Central Government: మహిళా ఉద్యోగులకు గుడ్న్యూస్ చెప్పిన కేంద్రం.. వారికి స్పెషల్ లీవ్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహిళా ఉద్యోగులకు మరో గుడ్న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం… ఇప్పటి వరకు మహిళలకు ప్రసూతి సెలవులు కల్పిస్తూ వచ్చిన సర్కార్.. ఇప్పుడు ప్రసవం సమయంలోగానీ.. లేదంటే పుట్టిన కాసేపటికే గానీ బిడ్డ చనిపోతే కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేసే మహిళా ఉద్యోగులకు సెలవులు ఇవ్వాలని నిర్ణయించింది.. డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ తాజాగా విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం.. బిడ్డ పుట్టిన వెంటనే చనిపోతే.. ఆ తల్లి జీవితంపై తీవ్ర ప్రభావం పడుతుందని, అందువల్ల కలిగే మానసిక క్షోభను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీవోపీటీ పేర్కొంది… ఈ విషయంలో ప్రభుత్వానికి విజ్ఞప్తులు వస్తున్న తరుణంలో.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖతో సంప్రదించాకే ఈ ఆదేశాలు జారీ చేస్తున్నట్టు వెల్లడించింది..
Read Also: Pothina Venkata Mahesh: జనసేన నేత అరెస్ట్.. తెల్లవారుజామున 3 గంటలకు విడుదల
Also Read
- Chhattisgarh Congress: ఛత్తీస్గఢ్లోని కాంగ్రెస్ ఆఫీస్లో వింతైన ఘటన.. నల్లాలు దొంగిలించి.. నేలపై 'లవ్ యూ' నోట్!
- Bhojshala Case: "భోజ్శాల ఆలయం కాదు".. హైకోర్టు తీర్పుపై కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు..
- Bangladesh: ‘‘గంగా నది’’పైనే భారత సంబంధాలు ఆధారపడుతాయి..
- VD Satheesan Oath Ceremony: రేపే కేరళంలో కొలువుదీరనున్న కొత్త సర్కార్.. చీఫ్ గెస్ట్లు వీరే!
అయితే, ఒకవేళ సంబంధిత ఉద్యోగినికి మెటర్నీటీ లీవులు ఉంటే.. అవి వర్తింపజేయనున్నారు.. లేని ఎడల 60 రోజుల ప్రత్యేక మెటర్నిటీ లీవులు వర్తిస్తాయని కేంద్రం స్పష్టం చేసింది.. అలాగే బిడ్డ పుట్టిన వెంటనే మరణించే పరిస్థితిని పుట్టిన 28 రోజుల వరకు నిర్వచించవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది కేంద్రం.. 28 వారాల గర్భధారణ సమయంలో లేదా దాని తర్వాత ఎటువంటి జీవిత సంకేతాలు లేకుండా జన్మించిన శిశువును ప్రసవంగా నిర్వచించవచ్చని తెలిపింది. ప్రత్యేక ప్రసూతి సెలవుల ప్రయోజనం ఇద్దరు పిల్లల కంటే తక్కువ జీవించి ఉన్న మహిళా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి మాత్రమే మరియు అధీకృత ఆసుపత్రిలో పిల్లల ప్రసవానికి మాత్రమే అనుమతించబడుతుందని పేర్కొంది. అధీకృత ఆసుపత్రిని ప్రభుత్వ ఆసుపత్రి లేదా కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (CGHS) కింద ఎంప్యానెల్ చేయబడిన ప్రైవేట్ ఆసుపత్రిగా నిర్వచించారు. ఎంప్యానెల్ లేని ప్రైవేట్ ఆసుపత్రిలో అత్యవసర ప్రసవాల విషయంలో, అత్యవసర ధృవీకరణ పత్రం తప్పనిసరి అని డీఓపీటీ ఉత్తర్వుల్లో పేర్కొంది. సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (సెలవులు) రూల్స్ 1972లోని రూల్ 2 ప్రకారం యూనియన్ ఆఫ్ ఇండియా వ్యవహారాలకు సంబంధించి సివిల్ సర్వీసెస్ మరియు పోస్ట్లకు నియమించబడిన ప్రభుత్వ ఉద్యోగులకు ఈ ఆర్డర్ జారీ చేసిన తేదీ నుండి ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి.
తాజావార్తలు
-
Virat Kohli: అరుదైన రికార్డు సాధించిన విరాట్ కోహ్లీ.. చరిత్ర పుటల్లో ఒకే ఒక్కడుగా..
-
US-Iran War: ఇరాన్కు అమెరికా 5 షరతులు.. యురేనియం ఇవ్వాలని డిమాండ్..
-
Satish Kilaru: ‘పెద్ది’లో సుకుమార్ ఇన్వాల్వ్మెంట్..? లాస్ట్ డే డైరెక్టర్ బుచ్చిబాబు చాలా ఎమోషనల్ అయ్యారు!
-
AP Government: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. జూన్ 12 నుంచి ప్రారంభం..
-
PBKS Vs RCB: కోహ్లీ, వెంకటేశ్ అయ్యర్ వీర విహారం.. భారీ స్కోర్ సాధించిన ఆర్సీబీ..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..