Central Government: మహిళా ఉద్యోగులకు గుడ్న్యూస్ చెప్పిన కేంద్రం.. వారికి స్పెషల్ లీవ్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహిళా ఉద్యోగులకు మరో గుడ్న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం… ఇప్పటి వరకు మహిళలకు ప్రసూతి సెలవులు కల్పిస్తూ వచ్చిన సర్కార్.. ఇప్పుడు ప్రసవం సమయంలోగానీ.. లేదంటే పుట్టిన కాసేపటికే గానీ బిడ్డ చనిపోతే కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేసే మహిళా ఉద్యోగులకు సెలవులు ఇవ్వాలని నిర్ణయించింది.. డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ తాజాగా విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం.. బిడ్డ పుట్టిన వెంటనే చనిపోతే.. ఆ తల్లి జీవితంపై తీవ్ర ప్రభావం పడుతుందని, అందువల్ల కలిగే మానసిక క్షోభను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీవోపీటీ పేర్కొంది… ఈ విషయంలో ప్రభుత్వానికి విజ్ఞప్తులు వస్తున్న తరుణంలో.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖతో సంప్రదించాకే ఈ ఆదేశాలు జారీ చేస్తున్నట్టు వెల్లడించింది..
Read Also: Pothina Venkata Mahesh: జనసేన నేత అరెస్ట్.. తెల్లవారుజామున 3 గంటలకు విడుదల
Also Read
- IIT Deaths: ఐఐటీల్లో ఈ చావులు వెనుక ఉన్న కారణాలేంటి? విద్యార్థులను బలి తీసుకుంటుంది ఎవరు?
- NEET Counselling 2026: NEET కౌన్సెలింగ్ తొలి విడతలో సీటు రాకపోవడంతో.. 21 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య
- High Court Slams FDA: ‘మీరేమైన దేవుడు అనుకుంటున్నారా..?’ ఎఫ్డీఏకు హైకోర్టు షాక్..!
- India’s New Time Rule: ISTపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా కొత్త టైమ్ రూల్స్.. ఎప్పటినుంచంటే?
అయితే, ఒకవేళ సంబంధిత ఉద్యోగినికి మెటర్నీటీ లీవులు ఉంటే.. అవి వర్తింపజేయనున్నారు.. లేని ఎడల 60 రోజుల ప్రత్యేక మెటర్నిటీ లీవులు వర్తిస్తాయని కేంద్రం స్పష్టం చేసింది.. అలాగే బిడ్డ పుట్టిన వెంటనే మరణించే పరిస్థితిని పుట్టిన 28 రోజుల వరకు నిర్వచించవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది కేంద్రం.. 28 వారాల గర్భధారణ సమయంలో లేదా దాని తర్వాత ఎటువంటి జీవిత సంకేతాలు లేకుండా జన్మించిన శిశువును ప్రసవంగా నిర్వచించవచ్చని తెలిపింది. ప్రత్యేక ప్రసూతి సెలవుల ప్రయోజనం ఇద్దరు పిల్లల కంటే తక్కువ జీవించి ఉన్న మహిళా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి మాత్రమే మరియు అధీకృత ఆసుపత్రిలో పిల్లల ప్రసవానికి మాత్రమే అనుమతించబడుతుందని పేర్కొంది. అధీకృత ఆసుపత్రిని ప్రభుత్వ ఆసుపత్రి లేదా కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (CGHS) కింద ఎంప్యానెల్ చేయబడిన ప్రైవేట్ ఆసుపత్రిగా నిర్వచించారు. ఎంప్యానెల్ లేని ప్రైవేట్ ఆసుపత్రిలో అత్యవసర ప్రసవాల విషయంలో, అత్యవసర ధృవీకరణ పత్రం తప్పనిసరి అని డీఓపీటీ ఉత్తర్వుల్లో పేర్కొంది. సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (సెలవులు) రూల్స్ 1972లోని రూల్ 2 ప్రకారం యూనియన్ ఆఫ్ ఇండియా వ్యవహారాలకు సంబంధించి సివిల్ సర్వీసెస్ మరియు పోస్ట్లకు నియమించబడిన ప్రభుత్వ ఉద్యోగులకు ఈ ఆర్డర్ జారీ చేసిన తేదీ నుండి ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి.
తాజావార్తలు
-
Venus Enters Libra: సెప్టెంబర్ 2 నుంచి ఈ 4 రాశుల వారికి అదృష్టమే అదృష్టం.. ఉద్యోగం, డబ్బు, వాహనం కొనుగోలు యోగం!
-
Skincare Tips: బ్యూటీ పార్లర్కు బై బై చెప్పండి!.. ఇంట్లోనే సహజంగా ముఖానికి మెరుపు తెచ్చే 3 టిప్స్ ఇవే..
-
Spy Action Thriller: థియేటర్లలో పట్టించుకోలేదు.. ఓటీటీలో నంబర్ 1 ట్రెండింగ్ లో స్పై యాక్షన్ థ్రిల్లర్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Nepal Floods: “నువ్వు దేవుడు సామీ”.. వరదల్లో 1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన ప్రిన్సిపాల్
ట్రెండింగ్
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!