Site icon NTV Telugu

రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఐదుగురు జవాళ్ల వీర మరణం

జమ్మూ అండ్ కాశ్మీర్‌లో మరోసారి రెచ్చిపోయారు ఉగ్రవాదులు.. పూంచ్‌ సెక్టార్‌లో జరిగిన ఉగ్రవాదుల కాల్పుల్లో ఐదుగురు జవాన్లు వీరమరణం పొందారు.. ఇవాళ ఉదయం పూంచ్‌ సెక్టార్‌లో జవాన్లు-ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.. ఓ జూనియర్‌ కమిషన్డ్‌ అధికారి సహా నలుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. టెర్రరిస్టుల కోసం ఆర్మీ, స్థానిక పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. పూంచ్‌ సెక్టార్‌లో ఉగ్రవాదుల ఏరివేతకు సైనిక బృందం వెళ్లిన సమయంలో ఎదురుకాల్పులుకు తెగబడ్డారు ఉగ్రవాదులు.

Exit mobile version