Cruel Mother: నువ్వసలు తల్లివేనా.. కాలేనూనెలో నాలుగు రోజుల చిన్నారి వేళ్లు పెడతావా ఛీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cruel Mother: శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వృద్ధి చెందిన రోజుల్లో ప్రజలు మూఢ విశ్వాసాలు కలిగి ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అనేకమంది శాస్త్రవేత్తల కృషి ఫలితంగా పలు ఆవిష్కరణలు జరిగాయి. మనం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు సైన్సు పరిష్కారం చూపుతుంది. సైన్స్ వాస్తవంపై ఆధారపడి పనిచేస్తుంది. మతం నమ్మకం ఆధారంగా నడుస్తోంది. ఈ రోజుల్లో మూఢనమ్మకాలేంటి అనుకుంటామా.. ప్రజలు మాత్రం వాటిని వదలట్లేదు. వారసత్వ సంపదలా కొనసాగిస్తున్నారు. ఇలాంటి ప్రభావం అప్పుడే పుట్టిన పిల్లలపై చూపుతున్నారు తల్లిదండ్రులు. శిశువులపై చూపడమే కాదు మూఢనమ్మకాలతో వారిపై ప్రయోగాలు కూడా చేయడం ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే కొంతమంది ఒకమెట్టు పైకి ఎక్కి పుట్టిన బిడ్డ గురించి ఆలోచించడం మంచిదే కానీ..మూఢనమ్మకాలకు పోయి బిడ్డ వేళ్లను కాగే నూనెలో పెట్టిన వైనం సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని బారాబంకి జిల్లా ఫతేపూర్ లో చోటుచేసుకుంది.
Read also: Assam Floods: అస్సాంను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వరదలు.. నిరాశ్రయులైన 34 వేల మంది
Also Read
- PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
- Mohan Bhagwat: రిజర్వేషన్లు కొనసాగాలి, వారు వదులుకోవాలి: ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
- Mohan Bhagwat: స్వలింగ వివాహాలపై మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు
- Agni-4 Ballistic Missile: పాకిస్తాన్ మొత్తం భారత పరిధిలో.. అగ్ని-4 మిస్సైల్ సక్సెస్..
ఉత్తరప్రదేశ్లోని బారాబంకి జిల్లా ఫతేపూర్ ప్రాంతంలోని ఇస్రౌలీ గ్రామానికి చెందిన ఇర్ఫాన్, ఆసియా బానో దంపతులకు ఈ నెల 11న ఫతేపూర్ ఆరోగ్య కేంద్రంలో నిండు మగబిడ్డ జన్మించాడు. మొదటి 3-4 రోజులు ఆరోగ్యంగా ఉన్న చిన్నారి.. ఆ తర్వాత తల్లి పాలు తాగలేదు. దీంతో ఆసియా తీవ్ర ఆందోళనకు గురైంది. ఏం చేయాలో తోచక, హాస్పిటల్ స్టాఫ్ కు ఆమె సలహా అడిగింది. దీంతో ఆ స్టాఫ్ ఓ సలహా ఇవ్వడంతో వెనక ముందు ఆలోచించకుండా సలహాలను పాటించింది. ఇంతకీ ఆసుపత్రి వారు ఏం సలహా ఇచ్చారో తెలుసా? పుట్టిన బిడ్డ వేళ్లను కాగే నూనెలో పెట్టాలని. ఇది విన్న మనమే ఆశ్చర్యపోతుంటే.. ఆ తల్లి ఒక్కసారి కూడా ఆలోచించకుండా కాగే నూనెలో ఆ పశికందు వెళ్లు పెట్టడంతో ఆ చిన్నారి గట్టిగా కేకలు వేసింది.
నైట్ డ్యూటీలో ఉన్న నర్సు దీన్ని గమనించి వైద్యుడికి ఫిర్యాదు చేసింది. వెంటనే చిన్నారికి చికిత్స అందించిన వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు. గతంలో పాలు లేకపోవడంతో ఇద్దరు పిల్లలను కోల్పోయిన ఆసియా.. ఆ భయంతోనే ఈ చర్యకు పాల్పడింది సమాచారం. అయితే ఇలాంటి ముఢనమ్మకాలు ఇప్పుడు కూడా నమ్మటం ఏంటిని పలువురు నెట్టిజన్లు ఫైర్ అవుతున్నారు. ఛీ నువ్వసలు తల్లివేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలోనే ఈ దారుణ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.
Vizag MP Family Kidnap Case: కిడ్నాప్ కేసులో కీలక ట్విస్ట్.. ప్రియురాలికి రూ.40 లక్షలు
తాజావార్తలు
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!