UPI: పండగ సీజన్ వేళ.. 42 శాతం మంది యూపీఐ చెల్లింపులకే మొగ్గు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UPI: పండగ సీజన్ ప్రారంభమైంది. వినాయచవతి, దసరా, దీపావళి ఇలా వరసగా పండగలు వస్తుండటంతో దేశవ్యాప్తంగా బిజినెస్ పుంజుకుంటోంది. ఇప్పటికే అన్ని ఆన్లైన్ షాపింగ్ ఫ్లాట్ఫారంలతో పాటు అనేక షాపింగ్ మాల్స్ ఆఫర్లతో అదరగొడుతున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా డిజిటల్ చెల్లింపులపై నిర్వహించిన ఓ సర్వేలో 42 శాతం వినియోగదారులు తమ చెల్లింపుల కోసం యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్(UPI)ని వాడుతామని చెప్పారు. దీనికి అదనంగా 57 శాతం మంది రివార్డులు, క్యాష్ బ్యాక్ ని పొందడం కోసం యూపీఐ ఆధారిత డిజిటల్ చెల్లింపులు చేస్తామని అన్నారు. అమెజాన్ ఇండియా తరుపున నీల్సన్ మీడియా ఇండియా నివేదిక ఈ వివరాలను వెల్లడించింది.
Read Also: Interpol: ఖలిస్తాన్ ఉగ్రవాది కరణ్వీర్ సింగ్పై ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసులు
Also Read
- Car Accident: యమునా ఎక్స్ప్రెస్వేపై దారుణం.. కదులుతున్న జాగ్వార్ కారులో అగ్నిప్రమాదం..
- Lalu-Rabri Security: లాలూ, రబ్రీదేవికి జెడ్ ప్లస్ భద్రత తొలగింపు.. కర్రలతో కాపలా కాస్తోన్న కార్యకర్తలు
- Shocking: బెడ్షీట్పై ‘‘మేడ్ ఇన్ పాకిస్తాన్’’ ట్యాగ్.. పూణే ఘటనపై పోలీసులు విచారణ..
- PM Modi: ప్రపంచ సంక్షోభం నేపథ్యంలో ఆర్థిక సలహా మండలితో మోడీ భేటీ.. ఏం చర్చించారంటే..!
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ప్రకారం, UPI ఆధారిత చెల్లింపులు ఆగస్టులో మొదటిసారిగా 10 బిలియన్ నెలవారీ లావాదేవీలను దాటాయి. యూపీఐ నెలవారీ లావాదేవీల సంఖ్య రూ. 15.18 ట్రిలియన్ల నికర లావాదేవీల విలువతో 10.24 బిలియన్ల లావాదేవీలు జరిగాయి. సర్వే ప్రకారం దాదాపుగా 75 శాతం మంది ఎలక్ట్రానిక్ వస్తువలైన స్మార్ట్ ఫోన్లు, టీవీలు, రిఫ్రిజరేటర్లు, ఏసీల కొనుగోలుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు తేలింది. బ్యూటీ బ్రాండ్స్, హోమ్ ఫర్నిషింగ్ ఐటెమ్స్ ను కొనుగోలు చేస్తామని వినియోగదారులు చెబుతున్నారు.
మెట్రోపాలిటన్ నగరాల్లో 87 శాతం, టైర్ -2 నగరాల్లో 86 శాతం మంది వినియోగదారులు పండగ కోసం వినియోగదారులు ఆన్ లైన్ షాపింగ్ చేయడానికి ఇష్టపడుతున్నట్లు సర్వేలో తేలింది. 70 శాతం కంటే ఎక్కువ మంది వినియోగదారులు ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేయడానికి ఆన్ లైన్ షాపింగ్ ఈవెంట్ల కోసం ఎదురుచూస్తున్నారని సర్వే తెలిపింది. 80 శాతం మంది ఆన్ లైన్ షాపింగ్ ఈవెంట్లలో దుస్తులు, ఫుట్ వేర్ కొనుగోలు చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. 140 కోట్ల జనాభా ఉన్న దేశంలో ఈ ఏడాది పండగ సీజర్ లో 90,000 కోట్ల విలువైన ఆన్లైన్ గ్రాస్ మర్చండైజ్ విలువ (GMV)ని చూసే అవకాశం ఉంది. మార్కెట్ రీసెర్చ్ సంస్థ రెడ్సీర్ స్ట్రాటజీ కన్సల్టెంట్స్ తాజా నివేదిక ప్రకారం ఇది గతేడాది పండుగ నెల అమ్మకాలతో పోలిస్తే 18-20 శాతం పెరిగిందని తెలిపింది.
తాజావార్తలు
-
Car Accident: యమునా ఎక్స్ప్రెస్వేపై దారుణం.. కదులుతున్న జాగ్వార్ కారులో అగ్నిప్రమాదం..
-
KL Rahul: కేఎల్ రాహుల్ అద్భుత సెంచరీ.. ఆ రికార్డుల జాబితాలోకి చేరిక..
-
Fake Job Offers: ఫేక్ జాబ్ ఆఫర్స్ గుర్తించడం ఎలా? ఈ సంకేతాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడండి.!
-
Lalu-Rabri Security: లాలూ, రబ్రీదేవికి జెడ్ ప్లస్ భద్రత తొలగింపు.. కర్రలతో కాపలా కాస్తోన్న కార్యకర్తలు
-
Shocking: బెడ్షీట్పై ‘‘మేడ్ ఇన్ పాకిస్తాన్’’ ట్యాగ్.. పూణే ఘటనపై పోలీసులు విచారణ..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!