Crime: యూపీలో తల్లీకూతుళ్ల దారుణహత్య.. ముగ్గురు అన్నదమ్ములు అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒక మహిళతో పాటు ఆమె 21 ఏళ్ల కుమార్తెను హత్య చేసిన కేసులో టెంట్ హౌస్ యజమానితో పాటు అతని ఇద్దరు సోదరులను ఉత్తరప్రదేశ్లోని సుల్తాన్పూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముగ్గురు సోదరులను ఇర్ఫాన్ (టెంట్ హౌస్ యజమాని), సదన్, షెహజాద్లుగా గుర్తించారు. మృతులు శకుంతల (40), ఆమె కుమార్తె విజయలక్ష్మి(21)గా గుర్తించారు. జూన్ 29న తల్లీకూతుళ్లు తమ ఇంట్లో హత్యకు గురయ్యారు. హత్యకు ఉపయోగించిన కొడవలిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కూరగాయల వ్యాపారి అయిన శకుంతల వద్ద రోజువారీ అవసరాలు తీర్చుకోవడానికి డబ్బులు లేవని సుల్తాన్పూర్ ఎస్పీ సోమెన్ బర్మా సోమవారం తెలిపారు. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ శకుంతలతో స్నేహంగా ఉంటూ చాలా డబ్బు ఖర్చు చేశాడు. ఆమెను తన లగ్జరీ కారులో ఎక్కించుకుని వెళ్లేవాడు. అప్పుడు ఇర్ఫాన్ ఆమె 21 ఏళ్ల కుమార్తెను చూశాడు. తన కుమార్తెను తన వద్దకు పంపాలని ఇర్ఫాన్ శకుంతలను అడగడంతో.. ఆమె అతనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కుమార్తె కూడా అతని ప్రతిపాదనను తిరస్కరించింది.ఈ విషయం శకుంతల, ఇర్ఫాన్ల మధ్య సంబంధాన్ని కూడా దెబ్బతీసిందని ఎస్పీ వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ తన ఇద్దరు సోదరులతో కలిసి తల్లీ కూతుళ్లను హత్య చేయాలని ప్లాన్ చేసినట్లు ఆయన తెలిపారు. జూన్ 29న, ఇర్ఫాన్ తన ఇద్దరు సోదరులతో కలిసి ఆమె భర్త లేని సమయంలో మహిళ నివాసంలోకి ప్రవేశించి, సదన్ను బయట కాపలాగా ఉండమని కోరాడు. మిగతా ఇద్దరు లోపలికి వెళ్లి తల్లీకూతుళ్లను కొడవలితో దారుణంగా హత్య చేశారు.
Also Read
- Ketan Agarwal Case: 'పెళ్లి నుంచి తప్పించుకోలేవు'.. కేతన్పై సియా గోయల్ సంచలన ఆరోపణ
- Ketan Agrawal Case: కేతన్ హత్యపై తొలిసారి స్పందించిన సీఎం ఫడ్నవిస్.. ఏమన్నారంటే..!
- Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయం వెండి ఇటుకలు మాయమయ్యాయా? సిట్ దర్యాప్తులో సంచలన నిజాలు!
- Ketan Agarwal Case: కోటేశ్వరుడైన కేతన్ను సియా ఎందుకు వద్దనుకుంది? దర్యాప్తులో సంచలన విషయాలు
Viral: నడి సముద్రంలో రెండు ముక్కలైన ఓడ… రెస్క్యూ ఆపరేషన్ వైరల్..
విజయలక్ష్మిని తనకిచ్చి పెళ్లి చేయమని శకుంతలను ఒప్పించడానికి ప్రయత్నించినట్లు ఇర్ఫాన్ విచారణలో వెల్లడించాడు. ఆమె చదువుతో అన్ని ఖర్చులు తానే భరిస్తానని కూడా చెప్పానని.. కానీ ఆమె దానికి ఒప్పుకోలేదని ఇర్ఫాన్ పోలీసులకు చెప్పాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో తాను ఖర్చు చేసిన డబ్బులను తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేసినట్లు చెప్పాడు. అదే గొడవకు దారి తీసిందని.. ఆవేశంతో కొడవలితో ఆమె చంపానని.. తాము పారిపోయే ముందు విజయలక్ష్మిని పట్టుకుని ఆమెను కూడా చంపామన్నారు. ఇర్ఫాన్, శకుంతల మధ్య 500 సార్లు ఫోన్లో మాట్లాడుకున్నట్లు ఇర్ఫాన్ కాల్ వివరాలు గమనిస్తే తెలిసినట్లు పోలీసులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Ketan Agarwal Case: ‘పెళ్లి నుంచి తప్పించుకోలేవు’.. కేతన్పై సియా గోయల్ సంచలన ఆరోపణ
-
Ketan Agrawal Case: కేతన్ హత్యపై తొలిసారి స్పందించిన సీఎం ఫడ్నవిస్.. ఏమన్నారంటే..!
-
OPEC: యూఏఈ బాటలో ఇరాక్.. ఒపెక్లో సౌదీ అరేబియా ఆధిపత్యానికి సవాల్..
-
Stainless Steel Railing Cleaning Tips: ఖరీదైన క్లీనర్లు కొనక్కర్లేదు.. ఇంట్లోనే స్టీల్ రెయిలింగ్లను మెరిపించే సీక్రెట్స్..
-
Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయం వెండి ఇటుకలు మాయమయ్యాయా? సిట్ దర్యాప్తులో సంచలన నిజాలు!
ట్రెండింగ్
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!