Chhattisgarh: దగ్గర పడుతున్న డెడ్లైన్.. 63 మంది మావోలు లొంగుబాటు
- దగ్గర పడుతున్న డెడ్లైన్
- 63 మంది మావోలు లొంగుబాటు
- ఛత్తీస్గఢ్లోని దంతెవాడలో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మావోయిస్టులకు కేంద్రం విధించిన డెడ్లైన్ దగ్గర పడుతోంది. మార్చి, 2026 నాటికి మావోయిస్టులు లేని దేశంగా మారుస్తామని కేంద్రం ప్రకటించింది. దీంతో గతేడాది నుంచి దేశ వ్యాప్తంగా మావోయిస్టుల ఏరివేత కార్యక్రమం కొనసాగుతోంది. గత సంవత్సరం అనేక మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఆ పరంపర కొత్త ఏడాదిలో కొనసాగుతోంది.
ఇది కూడా చదవండి: Silver Rates: మరోసారి సిల్వర్ హడల్.. ఈరోజు ఎంత పెరిగిందంటే..!
Also Read
- Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
- NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
- Maharashtra: ఘోర విషాదం.. ఆలయ గోడ కూలి ఆరుగురు మృతి
- UP: భర్త కోసం టవరెక్కిన మహిళ.. గంట తర్వాత ఏం జరిగిందంటే..!
తాజాగా ఛత్తీస్గఢ్లోని దంతెవాడలో 63 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో 36 మందిపై మొత్తం రూ. 1.19 కోట్ల బహుమతి ఉందని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఏడుగురిలో ఒక్కొక్కరికి రూ. 8 లక్షల రివార్డు ఉందని.. రాష్ట్ర ప్రభుత్వం పునరావాస విధానంతో ఆదుకుంటామన్నారు. వీరంతా రాష్ట్రంలోని దక్షిణ బస్తర్ డివిజన్, పశ్చిమ బస్తర్ డివిజన్, మాడ్ డివిజన్, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో చురుగ్గా ఉన్నారని చెప్పారు. 18 మంది మహిళలు సహా 63 మంది మావోలు.. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అధికారుల ముందు లొంగిపోయారని దంతెవాడ పోలీసు సూపరింటెండెంట్ గౌరవ్ రాయ్ వెల్లడించారు. 2025లో రాష్ట్రంలో 1,500 మందికి పైగా మావోలు లొంగిపోయారని పోలీసులు చెప్పారు.
ఈ పరిణామాన్ని ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి ప్రశంసించారు. బస్తర్ ప్రాంతంలో శాంతి, విశ్వాసం, అభివృద్ధి దిశగా మరో చారిత్రాత్మక మైలురాయిని సాధించారని కొనియాడారు. అందరికీ పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: Trump: జేడీ వాన్స్, మార్కో రూబియో పిల్లలకు ట్రంప్ బహుమతులు.. ఏమిచ్చారంటే..!
తాజావార్తలు
-
Pat Cummins: “ఏం పర్వాలేదు.. ప్లేఆఫ్స్కు ఇంకా ఛాన్స్ ఉందిగా”.. కెప్టెన్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!