Site icon NTV Telugu

Jammu Kashmir: కాశ్మీర్‌లో ముగ్గురు నాన్ లోకల్స్‌పై ఉగ్రవాదుల కాల్పులు

Jammu Kashmir

Jammu Kashmir

Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ లో మరోసారి ఉగ్రవాదులు దుశ్చర్యకు పాల్పడ్డారు. ఈ రోజు షోపియాన్‌లో ముసుగులు ధరించిన ఇద్దరు ఉగ్రవాదులు, ముగ్గురిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో గాయపడిన వారంతా స్థానికేతరులుగా గుర్తించారు. కూలీ పనికోసం కాశ్మీర్ వచ్చారు. ఘటన జరిగిన వెంటనే వీరిని వైద్యం కోసం శ్రీనగర్‌లోని ఎస్‌ఎంహెచ్‌ఎస్‌ ఆస్పత్రికి తరలించారు. బాధితులను అన్వాల్ థోకర్, హీరాలాల్, పాంటూలుగా గుర్తించారు. అప్రమత్తమైన భద్రతా బలగాలు ఏరియాను చుట్టుముట్టి కార్డన్ సెర్చ్ చేస్తున్నాయి. టెర్రిరిస్టుల కోసం వెతుకుతున్నట్లు కాశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు.

Read Also: Chandrayaan-3: ఇండియాకు చంద్రయాన్-3 గేమ్ ఛేంజర్.. మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్..

ఇటీవల కాలంలో కాశ్మీర్ వ్యాప్తంగా ఉగ్రవాదులను సైన్యం, భద్రతాబలగాలు ఏరిపారేస్తున్నాయి. మరోవైపు పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి ఉగ్రవాదులను భారత్ లోకి పంపేందుకు పాక్ చేస్తున్న ప్రయత్నాలను భారత్ తిప్పికొడుతుంది. చొరబాటుదారులను అడ్డుకుంటోంది. ఇదిలా ఉంటే దీంతో ఏదో ఒక సంఘటన కుట్ర చేయాలని ఉగ్రవాదులు భావిస్తున్నారు. దీంతో హైబ్రీడ్ టెర్రరిజానికి పాల్పడుతున్నారు. నాన్ లోకల్స్ టార్గెట్ గా దాడులకు తెగబడుతున్నారు.

Exit mobile version