Arunachal Pradesh: అరుణాచల్ మా దేశంలో విడదీయలేని భాగం.. చైనా వ్యాఖ్యలపై భారత్ ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arunachal Pradesh: అరుణాచల్ ప్రదేశ్ తమ ప్రాంతమని డ్రాగన్ కంట్రీ చైనా చెబుతోంది. అయితే, ఎప్పటికప్పుడు చైనా వాదనల్ని భారత్ తిప్పికొడుతోంది. తాజాగా మరోసారి ఇండియాపై చైనా తన అక్కసు వెళ్లగక్కింది. చైనా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరుణాచల్పై చేసిన వాదనల్ని భారత్ తీవ్రంగా తప్పుపట్టింది. ‘‘ అరుణాచల్ భారతదేశంలో అంతర్భాగం, విడదీయలేని భాగం’’ అని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఈ రోజు అధికార ప్రకటన విడుదల చేసింది. ‘‘భారత్ రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ భూభాగంపై చైనా రక్షణ మంత్రిశాఖ ప్రతినిధి అసంబద్ధమైన వాదనల్ని మేము గుర్తించాము. ఈ విషయంపై నిరాధారమైన వాదనలను పునరావృతం చేయడం ద్వారా ఎటువంటి చెల్లుబాటు ఇవ్వదు’’ అని విదేశీ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. అరుణాచల్ ప్రజలు మా అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల నుంచి ప్రయోజనం పొందుతూనే ఉంటారు అని స్పష్టం చేశారు.
Read Also: Vinay Kumar: రష్యాకు భారత రాయబారిగా వినయ్ కుమార్ నియామకం..
Also Read
- Nurjahan Mango: బాబోయ్.. ఒక్క మామిడి పండు ధర రూ.3,000, దీని ’ స్పెషాలిటీ ఏంటో తెలుసా?
- Sasaram-Patna Passenger: 24 గంటలు గడవకముందే వణికించిన మరో రైలు ప్రమాదం.. ప్యాసింజర్ రైలులో చెలరేగిన మంటలు
- Bharat Gaurav: నేపాల్కు 'భారత్ గౌరవ్' పర్యాటక రైలు.. ప్రారంభించనున్న ఐఆర్సీటీసీ.. ఛార్జీలు, పూర్తి వివరాలు
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
చైనా రక్షణ మంత్రిత్వ శాఖ ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ తమదిగా చెప్పుకుంది. అ ప్రాంతాన్ని జాంగ్నాన్ ప్రాంతంగా పేర్కొంటోంది. చైనా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి సీనియర్ కల్నల్ జాంగ్ జియోగాంగ్ మాట్లాడుతూ.. అరుణాచల్ ప్రదేశ్ అనే ప్రాంతం భారతదేశం చేత చట్టవిరుద్ధంగా స్థాపించబడింది, చైనా దీనిని ఎప్పుడూ గుర్తించదు అని అన్నారు.
ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ అరుణాచల్ ప్రదేశ్లో పర్యటించారు. ఆయన పర్యటన తర్వాత చైనా ఇలా వ్యాఖ్యలు చేస్తో్ంది. గతంలో కూడా పలువురు నేతలు ఆ రాష్ట్రంలో పర్యటించిన తర్వాత చైనా ఇలాగే గగ్గోలు పెట్టింది. మార్చి 9న, మోడీ ప్రపంచంలోనే అతి పొడవైన టూ-లైన్ టన్నెల్ ‘సెలా టన్నెల్’ని ప్రారంభించింది. ఇది ఉత్తరాన చైనాతో సరిహద్దు పంచుకుంటున్న తవాంగ్ ప్రాంతానికి అన్ని వాతావరణ పరిస్థితుల్లో మెరుగైన రవాణా అందిస్తుంది. ఫలితంగా మన ఆర్మీ దళాల మోహరింపు, తరలింపుకు, మెరుగైన కదలికలకు టన్నెల్ ఉపకరిస్తుంది. రూ.825 కోట్లతో నిర్మించిన ఈ టన్నెల్తో చైనా భయపడుతోంది.
తాజావార్తలు
-
Gold and Silver Rates: గోల్డ్, సిల్వర్ ధరల్లో ఇంత మార్పా?.. నేటి ధరలు ఇవే
-
Ricky Ponting-PBKS: ఒంటరిగా కూర్చుని ఏడ్చేసిన పంజాబ్ హెడ్ కోచ్.. సెటైర్లు వేసిన ఆర్ అశ్విన్!
-
Silver Price Hike: ఇక సామాన్యుడికి వెండి కూడా అందదా? ఆ ఒక్క నిర్ణయంతో ఇక సిల్వర్ ధరలు కొండెక్కి కూర్చోవాల్సిందేనా!
-
Nothing Phone 3: పిచ్చెక్కించే డీల్ బ్రో.. సగం ధరకే నథింగ్ ఫోన్ 3.. ఏకంగా రూ. 40,000 తగ్గింపు, 5,500mAh బ్యాటరీ
-
Pakistan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను గద్దె దించేందుకు అమెరికా కుట్ర.. బయటపడ్డ సంచలన రహస్యాలు!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..