Parliament Security Breach: “ప్రధాని మోడీ ‘మిస్సింగ్ పర్సన్’ అంటూ కరపత్రాలు”.. పార్లమెంట్ చొరబాటుదారులకు వారం కస్టడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Parliament Security Breach: బుధవారం రోజున జరిగిన పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన ఘటన దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. 2001లో పార్లమెంట్పై ఉగ్రదాడి జరిగిన డిసెంబర్ 13 రోజునే, నలుగురు నిందితులు పార్లమెంట్ ఘటనకు పాల్పడ్డారు. ఇద్దరు నిందితులు విజిటర్ పాసులతో పార్లమెంట్లోకి వెళ్లారు. సభ జరుగుతున్న సమయంలో విజిటర్ గ్యాలరీ నుంచి దూసి ఛాంబర్ వైపు దూసుకెళ్తూ, పొగ డబ్బాలను పేల్చారు. మరో ఇద్దరు పార్లమెంట్ వెలుపల ఇదే తరహా చర్యలకు పాల్పడ్డారు. నలుగురు నిందితులతో పాటు మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేయగా.. ఈ దాడికి ప్రధాన సూత్రధారిగా అనుమానిస్తున్న లలిత్ ఝా అనే వ్యక్తి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.
Read Also: MK Stalin: హిందీ జాతీయ భాష కాదు.. తమిళ మహిళపై వేధింపుల తర్వాత స్టాలిన్ కీలక వ్యాఖ్యలు..
Also Read
- West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
- LPG Demand Drop: అమాంతం పడిపోయిన LPG వినియోగం.. పెట్రోల్, డీజిల్ రివర్స్.. !
- DK.Shivakumar: ముఖ్యమంత్రిగా యువతపై డీకే.శివకుమార్ వరాల జల్లు.. విద్యార్థులందరికీ ఫ్రీ బస్ పాస్లు
- Sourav Ganguly: దాదాకు షాక్.. గంగూలీ భద్రతను తగ్గించిన బెంగాల్ ప్రభుత్వం
ఇదిలా ఉంటే భారీ భద్రతా ఉల్లంఘనకు పాల్పడిన నలుగురు వ్యక్తులను విచారించడానికి 7 రోజుల పోలీస్ కస్టడీకి పంపబడ్డారు. లోక్ సభ లోపల పట్టుబడిన సాగర్ శర్మ, డి మనోరంజన్తో పాటు వెలుపల అరెస్టైన నీలం దేవీ, అమోల్ షిండేలను ప్రశ్నించాలని ఢిల్లీ పోలీసులు కోర్టులో తన వాదనలు వినిపించారు. మరో కీలక నిందితుడు లలిత్ ఝా కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. ఇతను నలుగురు నిందితుల మొబైల్ ఫోన్లతో పరారయ్యాడు. సాక్ష్యాలను ధ్వంసం చేయాలనే ఉద్దేశంతోనే ఇలా చేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
నలుగురిపై ఉగ్రవాద వ్యతిరేక UAPA, ఐపీసీ సెక్షన్ల కింద అభియోగాలు నమోదయ్యాయి. నలుగురు జరిపిన దాడి ఉగ్రదాడిగా ఉందని, ఈ సంఘటనలో ఉగ్రవాద సంస్థ ప్రమేయం ఏదైనా ఉందా..? అని దర్యాప్తు చేయాలని పోలీసులు కోర్టులో వాదించారు. నిందితులు తమ బూట్లలో పొగ కానిస్టర్లను తీసుకువచ్చారని, నిందితులు లక్నోలో కొత్త షూ జతలను కొనుగోలు చేసి తీసుకువచ్చారని పోలీసులు తెలిపారు. డబ్బాలను ముంబైలో కొనుగోలు చేశారని వెల్లడించారు. దీంతో పాటు ప్రధాని నరేంద్రమోడీని ‘మిస్సింగ్ పర్సన్’గా చెబుతూ కరపత్రాలు, అతని వివరాలను చెబితే స్విస్ బ్యాంక్ నుంచి నగదు ఇస్తామంటూ అందులో పేర్కనడం వంటివి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు ఢిల్లీ పోలీసులు. అయితే ఓ సామాన్యుడు ఇలాంటి ప్రణాళికతో పనిచేయలేడు కాబట్టి ఇందులో ఎక్కువ మంది ప్రమేయం ఉన్నట్లు పోలీసులు కోర్టుకు తెలిపారు. ప్రత్యేక న్యాయమూర్తి హర్దీప్ కౌర్ ముందు పోలీసులు 15 రోజుల కస్టడీ కోరగా.. వారం రోజులు గడువు ఇచ్చారు.
తాజావార్తలు
-
Neem Juice Daily : వేప రసం మంచిదే.. కానీ రోజూ తాగితే ఈ ప్రమాదాలు తప్పవు.!
-
Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
-
Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
-
West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
-
Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!