రక్షణ మంత్రిశాఖ ప్రతినిధి అసంబద్ధమైన వాదనల్ని మేము గుర్తించాము. ఈ విషయంపై నిరాధారమైన వాదనలను పునరావృతం చేయడం ద్వారా ఎటువంటి చెల్లుబాటు ఇవ్వదు’’ అని విదేశీ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. అరుణాచల్ ప్రజలు మా అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల నుంచి ప్రయోజనం పొందుతూనే ఉంటారు అని స్పష్టం చేశారు.
Read Also: Vinay Kumar: రష్యాకు భారత రాయబారిగా వినయ్ కుమార్ నియామకం..
Also Read
- West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
- LPG Demand Drop: అమాంతం పడిపోయిన LPG వినియోగం.. పెట్రోల్, డీజిల్ రివర్స్.. !
- DK.Shivakumar: ముఖ్యమంత్రిగా యువతపై డీకే.శివకుమార్ వరాల జల్లు.. విద్యార్థులందరికీ ఫ్రీ బస్ పాస్లు
- Sourav Ganguly: దాదాకు షాక్.. గంగూలీ భద్రతను తగ్గించిన బెంగాల్ ప్రభుత్వం
చైనా రక్షణ మంత్రిత్వ శాఖ ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ తమదిగా చెప్పుకుంది. అ ప్రాంతాన్ని జాంగ్నాన్ ప్రాంతంగా పేర్కొంటోంది. చైనా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి సీనియర్ కల్నల్ జాంగ్ జియోగాంగ్ మాట్లాడుతూ.. అరుణాచల్ ప్రదేశ్ అనే ప్రాంతం భారతదేశం చేత చట్టవిరుద్ధంగా స్థాపించబడింది, చైనా దీనిని ఎప్పుడూ గుర్తించదు అని అన్నారు.
ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ అరుణాచల్ ప్రదేశ్లో పర్యటించారు. ఆయన పర్యటన తర్వాత చైనా ఇలా వ్యాఖ్యలు చేస్తో్ంది. గతంలో కూడా పలువురు నేతలు ఆ రాష్ట్రంలో పర్యటించిన తర్వాత చైనా ఇలాగే గగ్గోలు పెట్టింది. మార్చి 9న, మోడీ ప్రపంచంలోనే అతి పొడవైన టూ-లైన్ టన్నెల్ ‘సెలా టన్నెల్’ని ప్రారంభించింది. ఇది ఉత్తరాన చైనాతో సరిహద్దు పంచుకుంటున్న తవాంగ్ ప్రాంతానికి అన్ని వాతావరణ పరిస్థితుల్లో మెరుగైన రవాణా అందిస్తుంది. ఫలితంగా మన ఆర్మీ దళాల మోహరింపు, తరలింపుకు, మెరుగైన కదలికలకు టన్నెల్ ఉపకరిస్తుంది. రూ.825 కోట్లతో నిర్మించిన ఈ టన్నెల్తో చైనా భయపడుతోంది.
తాజావార్తలు
-
Neem Juice Daily : వేప రసం మంచిదే.. కానీ రోజూ తాగితే ఈ ప్రమాదాలు తప్పవు.!
-
Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
-
Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
-
West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
-
Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!