AAP Leader Climbs Tower: టికెట్ ఇవ్వలేదని టవర్ ఎక్కిన ఆప్ నేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AAP Leader, Denied Delhi Civic Poll Chance, Climbs Tower: ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల కోసం ఆప్ తుది జాబితాను విడుదల చేసింది. మొత్తం 250 సభ్యులు ఉన్న ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కు డిసెంబర్ 4న ఎన్నికలు జరగనున్నాయి. అయితే దీని కోసం ఆప్ శుక్రవారం 134 మందితో, శనివారం 117 మందితో తుది జాబితాను విడుదల చేసింది. అయితే అందులో తన పేరు లేకపోవడంతో ఆప్ నేత టవర్ ఎక్కి నిరసన తెలిపాడు.
Read Also: Gujarat: రైలు లేకపోతే ఓట్లు లేవు.. ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చిన 18 గ్రామాలు
Also Read
- Aadhaar Mobile Number Update: ఆధార్లో మొబైల్ నంబర్ మార్పు.. ఎన్ని సార్లు అప్డేట్ చేసుకోవచ్చు? పూర్తి వివరాలు ఇవే
- BK Hariprasad: కర్ణాటక కాంగ్రెస్ పగ్గాలు ఆయనకే.. ఎవరో తెలుసా?
- Hospital Fire: ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం.. 10 మంది మృతి
- West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
వివరాల్లోకి వెళితే.. తూర్పు ఢిల్లీకి చెందిన మాజీ కౌన్సిలర్ హసీబ్-ఉల్ హసన్ తనకు టికెట్ రాకపోవడంతో నిరసన తెలుపుతూ.. టవర్ ఎక్కాడు. ఆదివారం జరిగిన ఈ ఘటన ఆప్ వర్గాల్లో కలకలం రేపింది. టవర్ ఎక్కడమే కాకుండా దాన్ని ఫేస్ బుక్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేశాడు. తనకు టికెట్ రాకపోవడానికి ఆప్ నాయకులు అతిషి, దుర్గేష్ పాఠక్ కారణం అని ఆరోపించారు. తాను చనిపోతే వీరిద్దరిదే బాధ్యత అని చెప్పాడు. ‘‘ ఈ రోజు నాకు ఏదైనా జరిగితే లేదా నేను చనిపోతే ఆప్ నాయకులు దుర్గేష్ పాఠక్, అతిషి బాధ్యత వహిస్తారని అన్నాుడ. నా బ్యాంక్ పాస్ బుక్ తో సహా నా ఒరిజినల్ పత్రాలు వారి వద్ద ఉన్నాయి.. నామిణేషన్ల దాఖలు చేయడానికి రేపు చివరి రోజు కానీ వారు నాపత్రాలను నాకు ఇవ్వడం లేదు’’ అని వీడియో చెప్పాడు.
మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ తనను పోటీలో దింపుతుందా.. లేదా.. అన్నది తనకు ఆందోళనగా లేదని.. అయితే తన పత్రాలను తిరిగి ఇవ్వాలని కోరారు. ఈ ఆరోపణలపై ఆప్ స్పందించలేదు. హసీబ్ ఉల్ హసన్ ఈ ఏడాది ప్రారంభంలో వార్తల్లోకి వచ్చారు. మార్చి నెలలో శాస్త్రి పార్క్ లో పొంగిపొర్లుతున్న మురుగు కాలువను శుభ్రం చేయడానికి అందులోకి దిగారు. తెల్లని కుర్తాతో డ్రెయిన్ లో నిలబడి చెత్త తీస్తూ నిరసన తెలిపారు.
Delhi |Had media not come Durgesh Pathak,Atishi,Sanjay Singh wouldn't have returned my paper.They sold ticket to Deepu Chaudhary for Rs 3 Cr,demanded money from me but I don't have any: AAP's Haseeb-ul-Hasan who climbed transmission tower allegedly for not getting MCD poll ticket pic.twitter.com/P5ienYKqVc
— ANI (@ANI) November 13, 2022
తాజావార్తలు
-
Aadhaar Mobile Number Update: ఆధార్లో మొబైల్ నంబర్ మార్పు.. ఎన్ని సార్లు అప్డేట్ చేసుకోవచ్చు? పూర్తి వివరాలు ఇవే
-
PEDDI : పెద్ది ఓవర్శీస్ టాక్..
-
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. అమరావతి అభివృద్ధి, కీలక సంక్షేమ నిర్ణయాలపై చర్చ!
-
Upasana Konidela: ‘పెద్ది’ థియేటర్లో మెగా కోడలి ఊరమాస్ రచ్చ.. చరణ్ ఎంట్రీకి పేపర్లు ఎగరేసిన ఉపాసన!
-
Hero Flex Fuel Bikes: హీరో మోటోకార్ప్ సంచలనం.. దేశంలో తొలి ఫ్లెక్స్-ఫ్యూయల్ బైక్స్ స్ప్లెండర్, HF డీలక్స్ మార్కెట్లోకి..
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!