Crime: యూపీలో తల్లీకూతుళ్ల దారుణహత్య.. ముగ్గురు అన్నదమ్ములు అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒక మహిళతో పాటు ఆమె 21 ఏళ్ల కుమార్తెను హత్య చేసిన కేసులో టెంట్ హౌస్ యజమానితో పాటు అతని ఇద్దరు సోదరులను ఉత్తరప్రదేశ్లోని సుల్తాన్పూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముగ్గురు సోదరులను ఇర్ఫాన్ (టెంట్ హౌస్ యజమాని), సదన్, షెహజాద్లుగా గుర్తించారు. మృతులు శకుంతల (40), ఆమె కుమార్తె విజయలక్ష్మి(21)గా గుర్తించారు. జూన్ 29న తల్లీకూతుళ్లు తమ ఇంట్లో హత్యకు గురయ్యారు. హత్యకు ఉపయోగించిన కొడవలిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కూరగాయల వ్యాపారి అయిన శకుంతల వద్ద రోజువారీ అవసరాలు తీర్చుకోవడానికి డబ్బులు లేవని సుల్తాన్పూర్ ఎస్పీ సోమెన్ బర్మా సోమవారం తెలిపారు. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ శకుంతలతో స్నేహంగా ఉంటూ చాలా డబ్బు ఖర్చు చేశాడు. ఆమెను తన లగ్జరీ కారులో ఎక్కించుకుని వెళ్లేవాడు. అప్పుడు ఇర్ఫాన్ ఆమె 21 ఏళ్ల కుమార్తెను చూశాడు. తన కుమార్తెను తన వద్దకు పంపాలని ఇర్ఫాన్ శకుంతలను అడగడంతో.. ఆమె అతనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కుమార్తె కూడా అతని ప్రతిపాదనను తిరస్కరించింది.ఈ విషయం శకుంతల, ఇర్ఫాన్ల మధ్య సంబంధాన్ని కూడా దెబ్బతీసిందని ఎస్పీ వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ తన ఇద్దరు సోదరులతో కలిసి తల్లీ కూతుళ్లను హత్య చేయాలని ప్లాన్ చేసినట్లు ఆయన తెలిపారు. జూన్ 29న, ఇర్ఫాన్ తన ఇద్దరు సోదరులతో కలిసి ఆమె భర్త లేని సమయంలో మహిళ నివాసంలోకి ప్రవేశించి, సదన్ను బయట కాపలాగా ఉండమని కోరాడు. మిగతా ఇద్దరు లోపలికి వెళ్లి తల్లీకూతుళ్లను కొడవలితో దారుణంగా హత్య చేశారు.
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
Viral: నడి సముద్రంలో రెండు ముక్కలైన ఓడ… రెస్క్యూ ఆపరేషన్ వైరల్..
విజయలక్ష్మిని తనకిచ్చి పెళ్లి చేయమని శకుంతలను ఒప్పించడానికి ప్రయత్నించినట్లు ఇర్ఫాన్ విచారణలో వెల్లడించాడు. ఆమె చదువుతో అన్ని ఖర్చులు తానే భరిస్తానని కూడా చెప్పానని.. కానీ ఆమె దానికి ఒప్పుకోలేదని ఇర్ఫాన్ పోలీసులకు చెప్పాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో తాను ఖర్చు చేసిన డబ్బులను తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేసినట్లు చెప్పాడు. అదే గొడవకు దారి తీసిందని.. ఆవేశంతో కొడవలితో ఆమె చంపానని.. తాము పారిపోయే ముందు విజయలక్ష్మిని పట్టుకుని ఆమెను కూడా చంపామన్నారు. ఇర్ఫాన్, శకుంతల మధ్య 500 సార్లు ఫోన్లో మాట్లాడుకున్నట్లు ఇర్ఫాన్ కాల్ వివరాలు గమనిస్తే తెలిసినట్లు పోలీసులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!