Cancer Injection: భారత్లో 7 నిమిషాల్లో క్యాన్సర్ ఇంజెక్షన్.. కానీ ధర వింటే షాక్.
- 7 నిమిషాల్లో క్యాన్సర్ ఇంజెక్షన్..
- రోష్ ఫార్మా ఇండియా ‘టెసెంట్రిక్’ ఇమ్యునోథెరపీ ఇంజెక్షన్..
- ఒక్క డోస్ ధర రూ.3.7 లక్షలు..
- లంగ్ క్యాన్సర్కు ఉపయోగపడే ఇంజెక్షన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cancer Injection: క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్. క్యాన్సర్ సోకితే పలు దశల్లో చేయించుకునే ‘‘కీమో థెరపీ’’ బాధల నుంచి విముక్తి కలిగించే చికిత్స విధానం వచ్చింది. భారత్లో లంగ్ క్యాన్సర్కు కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ఫార్మా సంస్థ రోష్ ఫార్మా ఇండియా ‘‘టెసెంట్రిక్’’ అనే కొత్త ఇమ్యునోథెరపీ ఇంజెక్షన్ను తీసుకువచ్చింది. ఇది కేవలం 7 నిమిషాల్లోనే పూర్తవుతుంది. వెంటనే పని ప్రారంభిస్తుంది.
ఇప్పటి వరకు ఇమ్యునోథెరపీ కోసం రోగులు గంటల తరబడి ఐవీ ద్వారా మందులు ఎక్కించుకోవాల్సి వచ్చేది. కానీ ఈ ఇంజెక్షన్ వల్ల చికిత్స సమయం భారీగా తగ్గుతుంది. ఈ కొత్త ఇంజెక్షన్ ముఖ్యంగా నాన్-స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ (NSCLC) బాధితులకు ఉపయోగపడనుంది. భారతదేశంలో ఎక్కువగా కనిపించే లంగ్ క్యాన్సర్లలో ఇది ఒక రకం. చికిత్స సమయం తగ్గడం, ఆస్పత్రుల్లో ఎక్కువ సేపు ఉండాల్సిన అవసరం లేకపోవడం దీని ప్రత్యేకత.
Also Read
- karnataka: మంత్రులకు శాఖలు కేటాయింపు.. డీకే.శివకుమార్ దగ్గరే కీలక శాఖ
- Delhi: ఢిల్లీ ఎయిర్పోర్టులో కలకలం.. హైదరాబాద్ ప్రయాణికుడి బ్యాగ్లో కోతి పుర్రె..
- Retail Inflation: ఉల్లి-వెల్లుల్లి ధరల మంట.. 4.45%కి చేరిన రిటైల్ ద్రవ్యోల్బణం
- Parliament Monsoon Session: భయపడొద్దు, పారిపోవద్దు.. అమిత్ షా వస్తున్నాడు..
ఎలా పనిచేస్తుంది.?
ఈ ఇంజెక్షన్లో ‘‘అటెజోలిజుమాబ్’’ అనే ఇమ్యునోథెరపీ ఔషధాన్ని ఉపయోగిస్తారు. సాధారణ కీమోథెరపీలా ఇది క్యాన్సర్ కణాలపై పనిచేయదు. దీనికి బదులుగా శరరీంలోని రోగ నిరోధక వ్యవస్థకు క్యాన్సర్ కణాలను గుర్తించి, వాటిని అంతం చేసేలా సాయపడుతుంది. సాధారణంగా క్యాన్సర్ కణాలు PD-L1 అనే ప్రోటీన్ ద్వారా ఇమ్యూన్ సిస్టమ్కు దొరక్కుండా దాక్కుంటాయి. టెసెంట్రిక్ ఆ ప్రొటీన్ను అడ్డుకుంటుంది. దీని ద్వారా మందు క్యాన్సర్ కణాలను సులభంగా గుర్తించి అటాక్ చేయగలదు. కీమోథెరపీలో మందులు ఆరోగ్యవంతమైన కణాలతో పాటు క్యాన్సర్ కణాలపై కూడా దాడి చేస్తాయి. కానీ ఈ ఇంజెక్షన్ కేవలం క్యాన్సర్ కణాలను లక్ష్యంగా చేసుకుంటుంది.
ధర వింటే షాక్..
ఇదంతా బాగానే ఉన్నా, ఈ మందు సామాన్యుడికి అందుబాటులో లేకుండా ఉంది. దీని ఒక్క డోస్ ధర రూ. 3.7 లక్షల వరకు ఉంటుంది. చాలా మంది రోగులకు 6 డోసులు అవసరం అవుతుంది. దీంతో మొత్తం ఖర్చు లక్షల్లోకి వెళ్తుంది. ఇది మధ్యతరగతి ప్రజలు భరించలేని ధర.
ఎవరికి ప్రయోజనం..?
వైద్యులు చెబుతున్న దాని ప్రకారం, ఈ మందును అందరు రోగులకు ఇవ్వరు. రోగి ట్యూమర్లో PD-L1 ప్రోటీన్ స్థాయిలను ముందుగా పరీక్షిస్తారు. ఎక్కువ డోస్ స్థాయిలో ఈ ప్రొటీన్ ఉన్న రోగులు ఈ చికిత్సకు బాగా స్పందించే అవకాశముందని చెబుతున్నారు. రోగి ఆరోగ్య స్థితి, క్యాన్సర్ దశ ఆధారంగా వైద్యులు చికిత్సను నిర్ణయిస్తారు.
తాజావార్తలు
-
Solar Eclipse 2026: మరికొన్ని గంటల్లో సూర్య గ్రహణం.. ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి..
-
karnataka: మంత్రులకు శాఖలు కేటాయింపు.. డీకే.శివకుమార్ దగ్గరే కీలక శాఖ
-
Delhi: ఢిల్లీ ఎయిర్పోర్టులో కలకలం.. హైదరాబాద్ ప్రయాణికుడి బ్యాగ్లో కోతి పుర్రె..
-
Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్ల టవర్స్.. రేపు సీఎం రేవంత్ చేతుల మీదుగా శంకుస్థాపన
-
Iran-Trump: ట్రంప్ దిగిపోయేంత వరకు పోరాడతాం.. ఇరాన్ కొత్త శపథం
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..