Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Aam Aadmi Party Next Target Rajasthan

Aam Aadmi Party: కాంగ్రెస్, బీజేపీ ఖో-ఖో.. ఇక చెల్లదు పో.. అంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ. రాజస్థాన్‌లోనూ రాణిస్తుందా?

Published Date :July 18, 2022 , 9:24 am
By Akkirala Kondala Rao
Aam Aadmi Party: కాంగ్రెస్, బీజేపీ ఖో-ఖో.. ఇక చెల్లదు పో.. అంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ. రాజస్థాన్‌లోనూ రాణిస్తుందా?
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

Aam Aadmi Party: ఇప్పటికే జాతీయ రాజధాని ఢిల్లీలో అధికారంలో పాతుకుపోయిన ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) రీసెంట్‌గా పంజాబ్‌లోనూ పవర్‌లోకి వచ్చింది. లేటెస్టుగా మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలీ మునిసిపల్‌ ఎన్నికల్లో మేయర్‌ పీఠాన్ని దక్కించుకోవటం ద్వారా ఆ రాష్ట్రంలో అకౌంట్‌ తెరిచింది. మధ్యప్రదేశ్‌లో ఇండోర్‌ తర్వాత పెద్ద మునిసిపల్‌ కార్పొరేషన్‌ సింగ్రౌలీ. కాబట్టి ఆప్‌ సొంతం చేసుకున్న ఈ విజయం విశేషమనే చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఈ పార్టీ మరో రాష్ట్రం పైన ఫోకస్‌ పెట్టింది. అదే.. రాజస్థాన్‌. అక్కడ కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు ఆడుతున్న ఖో-ఖో ఆట ఇక చెల్లదు పో అంటోంది.

రాజస్థాన్‌లో ఈ రెండు పార్టీలు రాజకీయంగా లోపాయికారీ ఒప్పందాన్ని కుదుర్చుకొని రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను పణంగా పెట్టాయని ఆప్‌ విమర్శిస్తోంది. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే విషయాన్ని ఎన్నికలకు ముందు ప్రకటించలేని దురవస్థ కాంగ్రెస్‌, బీజేపీలదని ఆప్‌ రాజ్యసభ ఎంపీ సందీప్‌ పాఠక్‌ ఎద్దేవా చేశారు. పంజాబ్‌లో ఆప్‌ అనూహ్య విజయం వెనక ఉన్న స్ట్రాటజిస్ట్‌ ఈయనే. రాజస్థాన్‌లో మరో ఏడాదిలో అసెంబ్లీ ఎలక్షన్‌ జరగనుంది. అక్కడ ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉంది. ఆ రాష్ట్రంలో రానున్న రోజుల్లో ఆప్‌ అనుసరించనున్న వ్యూహాన్ని సందీప్‌ పాఠక్‌ మీడియాతో పంచుకున్నారు.

Also Read

  • Tamil Politics: విజయ్‌పై మొదలైన డీఎంకే విమర్శలు.. ఏం జరిగిందంటే..?
  • PM Modi: మే 15 లోపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగొచ్చా.. మోడీ వ్యాఖ్యల ఆంతర్యం ఏమిటి.?
  • CM Vijay Simplicity: దటీజ్ దళపతి.. సీఎం హోదాలో ఉన్నా.. టేబుల్ మోసి సింప్లిసిటీ చాటుకున్న విజయ్!
  • PM Modi: కాంగ్రెస్‌కు కొత్త పేరు పెట్టిన మోడీ.. ‘MMC’ అంటే ముస్లిం లీగ్, మావోవాది కాంగ్రెస్!
Add as a preferred
source on google

Read Also: B.Sc. Formula: బీఎస్సీ అంటే బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ కాదు!. బ్రాహ్మణులు, షెడ్యూల్డ్‌ కులాలట

“స్థానికుణ్నే సీఎం చేస్తాం” అనే ప్రచారంతో ముందుకెళతామని చెప్పారు. బీజేపీ అంతర్గత కుమ్ములాటలతో అతలాకుతలం అవుతూ ప్రధాని మోడీ పేరు, ఫొటో చూపి ఓట్లు వేయించుకోవాలనుకుంటోందని తప్పుపట్టారు. జాతీయ నాయకుడి (మోడీ) గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నారని, ఇవి లోక్‌సభ ఎన్నికలు కావు కదా అని ఆయన ప్రశ్నించారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ రాజస్థాన్‌లోని మొత్తం 200 ఎమ్మెల్యే స్థానాల్లో పూర్తి సన్నద్ధతతో పాల్గొంటుందని ప్రకటించారు. ఎన్నికలకు ముందు సర్వే చేస్తామని, తద్వారా వాస్తవ పరిస్థితులపై ఒక అంచనాకు వస్తామని, జనం ఏం కోరుకుంటున్నారో తెలుస్తుందని సందీప్‌ పాఠక్‌ అన్నారు.

ఏ అభ్యర్థికైతే విజయవకాశాలు ఎక్కువగా ఉంటాయో, ప్రజల్లో ఎవరికైతే గుడ్‌ ఇమేజ్‌ ఉందో వాళ్లనే బరిలోకి దింపుతామని, ఆయా క్యాండేట్లను సర్వే ఫలితాల ఆధారంగా నిర్ణయిస్తామని తెలిపారు. పంజాబ్‌లోనూ ఇదే ప్రణాళికను అమలుచేసి సక్సెస్‌ అయ్యామని గుర్తుచేసుకున్నారు. నాయకులకే కాకుండా క్రియాశీలక కార్యకర్తలకు కూడా ఆప్‌ టికెట్లు కేటాయిస్తామని వెల్లడించారు. నిజం చెప్పాలంటే పంజాబ్‌లో పాలనా పగ్గాలు చేపట్టిన వెంటనే ఆప్‌ రాజస్థాన్‌లో ఎలక్షన్‌ ప్రిపరేషన్‌పై దృష్టిపెట్టింది. ప్రస్తుతం ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఆప్‌ ప్రాతినిధ్యం సున్నా. జీరో నుంచి హీరో లెవల్‌కి ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుంది.

కాంగ్రెస్‌, బీజేపీ ఈ రెండు పార్టీల్లో ఏది అధికారంలో ఉన్నా రాజస్థాన్‌కి ఒరిగిందేమీలేదని ఆప్‌ అంటోంది. సామాన్యుల సమస్యలను అవి గాలికొదిలేశాయని మండిపడుతోంది. ఆమ్‌ ఆద్మీ పార్టీ రాజస్థాన్‌లో ఇప్పటికే మిస్డ్‌ కాల్స్‌తో మెంబర్‌షిప్‌ డ్రైవ్‌ని చేపట్టింది. గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు ‘గ్రామ్‌ సంపర్క్‌ అభియాన్‌’కి శ్రీకారం చుట్టి స్థానికులతో సత్సంబంధాలను మెయిన్‌టెయిన్‌ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లో మాదిరిగానే రాజస్థాన్‌లోనూ ఆప్‌ రాణిస్తుందా అనే ఆసక్తి నెలకొంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Aam Aadmi Party
  • aap mp
  • opposition party bjp
  • punjab aap strategist
  • rajasthan politics

తాజావార్తలు

  • Ragi Samosa: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. హెల్తీ ‘రాగి సమోసా’ను ‘సింపుల్‌గా ఇలా ట్రై చేయండి!

  • Tamil Politics: విజయ్‌పై మొదలైన డీఎంకే విమర్శలు.. ఏం జరిగిందంటే..?

  • RCB vs MI : RCB బౌలర్ల ధాటికి ముంబై తడబాటు.. భువనేశ్వర్ కుమార్ ‘నాలుగు’ వికెట్ల పంజా.!

  • PM Modi: పవన్ ఇంటికి ప్రధాని మోడీ.. సోషల్ మీడియాలో ఫ్యామిలీ పిక్ వైరల్! ఫోటో చూశారా..

  • PM Modi: మే 15 లోపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగొచ్చా.. మోడీ వ్యాఖ్యల ఆంతర్యం ఏమిటి.?

ట్రెండింగ్‌

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions