Operation Sindoor: ఆపరేషన్ సిందూర్తో పాక్లో 9 విమానాలు ధ్వంసం! ఆధారాలివే!
- ఆపరేషన్ సిందూర్తో పాక్లో 9 విమానాలు ధ్వంసం!
- ఉపగ్రహ చిత్రాల ద్వారా దృశ్యాలు వెలుగులోకి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా మే 7న భారత్.. పాకిస్థాన్పై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఈ ఆపరేషన్లో 100 మంది ఉగ్రవాదులు హతం కాగా.. పాకిస్థాన్ వైమానిక స్థావరాలు నాశనం అయ్యాయి. తాజాగా పాకిస్థాన్కు చెందిన 9 విమానాలు ధ్వంసం అయినట్లుగా సమాచారం అందుతోంది. వైమానిక స్థావరాలతో పాటు సైనిక ఆస్తులకు భారీగా నష్టం వాటిల్లినట్లు వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇది కూడా చదవండి: Spying: జ్యోతి మల్హోత్రాతో సంబంధం ఉన్న మరో యూట్యూబర్ అరెస్ట్
Also Read
- Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
- Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
- India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
- TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసిన TGPSC..
పాకిస్థాన్ వైమానికి దళానికి చెందిన ఆరు యుద్ధ విమానాలు, రెండు ఖరీదైన నిఘా విమానాలు, పదికి పైగా సాయుధ డ్రోన్లు, ఒక సీ -130 పెర్క్యులస్ రవాణా విమానం ధ్వంసం అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
నాలుగు రోజుల పాటు సాగిన ఆపరేషన్ సిందూర్లో అధిక విలువ కలిగిన రెండు ఎయిర్బోర్న్ విమానాలు నాశనం అయినట్లు సమాచారం. ఇక పాకిస్థాన్ భోలారి వైమానిక స్థావరంలో ఉంచిన స్వీడిష్ మూలానికి చెందిన మరో ఏఈడబ్లయూసీ విమానం.. ఉపరితల క్రూయిజ్ క్షిపణి దాడిలో ధ్వంసమైందని తెలుస్తోంది. ఇది పూర్తిగా ధ్వంసమైనట్లు ఉపగ్రహ చిత్రాల ద్వారా అర్థమవుతోంది.
ఇది కూడా చదవండి: Good Wife : ఏకంగా ఏడు భాషల్లో ప్రియమణి ‘గుడ్ వైఫ్’ వెబ్ సిరీస్..
ఇక పాకిస్థాన్ పంజాబ్పై లక్ష్యంగా చేసుకున్న డ్రోన్ దాడిలో పీఏఎఫ్ సీ-130 హెర్క్యులస్ విమానం ధ్వంసమైనట్లు ప్రత్యేక ఆపరేషన్లో తేలింది. ఈ C-130 విమానం లాజిస్టికల్ సపోర్ట్ కోసం ఉపయోగించబడుతుంది. డ్రోన్ దాడి జరిగినప్పుడు ముల్తాన్ సమీపంలోని ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్ దగ్గర నిలిపి ఉంచారని వర్గాలు తెలిపాయి.
పహల్గామ్ ఉగ్ర దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. అనంతరం భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంది. సింధు జలాలు నిలిపేసింది. వీసాలను రద్దు చేసింది. అటారీ సరిహద్దు నిలిపేసింది. ఇక మే 7న ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఈ దాడిలో 100 మంది ఉగ్రవాదలు హతమయ్యారు. అంతేకాకుండా పాకిస్థాన్ వైమానిక స్థావరాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. దీంతో దాయాది దేశం కాళ్ల బేరానికి రావడంతో భారత్ కాల్పుల విరమణకు అంగీకరించింది.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!