Central Government: మహిళా ఉద్యోగులకు గుడ్న్యూస్ చెప్పిన కేంద్రం.. వారికి స్పెషల్ లీవ్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహిళా ఉద్యోగులకు మరో గుడ్న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం… ఇప్పటి వరకు మహిళలకు ప్రసూతి సెలవులు కల్పిస్తూ వచ్చిన సర్కార్.. ఇప్పుడు ప్రసవం సమయంలోగానీ.. లేదంటే పుట్టిన కాసేపటికే గానీ బిడ్డ చనిపోతే కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేసే మహిళా ఉద్యోగులకు సెలవులు ఇవ్వాలని నిర్ణయించింది.. డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ తాజాగా విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం.. బిడ్డ పుట్టిన వెంటనే చనిపోతే.. ఆ తల్లి జీవితంపై తీవ్ర ప్రభావం పడుతుందని, అందువల్ల కలిగే మానసిక క్షోభను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీవోపీటీ పేర్కొంది… ఈ విషయంలో ప్రభుత్వానికి విజ్ఞప్తులు వస్తున్న తరుణంలో.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖతో సంప్రదించాకే ఈ ఆదేశాలు జారీ చేస్తున్నట్టు వెల్లడించింది..
Read Also: Pothina Venkata Mahesh: జనసేన నేత అరెస్ట్.. తెల్లవారుజామున 3 గంటలకు విడుదల
Also Read
- Central Government Schemes: రైతులకు 3 అద్భుత కేంద్ర పథకాలు.. ఏటా రూ.6,000.. నెలకు రూ.3,000 పెన్షన్..!
- Amritsar ASI Harjit Singh: ASI హర్జీత్ సింగ్ హత్య కేసులో కీలక పరిణామం.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
- Saurav Gurjar: పెళ్లి పేరుతో మోసం.. ప్రముఖ నటుడు, రెజ్లర్ సౌరవ్ గుజ్జార్ అరెస్ట్..
- El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
అయితే, ఒకవేళ సంబంధిత ఉద్యోగినికి మెటర్నీటీ లీవులు ఉంటే.. అవి వర్తింపజేయనున్నారు.. లేని ఎడల 60 రోజుల ప్రత్యేక మెటర్నిటీ లీవులు వర్తిస్తాయని కేంద్రం స్పష్టం చేసింది.. అలాగే బిడ్డ పుట్టిన వెంటనే మరణించే పరిస్థితిని పుట్టిన 28 రోజుల వరకు నిర్వచించవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది కేంద్రం.. 28 వారాల గర్భధారణ సమయంలో లేదా దాని తర్వాత ఎటువంటి జీవిత సంకేతాలు లేకుండా జన్మించిన శిశువును ప్రసవంగా నిర్వచించవచ్చని తెలిపింది. ప్రత్యేక ప్రసూతి సెలవుల ప్రయోజనం ఇద్దరు పిల్లల కంటే తక్కువ జీవించి ఉన్న మహిళా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి మాత్రమే మరియు అధీకృత ఆసుపత్రిలో పిల్లల ప్రసవానికి మాత్రమే అనుమతించబడుతుందని పేర్కొంది. అధీకృత ఆసుపత్రిని ప్రభుత్వ ఆసుపత్రి లేదా కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (CGHS) కింద ఎంప్యానెల్ చేయబడిన ప్రైవేట్ ఆసుపత్రిగా నిర్వచించారు. ఎంప్యానెల్ లేని ప్రైవేట్ ఆసుపత్రిలో అత్యవసర ప్రసవాల విషయంలో, అత్యవసర ధృవీకరణ పత్రం తప్పనిసరి అని డీఓపీటీ ఉత్తర్వుల్లో పేర్కొంది. సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (సెలవులు) రూల్స్ 1972లోని రూల్ 2 ప్రకారం యూనియన్ ఆఫ్ ఇండియా వ్యవహారాలకు సంబంధించి సివిల్ సర్వీసెస్ మరియు పోస్ట్లకు నియమించబడిన ప్రభుత్వ ఉద్యోగులకు ఈ ఆర్డర్ జారీ చేసిన తేదీ నుండి ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి.
తాజావార్తలు
-
The Vvaan: 400 ఏళ్ల ఆలయంలో సిద్ధార్థ్, తమన్నా ప్రత్యేక పూజలు.. గుడి మిస్టరీతోనే వస్తున్న కొత్త సినిమా
-
Smriti Mandhana: పరుగుల రారాణి స్మృతి మంధాన.. టీ20 క్రికెట్లో అరుదైన ఘనత..!
-
Irumudi OTT: ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న ‘ఇరుముడి’.. నెట్ఫ్లిక్స్లో నెం.1గా ట్రెండింగ్!
-
Oppo A7 Pro Max 5G: ఒప్పో A7 Pro Max 5G గ్లోబల్ లాంచ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా!
-
Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!